Mega Updates: చిరంజీవి దూకుడు, మరో రెండు సినిమాలకు మెగాస్టార్ గ్రీన్ సిగ్నల్
పరాజయాలతో సంబంధం లేకుండా సినిమాలు చేసేందుకు చిరంజీవి సిద్దమవుతున్నాడు
- By Balu J Published Date - 05:36 PM, Mon - 21 August 23
భోళా శంకర్ సినిమాతో మెగాస్టార్ చిరంజీవి ఘోర పరాజయాన్ని చవిచూశారు. దీంతో చిరు సినిమాల నుంచి కొంత గ్యాప్ తీసుకుంటున్నాడని, న్యూఢిల్లీలో మోకాలికి శస్త్రచికిత్స చేయించుకున్నాడని వార్తలు వినిపించాయి. ఇక మెగా స్టార్ కొత్త సినిమాలేవీ అంగీకరించరని రూమర్స్ వినిపించాయి. కానీ ఆ పుకార్లకు చెక్ పెడుతూ చిరంజీవి మరింత దూకుడు పెంచారు. పరాజయాలతో సంబంధం లేకుండా సినిమాలు చేసేందుకు సిద్దమవుతున్నాడు. అయితే ముందస్తు ప్రణాళిక ప్రకారం మెగాస్టార్ మరో రెండు భారీ బడ్జెట్ సినిమాలకు గ్రీన్ ఇవ్వనున్నట్టు సమాచారం.
చిరంజీవి ఈ సినిమాల షూటింగ్లను ఒకేసారి చేసే ప్లాన్లో ఉన్నాడు. చిరంజీవి కళ్యాణ్ కృష్ణతో కలిసి ఓ కామిక్ ఎంటర్టైనర్లో పని చేయనున్నారు. కూతురు సుష్మిత కొణిదెల ఈ ప్రాజెక్ట్ను నిర్మించనున్నట్టు రేపు ప్రకటించనున్నారు. వశిష్ట దర్శకత్వం వహించే సోషియో-ఫాంటసీ చిత్రానికి చిరంజీవి ఓకే చెప్పాడు. యూవీ క్రియేషన్స్ ఈ ప్రాజెక్ట్ను నిర్మిస్తుంది. ఈ చిత్రానికి సంబంధించిన ప్రకటన కూడా రేపు రాబోతోంది.
కాగా భోళా శంకర్ చిరు కెరీర్ లో డిజాస్టర్ గా నిలిచిపోయింది. ఈ సినిమా ప్రీరిలీజ్ బిజినెస్ రూ.79 కోట్లు కాగా.. ఫస్ట్ వీకెండ్ ముగిసే సమయానికి రూ.40 కోట్ల గ్రాస్ మాత్రమే వసూలు చేసి షాక్ ఇచ్చింది. ఈ మొత్తంలో షేర్ కేవలం రూ.25 కోట్లు మాత్రమే. అంటే బ్రేక్ ఈవెన్ టార్గెట్ అయిన రూ.80 కోట్లకు మరో రూ.55 కోట్ల దూరంలో ఉంది. ఈ లెక్కన బ్రేక్ ఈవెన్ అందుకోవడం అసాధ్యమే. ఈ క్రమంలో భోళా శంకర్ డిజాస్టర్ గా మిగిలిపోనుంది. దాదాపు చాలా చోట్లి థియేటర్ రన్ ముగిసినట్లే అంటున్నారు. ఈ నేపధ్యంలో ఈ చిత్రం 55 కోట్ల నష్టం వచ్చినట్లు ట్రేడ్ అంచనా వేస్తోంది.
Also Read: Tomato Prices: భారీగా తగ్గిన టమాటా ధరలు, ఆనందంలో మహిళలు
Related News
TS : ఎన్నికల వేళ యువతకు మెగాస్టార్ సందేశం
Telangana Lok Sabha elections: తెలంగాణలో లోక్సభ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభం కాగా, మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) తన ఓటు హక్కును వినియోగించున్నారు. హైదరాబాద్ జూబ్లీక్లబ్లో చిరంజీవి దంపతులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. అనంతరం మెగాస్టార్ మీడియాతో మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యంలో వజ్రాయుధమైన ఓటును యువత సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. We’re now on WhatsApp.