Pawan Kalyan : కుటుంబం తో కలిసి ఇటలీకి పయనమైన పవన్ కళ్యాణ్
నవంబర్ 01 న మెగా బ్రదర్ నాగబాబు తనయుడు వరుణ్ తేజ్ పెళ్లి ఇటలీ లో జరగబోతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో శుక్రవారం వరుణ్ - లావణ్య లు ఇటలీకి బయలు దేరగా..వారం క్రితమే రామ్ చరణ్, ఉపాసనలు ఇటలీకి వెళ్లడం జరిగింది
- By Sudheer Published Date - 12:43 PM, Sat - 28 October 23
సినీ నటుడు , జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) తన కుటుంబ సభ్యులతో కలిసి ఇటలీకి పయనమయ్యారు. నవంబర్ 01 న మెగా బ్రదర్ నాగబాబు తనయుడు వరుణ్ తేజ్ పెళ్లి (Varun Tej- Lavanya Wedding) ఇటలీ (Italy ) లో జరగబోతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో శుక్రవారం వరుణ్ – లావణ్య లు ఇటలీకి బయలు దేరగా..వారం క్రితమే రామ్ చరణ్, ఉపాసనలు ఇటలీకి వెళ్లడం జరిగింది.
We’re now on WhatsApp. Click to Join.
ఈరోజు పవన్ కళ్యాణ్ , తన సతీమణితో కలిసి ఇటలీకి బయలుదేరారు. ఎన్నికల నేపథ్యంలో బిజీగా ఉన్న పవన్… ఇటలీకి వెళ్తారా? లేదా? అనే విషయంలో కొంత సందేహం ఉండేది. అయితే ఈ సందేహాలకు ముగింపు పలుకుతూ పవన్ తన భార్యతో కలిసి ఎయిర్ పోర్టులో ప్రత్యక్షమయ్యారు. దీనికి సంబదించిన పిక్స్ , వీడియోస్ సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతున్నాయి.
ఇక రీసెంట్ గా వరుణ్- లావణ్య పెళ్లి శుభలేఖ నెట్టింట వైరల్ గా మారిన సంగతి తెలిసిందే. వరుణ్, లావణ్య.. ఇద్దరి పేర్లలోని తొలి అక్షరాలు V,Lలను కార్డు పై భాగంలో డిజైన్ చేశారు. కార్డు లోపల వరుణ్ నానమ్మ-తాతయ్యల పేర్లు పెట్టారు. అందులో నవంబర్ 1 న ఇటలీలో పెళ్లి జరగనుంది. నవంబర్ 5 న హైదరాబాద్ లోని N కన్వెన్షన్ లో రిస్పెషన్ ఉండనుంది అని ఉంది. ఇక ఈ రిసెప్షన్ కు టాలీవుడ్ ప్రముఖులందరు హాజరుకానున్నారు. ఇక ఈ పెళ్ళికి సంబంధించిన పనులన్నీ ఉపాసన దగ్గర ఉండి చూసుకుంటుందని తెలుస్తోంది.
Read Also : Jeevan Reddy : 70 స్థానాలతో తెలంగాణాలో అధికారంలోకి రాబోతున్నాం – ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ధీమా
Related News
Pawan Kalyan: కూటమి 130 స్థానాల్లో విజయం సాధిస్తుంది: పవన్ కల్యాణ్
ఆంధ్రప్రదేశ్లో జరగనున్న ఎన్నికల్లో టీడీ-జేఎస్-బీజేపీ కూటమి విజయంపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ విశ్వాసం వ్యక్తం చేశారు.