New Talent: వెండితెరకు ‘‘కొత్త’’ గొంతులు!
‘ఒక ఛాన్స్’ అంటూ స్టూడియోల చుట్టూ తిరుగాల్సిన అవసరం లేదు. తమలోని కళను బయటపెట్టేందుకు ఎవరినో ప్రాధేయపడాల్సిన అవసరమూ అంతకంటే లేదు. ఎందుకంటే..
- By Balu J Published Date - 04:25 PM, Sat - 11 December 21
‘ఒక ఛాన్స్’ అంటూ స్టూడియోల చుట్టూ తిరుగాల్సిన అవసరం లేదు. తమలోని కళను బయటపెట్టేందుకు ఎవరినో ప్రాధేయపడాల్సిన అవసరమూ అంతకంటే లేదు. ఎందుకంటే.. ఇప్పుడు టాలెంట్ ఎక్కడ ఉంటే అక్కడికే అవకాశాలు వెతుక్కుంటూ మరీ వస్తున్నాయి. మన దర్శకులు, నిర్మాతల చూపు కొత్తవాళ్లపై మళ్లుతోంది. మొగులయ్య ఓ సాధారణ కిన్నెర వాయిద్య కళాకారుడు. ఒక్క పూట కూడా కడుపు నిండా తినలేని పేదరికం. అయినా కూడా ఆయన కళను విడిచిపెట్టలేదు. అదే మొగులయ్య మంచి అవకాశం తెచ్చిపెట్టింది. భీమ్లానాయక్ టైటిల్ సాంగ్ పాడి దుమ్మురేపాడు. తనలాంటివాళ్ల కళాకారులకు బాటలు వేశాడు. ప్రస్తుతం కిన్నెర మొగులయ్య, మౌనిక యాదవ్, కుమ్మరి దుర్గవ్వ, ఇంద్రావతి చౌహన్ గొంతులు తెలుగు తెరపై సందడి చేయబోతున్నాయి.
ఇంద్రావతి చౌహాన్
బన్నీ, సుక్కు కాంబినేషన్ అంటేనే మంచి మస్ మాసాలా సాంగ్స్ గుర్తుకువస్తాయి. మరి అలాంటి కాంబినేషన్ వస్తున్న ప్రత్యేక గీతాన్ని పాడే అవకాశం దక్కించుకోవాలంటే చాలా కష్టమే. మొదటి ప్రయత్నంలోనే మంచి అవకాశాన్ని అందుకుందీ ఈ అమ్మాయి. రీ సెంట్ గా వచ్చిన పుష్ప సినిమాలోని 5th సింగిల్ సమంత స్పెషల్ సాంగ్ “ఊ అంటావా? ఊఊ అంటావా??” పాట వెండితెరకు ఒక కొత్త గొంతులో వినిపించింది.. ఈ పాట పాడింది ఇంద్రావతి చౌహాన్.. పాపులర్ సింగర్ మంగ్లీ చెల్లి. అక్క బాటలోనే చెల్లి కూడా పాటల ప్రయాణం చేస్తోంది. ఇప్పటికే సింగర్ మంగ్లీ తనకంటూ పేరు తెచ్చుకుంది. ఇప్పుడు ఇంద్రావతి కూడా తన గొంతుతో ఆకట్టుకోబోతోంది.
మౌనిక యాదవ్
పుష్ప సినిమాలో ఇంతకు ముందుకే వచ్చి సూపర్ డూపర్ హిట్ అయిన పాట “సామీ.. సామీ” ఈ పాట పాడింది మౌనిక యాదవ్. తెలంగాణ ఫోక్ సింగర్. యూట్యూబ్లో ఈమెవి చాలా సూపర్ హిట్ పాటలున్నయి. ముఖ్యంగా ఫోక్ సాంగ్స్ పాడటంలో మౌనిక కు మంచి పేరుంది. గతంలో ఆమె చేసిన ఆల్బ్సమ్ బాగా పాపులర్ అయ్యాయి. ఈమె గొంతు డిఫరెంట్ గా, ప్రత్యేకంగా ఉండటంతో పుష్ప అవకాశం తలుపు తట్టింది.
కిన్నెర మొగులయ్య
టాలీవుడ్ లో జనపదాల హోరు వినిపిస్తోంది. చిన్న చిన్న సినిమాలకే కాకుండా.. పెద్ద సినిమాలు సైతం జనపదం జపం చేస్తున్నాయి. ఇప్పటికే రాములోరాములా.. సారంగదరియా.. లాంటి పాటలు మంచి హిట్ అయ్యాయి. పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ‘భీమ్లానాయక్‘ మూవీలో టైటిల్ సాంగ్ ఎంత హిట్టయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. తెలంగాణలోని నాగర్ కర్నూలు జిల్లా నల్లమల ప్రాంతానికి చెందిన కిన్నెర వాద్య కళాకారుడు దర్శనం మొగులయ్య పేరు తెలుగు రాష్ట్రాల్లో ఒక్కసారిగా మార్మోగిపోతోంది. పవన్ కళ్యాన్ పుట్టినరోజు సందర్భంగా టైటిల్ సాంగ్ పాడే అవకాశం దక్కించుకున్నాడు. ఆ పాటను యూట్యూబ్లో విడుదల చేయగా 10 గంటల్లో 6 లక్షల మిలియన్లకు పైగా వ్యూస్ సాధించింది.
కుమ్మరి దుర్గవ్వ
తాజాగా ‘భీమ్లానాయక్’ అడవి తల్లి మాట అనే లిరికల్ వీడియో సాంగ్ ను చిత్ర బృందం విడుదల చేసింది. ‘అడవి తల్లి మాట’ పాటకు థమన్ అదిరిపోయే ట్యూన్ ను సమకూర్చడు. ఈ పాట కు రామజోగయ్య శాస్త్రి సాహిత్యం ని అందించాడు. ఈ పాట ని జానపద గాయని కుమ్మరి దుర్గవ్వ మరియు సాహితీ చాగంటి కలిసి ఆలపించారు. ముఖ్యంగా దుర్గవ్వ పాటకు ప్రతిఒక్కరూ పిధా అవుతున్నారు. దుర్గవ్వకు చిన్నప్పట్నుంచే జనపదాలు అంటే చాలా ఇష్టం. గతంలో ఈమె పాడిన ‘టుంగూరమే’ అనే పాట అందర్ని ఆకట్టుకోవడంతో.. భీమ్లానాయక్ లో పాడే అవకాశం వచ్చింది. ఈమె తెలుగు పాటలే కాకుండా మరాఠీ పాటలు కూడా పాడుతోంది
Tags
Related News
Ashu Reddy : నా బాడీ సూపర్ డీలక్స్ అంటున్న అషు రెడ్డి..!
Ashu Reddy జూనియర్ సమంతగా గుర్తింపు తెచ్చుకున్న అషు రెడ్డి బిగ్ బాస్ తో పాపులారిటీ తెచ్చుకుంది. కొన్నాళ్లు బుల్లితెర మీద షోలు చేసిన అమ్మడు ఆర్జీవితో కలిసి చేసిన ఇంటర్వ్యూ ఆమెను వైరల్ అయ్యేలా