Ram Charan : తిరుమలకు చేరుకున్న రామ్ చరణ్..
సుప్రభాత సేవలో శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకోబోతున్నారు
- Author : Sudheer
Date : 26-03-2024 - 11:17 IST
Published By : Hashtagu Telugu Desk
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ రేపు (మార్చి 27) 39 వ ఏటా అడుగుపెట్టబోతున్నారు. ఈ సందర్బంగా రేపు ఉదయం సుప్రభాత సేవలో శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకోబోతున్నారు. ఈ నేపథ్యంలో మంగళవారం సాయంత్రం తన భార్య ఉపాసన తో పాటు ఆమె కుటుంబ సభ్యులతో కలిసి 8 గంటల ప్రాంతంలో ఫీనిక్ అతిథి గృహానికి చేరుకున్నారు. రేపు సుప్రభాత సేవలో శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని రామ్ చరణ్ కుటుంబ సభ్యులు దర్శించుకుంటారు. ఇక తిరుమలకు రామ్ చరణ్ చేరుకున్న విషయం తెలిసి పెద్ద ఎత్తున అభిమానులు ఫీనిక్ అతిథి గృహానికి చేరుకుంటున్నారు.
ఇక ఇదిలా ఉంటె రేపు చరణ్ నటిస్తున్న గేమ్ ఛేంజర్ మూవీ నుండి జరగండి సాంగ్ రిలీజ్ కాబోతుంది. డైరెక్టర్ శంకర్ (Shankar) – మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram CHaran) కలయికలో తెరకెక్కుతున్న మూవీ గేమ్ ఛేంజర్. దిల్ రాజు నిర్మాణంలో పాన్ ఇండియా మూవీ గా భారీ బడ్జెట్ తో రూపుదిద్దుకుంటుంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. ఈ క్రమంలో రేపు చరణ్ బర్త్ డే కానుకగా జరగండి సాంగ్ రిలీజ్ చేసి అభిమానుల్లో ఉత్సహం నింపేందుకు మేకర్స్ సిద్ధం అయ్యారు. ఈ సాంగ్ తెలుగుతోపాటు తమిళం, హిందీల్లోనూ రాబోతోంది. కాగా మొన్నటి వరకు ఈ సినిమా షూటింగ్ వైజాగ్ లో జరిగింది. దీని తాలూకా పిక్స్ కూడా సోషల్ మీడియా లో చక్కర్లు కొట్టాయి. ప్రస్తుతం హైదరాబాద్ లో తాజా షెడ్యూల్ జరుగుతుంది. ‘గేమ్ ఛేంజర్’లో చరణ్ సరసన బాలీవుడ్ భామ కియారా అద్వానీ నటిస్తోంది. ఇతర ప్రధాన పాత్రలను అంజలి, శ్రీకాంత్, ఎస్ జే సూర్య, సముద్రఖని, నవీన్ చంద్ర తదితరులు పోషిస్తున్నారు. దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా… తమన్ సంగీతాన్ని అందిస్తున్నారు.