Janhvi Tirumala Sentiment: అమ్మ ప్రేమే తిరుమలను దగ్గర చేసింది!
కోట్లాది మంది భారతీయులకు ఇష్టమైన హీరోయిన్ శ్రీదేవి.
- By Balu J Published Date - 03:16 PM, Tue - 19 July 22
కోట్లాది మంది భారతీయులకు ఇష్టమైన హీరోయిన్ శ్రీదేవి. ఆమె దివికెగినా ప్రేక్షకుల మదిలో జీవించి ఉంది. శ్రీదేవి కూతురు జాన్వీ ఇండస్ట్రీలో స్టార్ కిడ్గా ఎదుగుతూ తన కెరీర్లోకి దూసుకుపోతోంది. అదే సమయంలో ఆమె తన తల్లి గురించి వ్యక్తిగత విషయాలను పంచుకుంది. తన పుట్టినరోజున తల్లి శ్రీదేవి తిరుమల ఆలయానికి వచ్చేదని, అయితే పెళ్లి తర్వాతే ఆగిపోయిందని చెప్పింది. కాబట్టి ఆమె జ్ఞాపకార్థం జాన్వీ తన తల్లి పుట్టినరోజు ఆగస్టు 13న ప్రతి సంవత్సరం తిరుమల ఆలయాన్ని సందర్శిస్తూనే ఉంది.
జాన్వీ మాట్లాడుతూ ప్రతి పుట్టినరోజు తిరుపతిని సందర్శించుకుంటానని, తిరుపతి పరిసరాలు ఆధ్యాత్మికంగా ఆకట్టుకోవడంతో పుట్టినరోజుతో పాటు న్యూ ఇయర్ కు కూడా వస్తుంటా‘‘ అని చెప్పింది. కాఫీ విత్ కరణ్లో కరణ్ జోహార్తో చిట్ చాట్లో ఆమె ఈ విషయాన్ని చెప్పింది. సీజన్ వచ్చే జూలై 29న డిస్నీ+హాట్స్టార్లో ప్రీమియర్తో గుడ్ లక్ జెర్రీ విడుదల కోసం జాన్వీ ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రానికి సిద్ధార్థ్ సేన్గుప్తా దర్శకత్వం వహిస్తున్నారు. తమిళంలో నయనతార ప్రధాన పాత్రలో నటించిన కొలమావు కోకిల చిత్రానికి ఇది రీమేక్.
Related News
Andhra Pradesh: తిరుమలలో కార్చిచ్చు.. దగ్దమైన శ్రీ గంధం చెట్లు
తిరుమలకు 3 కిలోమీటర్ల దూరంలోని పార్వేటు మండపం సమీపంలోని టీటీడీ అటవీ ప్రాంతంలో శుక్రవారం అగ్నిప్రమాదం జరిగింది. అప్రమత్తమైన టీటీడీ సిబ్బంది స్పందించి మంటలను అదుపులోకి తెచ్చారు.