Kangana Ranaut: ఎంపీగా గెలిచిన బాలీవుడ్ క్వీన్.. మండీలో కంగనా భారీ విక్టరీ
- Author : Balu J
Date : 04-06-2024 - 10:49 IST
Published By : Hashtagu Telugu Desk
Kangana Ranaut: కంగనా రనౌత్ నిర్మొహమాటంగా మాట్లాడే స్వభావానికి పెట్టింది పేరు. తన విలక్షణమైన సినీ జీవితంతో పాటు, భారతీయ జనతా పార్టీకి ప్రాతినిధ్యం వహిస్తూ రాజకీయాల్లో చురుకుగా పాల్గొంటున్నారు. 2024 లోక్సభ ఎన్నికల్లో అభ్యర్థిగా బాలీవుడ్ నటి కంగనా రనౌత్ రాజకీయ అరంగేట్రం చేయడంతో హిమాచల్ ప్రదేశ్లోని మండీ సార్వత్రిక ఎన్నికల్లో ప్రసిద్ధి చెందింది.
రాంపూర్ రాజకుటుంబ వారసుడు, ఆరుసార్లు హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసిన దివంగత వీరభద్ర సింగ్ కుమారుడు విక్రమాదిత్య సింగ్ ను ఓడించి 72,088 ఓట్లతో ఎంపీగా గెలిచారు. ఇప్పటికే అభిమానులు తమ సోషల్ మీడియా ఖాతాల్లో కంగనా రనౌత్ కు శుభాకాంక్షల వర్షం కురిపిస్తున్నారు. కంగనా నటించిన ఎమర్జెన్సీ సినిమా ఇటీవలే వాయిదా పడుతూ కొత్త రిలీజ్ డేట్ ను ఇంకా ఖరారు చేయలేదు.