Tripti Dimri : యానిమల్ బ్యూటీపై మనసు పడ్డ నటుడు.. డేటింగ్ చేయాలని ఉందంటూ..!
Tripti Dimri 2017 లోనే సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చినా కూడా యానిమల్ సినిమాతో పాపులారిటీ సంపాదించింది బాలీవుడ్ భామ తృప్తి డిమ్రి. యానిమల్ సినిమాలో హీరోయిన్ రష్మిక మందన్నా కన్నా తృప్తికే
- By Ramesh Published Date - 12:20 PM, Mon - 25 March 24
Tripti Dimri 2017 లోనే సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చినా కూడా యానిమల్ సినిమాతో పాపులారిటీ సంపాదించింది బాలీవుడ్ భామ తృప్తి డిమ్రి. యానిమల్ సినిమాలో హీరోయిన్ రష్మిక మందన్నా కన్నా తృప్తికే ఎక్కువ క్రేజ్ ఏర్పడింది. ఆ ఒక్క సినిమాతో పాన్ ఇండియా లెవెల్ లో తృప్తి సూపర్ పాపులర్ అయ్యింది. ప్రస్తుతం బాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్ లో తృప్తి ఒకరిగా క్రేజ్ తెచ్చుకుంది. ఒక్క సినిమా అమ్మడి ఫేట్ మార్చేసింది అంటే ఇదే కావొచ్చు.
యానిమల్ సినిమాలో తృప్తికి చాలా మంది ఫ్యాన్స్ ఏర్పడ్డారు. అందులో నటులు కూడా ఉండటం విశేషం. బాలీవుడ్ యాక్టర్ సిద్ధాంత్ కర్ణిక్ యానిమల్ బ్యూటీ తృప్తి మీద మనసు పారేసుకున్నాడు. అతను ఈ సినిమాలో రణ్ బీర్ సిస్టర్ హస్బండ్ గా నటించాడు. అయితే నిజ జీవితంలో తృప్తితో డేటింగ్ చేయాలని ఉందని రీసెంట్ ఇంటర్వ్యూలో వెల్లడించాడు సిద్ధాంత్.
టీవీ సీరియల్స్ తో ఫేమస్ అయిన సిద్ధాంత్ కర్ణిక్ అడపాదడపా సినిమాల్లో కూడా కనిపిస్తుండగా యానిమల్ సినిమాలో ఫస్ట్ హాఫ్ లో విలన్ గా నటించాడు సిద్ధాంథ్. అయితే సినిమాలో తృప్తితో సీన్స్ లేకపోయినా సినిమా చూసి ఆమెకు ఫిదా అయ్యాడట. తృప్తి ఒప్పుకుంటే ఆమెతో డేటింగ్ చేయాలని ఉందని సిద్ధాంథ్ కర్ణిక్ ఓపెన్ గా చెప్పాడు. సిద్ధాంథ్ కర్ణిక్ ఆల్రెడీ 2016లో మేఘా గుప్తాని పెళ్లి చేసుకున్నాడు. అయితే 2020లోనే ఈ జంట విడిపోయారు. ప్రభాస్ ఆదిపురుష్ లో విభీషణుడి పాత్రలో కూడా సిద్ధాంథ్ నటించాడు.
Also Read : Prabhas Raja Saab : రాజా సాబ్ కోసం ప్రభాస్.. మేజర్ పోర్షన్ పూర్తి చేసేలా ప్లానింగ్..!
Tags
Related News
Keerthy Suresh : కీర్తి సురేష్ బాలీవుడ్ గ్లామర్.. డోస్ పెంచిన మహానటి..!
Keerthy Suresh మహానటి కీర్తి సురేష్ సౌత్ నుంచి అలా బాలీవుడ్ వెళ్లిందో లేదో గ్లామర్ డోస్ పెంచేసింది. నేను శైలజ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన కీర్తి సురేష్ ఆ సినిమా తో సూపర్ క్రేజ్ తెచ్చుకుంది