Balakrishna-Ntr: బాలయ్యపై పోటీకి దిగుతున్న ఎన్టీఆర్.. ఒకేసారి రీ రిలీజ్ కాబోతున్న బ్లాక్ బస్టర్ మూవీస్?
- By Sailaja Reddy Published Date - 10:30 AM, Thu - 22 February 24
ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో రీ రిలీజ్ ల ట్రెండ్ నడుస్తున్న విషయం తెలిసిందే. గతంలో సూపర్ హిట్,అట్టర్ ఫ్లాప్ అయిన సినిమాలను హీరోల పుట్టినరోజు సందర్భంగా ఆ సినిమాలను థియేటర్ లలో రీ రిలీజ్ చేస్తున్నారు. అందులో బాగానే ఇప్పటికే మహేష్ బాబు, బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్,ప్రభాస్, చిరంజీవి పవన్ కళ్యాణ్ లాంటి స్టార్ హీరోలు నటించిన సినిమాలు థియేటర్లలో రీ రిలీజ్ అయిన విషయం తెలిసిందే. ఇప్పుడు నందమూరి ఫ్యామిలీకి చెందిన ఇద్దరు స్టార్ హీరోల సినిమాలు ఒకేసారి థియేటర్లలో విడుదల కాబోతున్నాయి. ఆ స్టార్ హీరోలు మరెవరో కాదు బాలకృష్ణ జూనియర్ ఎన్టీఆర్. కాగా ఎన్టీఆర్ కి, బాలయ్య కి మధ్య చిన్న గ్యాప్ ఉందని ఎప్పటి నుంచో వార్తలు వినిపిస్తున్న విషయం తెలిసిందే.
తారక్ ని టీడీపీ నుంచి దూరం పెట్టారు అంటూ కొందరు ఫ్యాన్స్ బహిరంగంగానే కామెంట్స్ చేస్తున్నారు. నందమూరి ఫ్యామిలీ ఎన్టీఆర్ కి అంతగా ప్రాధాన్యత ఇవ్వడం లేదు అంటూ సోషల్ మీడియాలో చాలా కామెంట్స్ వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఎలక్షన్ హీట్ అంతకంతకు పెరుగుతున్న తరుణంలో బాబాయ్ బాలయ్యతో ఎన్టీఆర్ పోటీ పడితే ఎలా ఉంటుంది ?సోషల్ మీడియాలో జరిగే ఆ రచ్చని ఊహించడం కూడా కష్టం. ఇప్పుడు ఇది జరగబోతున్నట్లు సంకేతాలు అందుతున్నాయి. నందమూరి బాలకృష్ణ ఆల్ టైం బ్లాక్ బస్టర్ సమరసింహా రెడ్డి చిత్రం మార్చి 2న రీరిలీజ్ కి సిద్ధమా అవుతోంది. సరిగ్గా ఇదే టైంలో ఒక రోజు ముందుగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ సింహాద్రి చిత్రం కూడా రీరిలీజ్ అవుతోంది.
ఇది యాదృచ్చికంగా జరిగిందా లేక వాంటెడ్ గానే ప్లాన్ చేసారా అనేది క్లారిటీ లేదు. సింహాద్రి చిత్రం కూడా తారక్ కెరీర్ లో ఆల్ టైం బిగ్గెస్ట్ హిట్. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంతో ఎన్టీఆర్ టాలీవుడ్ లో తిరుగులేని స్టార్ గా అవతరించాడు. ఎన్నికల వేడి నెలకొన్న ఈ సమయంలో బాలయ్య, తారక్ ఈ రకంగా పోటీ పడడం ఊహించని విషయమే. మరి ఈ విషయంలో ఎవరో ఒకరు వెనక్కి తగ్గుతారా లేదా ఇద్దరు ఒకేసారి పోటీ చేస్తారా చూడాలి మరి. ఒకవేళ ఇద్దరు ఒకేసారి పోటీ చేస్తే కనుక ఎవరు గెలుస్తారు అన్నది కూడా ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.
Related News
Naveen Chandra: నవీన్ చంద్రకు అరుదైన గౌరవం.. తెలుగు హీరోకు ప్రతిష్టాత్మక అవార్డ్
Naveen Chandra: ప్రతిష్టాత్మక దాదా సాహెబ్ ఫాల్కే ఫిల్మ్ ఫెస్టివల్ లో నవీన్ చంద్ర ఉత్తమ నటుడిగా అవార్డు అందుకున్నారు. ‘మంత్ ఆఫ్ మధు’ సినిమాలో ఆయన నటనకు గుర్తింపు లభించింది. భారతీయ చలన చిత్ర పరిశ్రమ పితామహుడు పేరు మీద దాదా సాహెబ్ ఫాల్కే ఫిల్మ్ ఫెస్టివల్ ప్రతి సంవత్సరం వివిధ కేటగిరీల్లో చలనచిత్ర రంగంలో ఔన్నత్యాన్ని జరుపుకుంటుంది. ప్రతిభకు, అంకితభావానికి నిదర్శనంగా నిలిచే ఈ అ�