Shah Rukh Khan: షారూఖ్ ఖాన్ ఇంటి వద్ద భారీ బందోబస్తు.. కారణమిదే
షారుఖ్ ఖాన్ పై నిరసనలు వ్యక్తం చేయడంతో ముంబై పోలీసులు అతని నివాసం వద్ద భద్రతను పెంచారు.
- By Balu J Published Date - 03:26 PM, Tue - 29 August 23
ఆన్లైన్ గేమింగ్ యాప్లను ప్రమోట్ చేసినందుకుగాను క్రికెటర్ సచిన్ టెండూల్కర్కు లీగల్ నోటీసు అందిస్తానని ఓ ఎమ్మెల్యే వార్నింగ్ ఇచ్చాడు. అంతేకాదు.. అన్టచ్ ఇండియా ఫౌండేషన్ కూడా సీరియస్ అయ్యింది. అయితే మహారాష్ట్రలో ఆన్లైన్ గేమ్లపై వ్యతిరేకత పెరుగుతోంది. అదే కారణంతో బాలీవుడ్ స్టార్ షారుఖ్ ఖాన్ పై నిరసనలు వ్యక్తం చేయడంతో ముంబై పోలీసులు ఆయన ఇంటి వద్ద భద్రతను పెంచారు.
ఆన్లైన్ గేమింగ్ యాప్లను ప్రమోట్ చేసినందుకుగానూ టెండూల్కర్ విమర్శలు ఎదుర్కొంటున్నాడు. అలాంటి యాప్స్ కారణంగా యువకులలో విచిత్రమైన ప్రవర్తన కు దారితీస్తుందని మండిపడ్డారు. “సచిన్ టెండూల్కర్ లాంటివాళ్లు ఉపయోగం లేని యాప్ను ప్రచారం చేయడం సరికాదు అని అన్టచ్ ఇండియా ఫౌండేషన్ నిర్వాహకులు అన్నారు. Paytm ఫస్ట్ గేమ్ ప్రమోషనల్ క్యాంపెయిన్ నుండి వైదొలగాలని కోరుతూ టెండూల్కర్ను రిక్వెస్ట్ చేశామని అన్నారు. అయితే, ఈ విషయంపై క్రికెటర్ నుండి ఎటువంటి సమాధానం రాకపోవడంతో, లీగల్ నోటీసు పంపవలసి వచ్చిందని రియాక్ట్ అయ్యారు.
ఆన్లైన్ గేమింగ్ యాప్ల వ్యతిరేక కార్యకర్తలు షారూఖ్ ఖాన్ నివాసం మన్నాత్ వెలుపల నిరసనలు నిర్వహించారు, ఆ ప్రాంతంలో భారీ పోలీసు బందోబస్తును ప్రేరేపించారు. ఆన్లైన్ గేమింగ్ యాప్లను సెలబ్రిటీలు ఆమోదించడాన్ని వ్యతిరేకతను వ్యక్తం చేశారు, అలాంటి ఎండార్స్మెంట్లు యువ తరాన్ని తప్పుదారి పట్టిస్తాయని, భ్రష్టు పట్టిస్తాయని ఆందోళనకారులు చెప్పారు. జంగ్లీ రమ్మీ, జూపీ వంటి ఆన్లైన్ గేమింగ్ యాప్లను లక్ష్యంగా చేసుకుని అన్టచ్ యూత్ ఫౌండేషన్ ఈ నిరసనలను చేపట్టింది. ఆన్లైన్ గేమ్లను ప్రమోట్ చేస్తున్న పెద్ద బాలీవుడ్ తారలు యువ తరాన్ని తప్పుదారి పట్టిస్తున్నారు” అని అన్టచ్ ఇండియా ఫౌండేషన్ ప్రెసిడెంట్ క్రిష్చంద్ర అదాల్ అన్నారు.
Also Read: Chandrababu Naidu: కాకినాడపై గురి పెట్టిన చంద్రబాబు.. పర్యటన ఖరారు
Related News
Retail Mogul : డీమార్ట్ ఓనర్ బిగ్ డీల్.. రూ.117 కోట్లతో ఎకరం భూమి కొనుగోలు
Retail Mogul : డీమార్ట్ బిజినెస్ శరవేగంగా దేశమంతటా వ్యాపించింది.