Nagarjuna Meets CM Revanth : సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన సినీ నటుడు అక్కినేని నాగార్జున
- By Sudheer Published Date - 01:03 PM, Sat - 30 December 23
తెలంగాణ సీఎం (Telangana CM) గా భాద్యతలు చేపట్టిన రేవంత్ రెడ్డి (Revanth Reddy) ని ఈరోజు శనివారం అక్కినేని నాగార్జున (Nagarjuna) దంపతులు కలిసి శుభాకాంక్షలు తెలిపారు. సీఎం రేవంత్ను మర్యాదపూర్వకంగా కలిసి ఆయనకు పుష్పగుచ్చం అందజేశారు. రేవంత్ రెడ్డి సీఎం అయిన తర్వాత నాగార్జున దంపతులు ఆయన్ను కలవడం ఇదే మొదటిసారి. రేవంత్ రెడ్డి సీఎం అయినప్పటి నుంచి ఆయనకు రాజకీయ నేతలు , సినీ ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేయటానికి ఆయన ఇంటికి వస్తూనే ఉన్నారు. ఇటీవలే మెగాస్టార్ చిరంజీవి కూడా రేవంత్ రెడ్డిని కలిసారు. కాగా రేవంత్ రెడ్డితో సినీ పరిశ్రమ గురించి మాట్లాడాలని పలువురు సినీ పెద్దలు భావిస్తున్నట్లు సమాచారం.
We’re now on WhatsApp. Click to Join.
ఇక నాగ్ విషయానికి వస్తే.. నాగార్జున (Nagarjuna) , ఆషికా రంగనాథ్ (Ashika Ranganath) జంటగా అల్లరి నరేష్ (Allari Naresh) , రాజ్ తరుణ్ (Raj Tarun) ప్రధాన పాత్రలో ఫేమస్ కొరియోగ్రాఫర్ విజయ్ బిన్ని దర్శకుడిగా చేస్తున్న మూవీ ‘నా సామిరంగ’. గత కొంతకాలంగా సరైన హిట్ లేని నాగ్..ఈ సినిమా ఫై గప్పెడు ఆశలు పెట్టుకున్నాడు. ఇప్పటికే ఈ సినిమా తాలూకా ట్రైలర్ , సాంగ్స్ , పోస్టర్స్ ప్రతిదీ సినిమా ఫై పాజిటివ్ బజ్ తీసుకొచ్చాయి. ప్రస్తుతం షూటింగ్ అంత పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా జనవరి 14 న ప్రేక్షకుల ముందుకు తీసుకరాబోతున్నట్లు మేకర్స్ అధికారిక ప్రకటన చేసారు.
Read Also : Sharmila : కాంగ్రెస్ చేతిలో షర్మిల అస్త్రం
Tags
Related News
Hyderabad – June 2 : జూన్ 2 నుంచి తెలంగాణదే హైదరాబాద్.. సీఎం రేవంత్ కసరత్తు
ఉద్యోగుల కేటాయింపు, ఆస్తులు, అప్పుల విభజనకు సంబంధించిన పూర్తి వివరాలతో నివేదిక తయారు చేయాలని అధికారులను రేవంత్రెడ్డి ఆదేశించారు.