SSMB29: మహేష్ బాబు, రాజమౌళి ప్రెస్ మీట్ అదిరిపోవాలంతే
మహేష్ బాబు, రాజమౌళి కాంబినేషన్లో భారీ పాన్ వరల్డ్ మూవీని దుర్గా ఆర్ట్స్ బ్యానర్ పై డా.కె.ఎల్ నారాయణ నిర్మిస్తున్నారు. ఈ సినిమా కోసం జక్కన్న ప్లాన్ మామూలుగా లేదు. ఓ రేంజ్ లో ఉంది.
- By Praveen Aluthuru Published Date - 11:39 PM, Thu - 7 March 24
SSMB29: మహేష్ బాబు, రాజమౌళి కాంబినేషన్లో భారీ పాన్ వరల్డ్ మూవీని దుర్గా ఆర్ట్స్ బ్యానర్ పై డా.కె.ఎల్ నారాయణ నిర్మిస్తున్నారు. ఈ సినిమా కోసం జక్కన్న ప్లాన్ మామూలుగా లేదు. ఓ రేంజ్ లో ఉంది. సినిమా షూటింగ్ స్టార్ట్ చేసే ముందు ప్రెస్ మీట్ పెట్టి సినిమాను అనౌన్స్ చేయడం జక్కన్న స్టైల్. ఈసారి కూడా అలాగే ప్రెస్ మీట్ పెట్టి మరీ.. మహేష్ బాబుతో చేయనున్న పాన్ వరల్డ్ మూవీని అనౌన్స్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారని తెలిసింది.
అయితే.. ఈ సినిమా అనౌన్స్ మెంట్ ను డిఫరెంట్ గా.. ఇప్పటి వరకు ఎవరూ చేయని విధంగా చేయాలని ప్లాన్ చేస్తున్నారట. ఇంతకీ విషయం ఏంటంటే.. ఈ ప్రెస్ మీట్ కు జేమ్స్ కెమెరాన్, స్పీల్ బర్గ్ ను ఆహ్వానిస్తున్నారట. వీరిద్దరూ రావడం కుదరకపోతే.. ఇద్దరిలో ఒకరినైనా ఈ ప్రెస్ మీట్ కు తీసుకురావాలి అనుకుంటున్నారట. దీని కోసం ఆల్రెడీ రాజమౌళి కుమారుడు కార్తికేయ రంగంలోకి దిగాడని.. ప్రస్తుతం దీనికి సంబంధించి టాక్స్ జరుగుతున్నాయని ఇండస్ట్రీ ఇన్ సైడ్ న్యూస్. ఇదే కనుక జరిగితే.. ఈ మూవీ అనౌన్స్ మెంట్ కు హాలీవుడ్ దిగ్గజాలు వస్తే.. ఇంటర్నేషనల్ రేంజ్ లో సినిమాకు క్రేజ్ వస్తుంది.
అందుకనే జక్కన్న ఇలా ప్లాన్ చేశారని టాక్ బలంగా వినిపిస్తోంది. జరుగుతున్న ప్రచారం చూస్తుంటే.. ఇదంతా నిజమే అనిపిస్తోంది. ఈ పాన్ వరల్డ్ మూవీకి ఆస్కార్ అవార్డ్ విన్నర్ కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఇందులో నటించే నటీనటులు, సాంకేతిక నిపుణుల ఎంపిక జరుగుతుంది. త్వరలోనే పూర్తి వివరాలను ప్రకటించనున్నారు. మహేష్ బాబు ఆల్రెడీ ఈ మూవీ కోసం వర్కవుట్స్ చేస్తున్నారు. మహేష్ బాబు తన సినిమా ఓపెనింగ్ కి రారు. దీంతో ఈ సినిమా ప్రారంభోత్సవానికి వస్తారా..? రారా..? అనేది ఆసక్తిగా మారింది. మొత్తానికి జక్కన్న ప్లాన్ సూపర్ గా ఉంది. మరి.. సినిమా ఏ రేంజ్ లో సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో చూడాలి.
Also Read: WPL 2024: 42 పరుగుల తేడాతో యూపీ వారియర్స్పై ముంబై ఇండియన్స్ విజయం
Related News
Celebrities Vote : చిరు, చెర్రీ, ఎన్టీఆర్, మహేష్బాబు ఓటు వేసే పోలింగ్ కేంద్రాలివే
Celebrities Vote : రేపే తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లో ఓట్ల పండుగ జరగబోతోంది.