Rajinikanth Maniratnam : రజిని మణిరత్నం.. ఫ్యాన్స్ కి సూపర్ న్యూస్..!
Rajinikanth Maniratnam ఈ సినిమా షూటింగ్ దాదాపు ముగింపు దశకు చేరుకుంది. ఇక మరోపక్క మణిరత్నం ఈ సినిమా పూర్తి కాగానే నెక్స్ట్ రజినితో సినిమా చేసేలా
- Author : Ramesh
Date : 06-10-2024 - 4:47 IST
Published By : Hashtagu Telugu Desk
Rajinikanth Maniratnam కొంతమంది స్టార్ డైరెక్టర్, హీరో కాంబో కోసం ఫ్యాన్స్ అంతా ఎంతో ఈగర్ గా ఎదురుచూస్తుంటారు. వారు చేసే సినిమాలకు ఒక రేంజ్ సెట్ చేసి ఉంటారు. అలాంటి సూపర్ హిట్ కాంబోనే మణిరత్నం, రజినికాంత్. ఈ కలయిక అనగానే అందరికీ దళపతి సినిమా గుర్తుకొస్తుంది. రజిని, మణిరత్నం (Maniratnam) ఈ కాంబో సినిమాకు ఫ్యాన్స్ అంతా ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. ఐతే 33 ఏళ్ల తర్వాత మళ్లీ ఈ కాంబోలో సినిమా రాబోతుందని తెలుస్తుంది.
ప్రస్తుతం మణిరత్నం కమల్ హాసన్ తో థగ్ లైఫ్ సినిమా చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ దాదాపు ముగింపు దశకు చేరుకుంది. ఇక మరోపక్క మణిరత్నం ఈ సినిమా పూర్తి కాగానే నెక్స్ట్ రజినితో సినిమా చేసేలా ప్లాన్ చేస్తున్నారు. రజిని, మణిరత్నం కాంబో అంటే నెక్స్ట్ లెవెల్ అంచనాలు ఉంటాయి.
థగ్ లైఫ్ పూర్తి కాగానే ఈ కలయికలో..
థగ్ లైఫ్ పూర్తి కాగానే ఈ కలయికలో సినిమా చేస్తారని తెలుస్తుంది. ఇప్పటికే రజిని (Rajinikanth) సినిమా కోసం కథ సిద్ధం చేశారని తెలుస్తుంది. సో సూపర్ స్టార్, మణిరత్నం ఫ్యాన్స్ కి ఇది సూపర్ న్యూస్ అని చెప్పొచ్చు. రజిని ప్రస్తుతం వేట్టయ్యన్ సినిమా చేస్తున్నారు. ఈ నెల 10న అది రిలీజ్ అవుతుంది.
ఆ తర్వాత లోకేష్ కనకరాజ్ డైరెక్షన్ లో సినిమా చేస్తున్నారు. కూలీ టైటిల్ తో వస్తున్న ఈ సినిమా విషయంలో కూడా సూపర్ స్టార్ ఫ్యాన్స్ ఎంతో ఎగ్జైటెడ్ గా ఉన్నారు.
Also Read : SBI Jobs : ఎస్బీఐలో 10వేల ఉద్యోగాల భర్తీ.. 600 కొత్త బ్రాంచీలు