చైతూ కొత్త అపార్ట్ మెంట్ కు షిఫ్ట్ అవుతున్నాడా..?
టాలీవుడ్ బ్యూటిఫుల్ కపుల్ నాగచైతన్య, సమంత డివోర్స్ తీసుకొని పదిరోజులు గడుస్తున్నా.. ఇప్పటికీ వాళ్లిద్దరికి సంబంధించిన ఏదో ఒక న్యూస్ వైరల్ అవుతూనే ఉంది. ఈమధ్యనే తనపై వస్తున్న రూమర్స్ పై సమంత స్పందించి..
- By Balu J Published Date - 03:19 PM, Tue - 12 October 21
టాలీవుడ్ బ్యూటిఫుల్ కపుల్ నాగచైతన్య, సమంత డివోర్స్ తీసుకొని పదిరోజులు గడుస్తున్నా.. ఇప్పటికీ వాళ్లిద్దరికి సంబంధించిన ఏదో ఒక న్యూస్ వైరల్ అవుతూనే ఉంది. ఈమధ్యనే తనపై వస్తున్న రూమర్స్ పై సమంత స్పందించి.. తనకు ఎవ్వరితోనూ అఫైర్స్ లేవని, తాను అబార్షన్ కూడా చేయించుకోవాలని స్పష్టం చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా నాగచైతన్య కొత్తింట్లోకి మారుతున్నాడనే వార్త ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇందులో భాగంగా హైదరాబాద్ లో ఓ ఖరీదైన అపార్ట్ మెంట్ కు షిప్ట్ అవుకాబోతున్నాడు. చైతూ అభిరుచికనుగుణంగా కొత్త అపార్ట్ మెంట్ ఇన్నోవేషన్ ఉంటుందట. పూర్తయిన వెంటనే కొత్తింట్లో అడుగుపెట్టబోతున్నట్టు టాలీవుడ్ లో టాక్ నడుస్తోంది. సమంత మాత్రం ఎప్పటిలాగే గచ్చిబౌలిలోనే ఉంటున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి ఉండే అవకాశం ఉన్నప్పటికీ, చైతూ మాత్రం ఒంటరిగానే ఉండేందుకు ఇష్టం చూపుతున్నాడు.
‘ఏమాయే చేసావే’ మూవీతోనే ప్రేమలో పడ్డ చైసామ్ ఇరువురి పెద్దలను ఒప్పించి మరి 2017 జనవరిలో రింగ్స్ మార్చుకున్నారు. ఆ తర్వాత హిందూ, క్రిస్టియన్ కల్చర్ ప్రకారం ఈ జంట పెళ్లి ఘనంగా జరిగింది. గోవాలో అత్యంత వైభవంగా వీరిద్దరి మార్యేజ్ జరిగింది. ఈ వివాహ వేడుకకు సినీ ఇండస్ట్రీకి సంబంధించిన కొంతమంది ప్రముఖులు సైతం అతిథులు అటెండ్ అయ్యారు. ‘మూడు పువ్వులు, ఆరు కాయలు’ అన్నట్టు సాగిపోతున్న వీరి వివాహ బంధానికి ఒక్కసారిగా బ్రేక్స్ పడటంతో అభిమానులు జీర్ణించుకోలేకపోయారు. విడాకుల వ్యవహరం ఫ్యాన్స్ కు తీవ్ర నిరాశను మిగిల్చింది.
ఎన్నో ఆలోచనలు.. సంప్రదింపులు తర్వాత భార్యాభర్తలుగా కొనసాగలేమని, ఎవరి సొంత మార్గాల్లో వాళ్లు నడుచుకోవాలని నిర్ణయించుకున్నామని, ఇలాంటి కష్టకాలంలో అభిమానులు అండగా ఉండాలని, తమ ప్రైవసీకి ఇబ్బందులు కలించకూడదని చైసామ్ రిక్వెస్ట్ చేసిన విషయం అందరికీ తెలిసిందే. కాగా సమంత పర్సనల్ స్టైలిస్ట్ ప్రీతమ్ జుకాల్కర్ రియాక్ట్ అవుతూ తాను సమంతను అక్కా అని పిలుస్తానని, ఈ విషయం చాలా మందికి తెలుసని చెప్పాడు. ఇక తమ మధ్య ఎఫైర్ ఎందుకు ఉంటుందని తనపై వస్తున్న రూమర్స్ పై క్లారిటీ ఇచ్చాడు.
Related News
Padamati Kondallo: ‘పడమటి కొండల్లో’ ఫస్ట్ లుక్ ను విడుదల చేసిన సుప్రీమ్ హీరో సాయి దుర్గ తేజ్
Padamati Kondallo: సుప్రీమ్ హీరో సాయి దుర్గ తేజ్ ‘ఎక్స్’ వేదికగా ‘పడమటి కొండల్లో’ ఫస్ట్లుక్ పోస్టర్ను విడుదల చేశారు. శ్రీదేవి క్రియేషన్స్ బ్యానర్ పై విన్విత ఎంటర్టైన్మెంట్స్ సమర్పణ ద్వారా జయకృష్ణ దురుగడ్డ నిర్మాతగా ఈ ‘పడమటి కొండల్లో’ చిత్ర నిర్మాణం జరిగింది. ఈ సినిమాకి దర్శకత్వం వహించిన నరేష్ పెంట, సంగీతాన్ని కూడా అందించారు. అనురోప్ కటారి హీరో గా నటిస్తున్న ఈ ‘పడమటి కొండ