HariHara VeeraMallu : టీజర్ అప్డేట్ ఇచ్చిన హరిహర వీరమల్లు..
నేడు శ్రీరామనవమి సందర్భంగా హరిహర వీరమల్లు నుంచి టీజర్ అప్డేట్ ని ఇచ్చారు.
- By News Desk Published Date - 10:24 AM, Wed - 17 April 24
HariHara VeeraMallu : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మొదటిసారి వారియర్ నటిస్తున్న పీరియాడిక్ యాక్షన్ మూవీ ‘హరిహర వీరమల్లు’. క్రిష్ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రాన్ని ఏ ఎం రత్నం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఆల్రెడీ 50 శాతం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం.. పవన్ పొలిటికల్ కార్యకలాపాలు వాళ్ళ ప్రస్తుతానికి నిలిచిపోయింది. ఏపీ ఎన్నికల తరువాత ఈ మూవీ షూటింగ్ ని స్టార్ట్ చేసి శరవేగంగా చిత్రీకరణ పూర్తి చేయనున్నారు.
కాగా ఈ మూవీ నుంచి ఇప్పటివరకు ఒక చిన్న గ్లింప్స్, మూడు నాలుగు పోస్టర్ లు తప్ప మరో అప్డేట్ లేదు. అయితే నేడు శ్రీరామనవమి సందర్భంగా మూవీ నుంచి టీజర్ అప్డేట్ ని ఇచ్చారు. పండుగ సందర్భంగా మూవీ నుంచి ఓ పోస్టర్ రిలీజ్ చేస్తూ త్వరలో టీజర్ మీ ముందుకు రాబోతుంది అంటూ తెలియజేసారు. కానీ టీజర్ రిలీజ్ డేట్ ని మాత్రం అనౌన్స్ చేయలేదు. ఈ టీజర్ తోనే సినిమా రిలీజ్ డేట్ పై కూడా ఓ క్లారిటీ ఇవ్వనున్నారని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తుంది.
జై శ్రీరామ్… శ్రీరామనవమి శుభాకాంక్షలతో… 🏹
మీ ముందుకు… ‘ధర్మం కోసం యుధ్ధం‘ త్వరలో! #HariHaraVeeraMallu Teaser Out Soon! 🔥@PawanKalyan @DirKrish @thedeol @AgerwalNidhhi @mmkeeravaani @AMRathnamOfl @ADayakarRao2 @rathinamkrish @gnanashekarvs @cinemainmygenes pic.twitter.com/gqopvkFtWb
— Mega Surya Production (@MegaSuryaProd) April 17, 2024
మరి టీజర్ ని ఎప్పుడు రిలీజ్ చేస్తారు, మూవీని ఎప్పుడు థియేటర్స్ లోకి తీసుకు వస్తారు అనేవి తెలియాలంటే.. ఇంకొన్ని రోజులు వేచి చూడాల్సిందే. కాగా ఈ సినిమాలో నిధి అగర్వాల్ హీరోయిన్గా నటిస్తుంటే.. బాలీవుడ్ స్టార్స్ బాబీ డియోల్, నోరా ఫతేహి మొఘల్ చక్రవర్తులుగా కనిపించబోతున్నారు. ఎం ఎం కీరవాణి ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.
కాగా పవన్ చేతిలో ఈ సినిమాతో పాటు OG, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలు కూడా ఉన్నాయి. OG మూవీ షూటింగ్ చివరి దశలో ఉంది. పవన్ కి సంబంధించిన ఓ షెడ్యూల్ చేస్తే మూవీ మొత్తం ఆల్మోస్ట్ ఫినిష్ అయ్యిపోతుందట. ఈ షెడ్యూల్ పూర్తి చేసిన తరువాతే పవన్.. వీరమల్లుకు డేట్స్ ఇవ్వనున్నారని తెలుస్తుంది.
Related News
Pithapuram : బులుగు మీడియా బద్దలే..!
మొన్నటికి మొన్న, సాక్షి, బ్లూ మీడియాలోని ఒక విభాగం డిసెంబర్లో ఇండియా టుడే మూడ్ ఆఫ్ ది నేషన్ ఒపీనియన్ పోల్లో జగన్ మోహన్ రెడ్డి అద్భుతమైన మెజారిటీతో అధికారంలోకి వస్తున్నట్లు ఒక నివేదికను ప్రచురించింది.