Balagam Film: బలగం అభిమానులకు షాక్.. పోలీసులకు దిల్ రాజు ఫిర్యాదు!
సినిమా నిర్మాత దిల్ రాజు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
- By Balu J Published Date - 05:25 PM, Mon - 3 April 23
చిన్న సినిమాగా ప్రేక్షకుల ముందుకొచ్చిన బలగం మూవీ ప్రతిఒక్కరినీ ఆకట్టుకుంటోంది. తెలంగాణ మట్టి వాసనలు, బంధుత్వాలు, అప్యాయతలు, అనురాగాల నేపథ్యంలో రూపుదిద్దుకున్న ఈ మూవీకి జనాలు నీరాజనం పలుకుతున్నారు. దీంతో గ్రామాల్లో ప్రత్యేకంగా షోలు వేసుకొని సినిమాలు చూస్తున్నారు. అయితే గత వారం రోజులుగా ఈ ట్రెండ్ ఎక్కువవడంతో.. స్క్రీనింగ్ తాలుకా ఫొటోలు వీడియోలు నెట్టింట వైరల్ గా మారుతున్నాయి. దీంతో థియేటర్ రెవిన్యూకు గండి పడుతుందని భావించిన.. ఈ సినిమా నిర్మాత దిల్ రాజు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
నేరుగా నిజామాబాద్ ఎస్పీకి ఫిర్యాదు చేయడం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. అయితే ఆయన ఫిర్యాదులో.. కొందరు అమెజాన్ ప్రైమ్ నుంచి చట్ట వ్యతిరేకంగా సినిమాను డౌన్ లోడ్ చేసుకొని ఉచితంగా పబ్లిక్ కు పంచి పెడుతున్నాయని వాళ్ల మీద చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. అయితే బలగం సినిమా పట్ల విపరీతమైన ఆసక్తిని గమనించిన సర్పంచులు రాజకీయ నాయకులు వాళ్లను సంతోష పెట్టడం కోసం గ్రామాలు పెల్లెల్లో ఉచిత షోలు వేస్తున్నారు.
ఇదంతా ఇప్పుడు గొడవకు దారి తీసింది. ప్రైమ్ కు తెలియకుండానే ఇదంతా జరిగిపోయింది. అయితే సినిమా రిలీజ్ అయిన 20 రోజులకే ఓటీటీలో రిలీజ్ చేస్తే పరిస్థితి ఇలాగే ఉంటుందని సినీ విశ్లేషకులు చెబుతున్నారు. ఇప్పటికే చాలా గ్రామాల్లో ప్రత్యేకంగా షోలు వేయడంతో ఇతర గ్రామాల ప్రజలు సైతం ఆయా సర్పంచ్ లను సినిమాను వేయాలని డిమాండ్ చేస్తుండటం గమనార్హం.
Related News
Cyberabad: డ్రగ్ ను స్వాధీనం చేసుకున్న సైబరాబాద్ పోలీసులు
Cyberabad: సైబరాబాద్ ఎస్ఓటీ మాదాపూర్ టీం, కూకట్పల్లి పోలీస్ లు కూకట్పల్లి స్టేషన్ పరిధిలో ని శేషాద్రినగర్ లో ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకుని వారి వద్దనుండి 3 గ్రాముల MDMA డ్రగ్ ను స్వాధీనం చేసుకుని వారిని విచారిస్తున్నారు. బెంగళూరు లో పనిచేస్తున్న వీరి మిత్రుడైన ప్రేమ్ సాయి అనే యువకుడు వీరికి సప్లయి చేస్తున్నట్లు తెలుస్తోంది కూకట్ పల్లి పోలీసులు విచారిస్తున్నారు. మరొ