Bigg Boss Telugu 6: షోకి తిని,పడుకోడానికి వచ్చారా.. వీకెండ్ ఎపిసోడ్లో నాగార్జున ఫుల్ ఫైర్!
బిగ్ బాస్ ప్రేమికులు అందరు బిగ్ బాస్ సీజన్ 6 రెండవ వారం ఎలిమినేషన్ విషయం గురించి తెలుసుకోవడానికి చాలా ఆసక్తిని ఎదురుచూస్తున్నారు
- By Nakshatra Published Date - 08:50 PM, Sat - 17 September 22
బిగ్ బాస్ ప్రేమికులు అందరు బిగ్ బాస్ సీజన్ 6 రెండవ వారం ఎలిమినేషన్ విషయం గురించి తెలుసుకోవడానికి చాలా ఆసక్తిని ఎదురుచూస్తున్నారు. బిగ్ బాస్ సీజన్ సిక్స్ రెండవ వారం ఎలిమినేషన్ లో ఎటువంటి ట్విస్ట్ లు ఉండబోతున్నాయి అని ఎదురు చూస్తూ ఉండగా ఇంతలోనే ప్రోమో తో ప్రేక్షకులకు ఒక్కసారిగా షాక్ ఇచ్చారు బిగ్ బాస్ నిర్వాహకులు. తాజాగా ప్రోమోతో ఊహించని షాక్ ఇచ్చారు నాగార్జున. ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్లో 21 మంది కంటెస్టెంట్లు ఉన్న విషయం తెలిసిందే.
అయితే హౌస్ లో వారిలో ఒకరిద్దరు తప్పితే మిగిలిన వాళ్లందరు కూడా తిన్నామా.. పడుకున్నామా.. తెల్లారిందా అన్న విధంగా ఉన్నారు. ఇక హౌస్ లో శ్రీ సత్య, వాసంతి,క్రిష్ణన్లు అయితే కేవలం స్కిన్ షో చేయడానికి మేకప్లు కొట్టుకోవడానికి తప్పితే ఆట ఆడినట్లు కనిపించలేదు. అభినయ శ్రీ అయితే హౌస్లో ఉందా లేదా అన్న అనుమానాలు వస్తున్నాయి. ఇలా చాలామంది కంటెస్టెంట్లు హౌస్ లో ఉన్నా కూడా టాస్కులతో ఏమి సంబంధం లేదు అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు.
అయితే తాజాగా నాగార్జున తిన్నామా పడుకున్నామా తెల్లారిందా అన్న బ్యాచ్ మొత్తానికి దిమ్మతిరిగే షాక్ ఇచ్చారు నాగార్జున. బాలాదిత్య, షానీ, సుదీపా, వాసంతి, శ్రీసత్య, అభినయ శ్రీ, కీర్తి, శ్రీహాన్, మెరీనా,రోహిత్లకు కుండ పగలగొడుతున్నారు నాగ్. అయితే అసలు మీరు బిగ్ బాస్ హౌస్కి వచ్చింది గేమ్ ఆడటానికి వాచ్చారా? లేక చిల్ అవ్వడానికా? అంటూ క్లాస్ పీకారు. తింటానికి పంటానికి వచ్చినట్లయితే బ్యాగ్ సర్దుకుని వెళ్లిపోండి అంటూ గట్టిగానే వార్నింగ్ ఇచ్చారు నాగార్జున. అయితే ఇక గతవారం నో ఎలిమినేషన్ అని ట్విస్ట్ ఇచ్చిన నాగార్జున రెండవ వారం డబుల్ ఎలిమినేషన్ అంటూ బాంబ్ పేల్చారు. అయితే ఆటాడని తొమ్మిది మందిలో ఆల్రెడీ ముగ్గురు నామినేషన్స్లో ఉండగా మిగిలిన తొమ్మిది మంది బ్యాగ్లు సర్దుకుని స్టోర్ రూంలో పెట్టమని చెప్పారు నాగార్జున.
Related News
Bigg Boss 7 : బిగ్బాస్ తెలుగు సీజన్ 7.. 14 మంది కంటెస్టెంట్స్ వీళ్ళే.. ఎవరెవరు ఉన్నారంటే..
ఈ సారి బిగ్బాస్ హౌస్ లో ఉన్న 14 మంది కంటెస్టెంట్స్(Bigg Boss Contestants) వీళ్ళే..