Keerthi Bhat: లక్షలు పోగొట్టుకొని దారుణంగా మోసపోయిన బిగ్ బాస్ బ్యూటీ.. ఎవరో తెలుసా?
తెలుగు సినీ ప్రేక్షకులకు నటి కీర్తి భట్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తెలుగులో ఎన్నో సీరియల్స్ లో నటించి నటిగా తనకంటూ ప్రత్యేకమై
- By Nakshatra Published Date - 07:43 AM, Sun - 31 March 24
తెలుగు సినీ ప్రేక్షకులకు నటి కీర్తి భట్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తెలుగులో ఎన్నో సీరియల్స్ లో నటించి నటిగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకుంది. ప్రస్తుతం స్టార్ మా లో ప్రసారమవుతున్న మధురానగరీలో అనే సీరియల్ లో ప్రధాన పాత్రలో నటిస్తోంది కీర్తి భట్. ఈమె బిగ్ బాస్ హౌస్ కి ఎంట్రీ ఇచ్చి ప్రేక్షకులకు మరింత చేరువ అయిన విషయం తెలిసిందే. ఇది ఇలా ఉంటే ఈ మధ్య బిగ్ బాస్ బ్యూటీ కీర్తి భట్ వార్తల్లో ఎక్కువగా నిలుస్తున్నారు. మొన్నీమధ్య కుమారి ఆంటీ ఫుడ్ పై వీడియో చేసి వైరల్ అయ్యింది కీర్తి భట్.
కుమారి ఆంటీ ఫుడ్ గురించి కీర్తి భట్ వీడియో చేసింది. కర్రీస్ లో కారం ఎక్కువ ఉందని కీర్తి భట్, ఆమె భర్త వీడియో చేశారు. దాంతో నెటిజన్స్ రకరకాల కామెంట్స్ చేశారు. కీర్తిని, ఆమె భర్తను సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ చేశారు నెటిజన్స్. దాంతో కీర్తి భట్, ఆమె భర్త క్లారిటీ ఇచ్చారు కూడా, ఇక ఇప్పుడు మరోసారి కూడా వార్తల్లో నిలిచింది కీర్తిభట్. ఇప్పుడు ఈ చిన్నది సైబర్ నేరగాళ్ల బారిన పడింది. ఒక్క క్లిక్ తో రెండు లక్షలు పోగొట్టుకుందట కీర్తి భట్. తాజాగా కీర్తిభట్ తాను సైబర్ నేరగాళ్ల బారిన పడ్డాను అని తెలిపింది. కొరియర్ కోసం ఒక లింక్ క్లిక్ చేసి రూ. 2 లక్షలు పోగొట్టుకుందట.
తాజాగా తన యూట్యూబ్ ఛానెల్ లో ఒక వీడియోను షేర్ చేసింది కీర్తి. ఈ వీడియోలో తాను సైబర్ నేరగాళ్ల బారిన పడ్డాను అని ఆవేదన వ్యక్తం చేసింది. నాకు ఒక కొరియర్ రావాలి. అయితే వారం రోజులు దాటి పోయినా కూడా అది రాలేదు. దాంతో నాకు ఒక ఫోన్ వచ్చింది. నా కొరియర్ మెహదీ పట్నంలో ఉంది. దాని అడ్రస్ అప్డేట్ కాలేదు అడ్రస్ మేసేజ్ చేయండి అని అన్నారు. దాంతో నేను ఒక వాట్సాప్ నెంబర్ కు అడ్రస్ పంపించాను. ఆ తర్వాత నార్మల్ మెసేజ్ చేయమన్నారు. అయితే రెండు రూపాయిలు ఎక్స్ ట్రా కట్టాలి ఒక లింక్ పంపిస్తున్నాం అని చెప్పారు. సరే అని వాళ్లు చెప్పినట్టు ఆ లింక్ క్లిక్ చేస్తే రెండు రూపాయలు కట్ అయ్యాయి. సరేలే అనుకోని నేను షూటింగ్ కు వెళ్ళాను. సరిగ్గా అర్ధరాత్రి 12 సమయంలో 99 వేలు కట్ అయ్యాయి. ఆ తర్వాత మరో 99 వేలు కట్ అయ్యాయి. దాంతో ఏం చెయ్యాలో అర్ధం కాక పోలీసులను ఆశ్రయించాను. ఆ అకౌంట్స్ ను ట్రాక్ చేసి బ్లాక్ చేశాం అని పోలీసులు తెలిపారు. ఇంకా నా డబ్బులు తిరిగి రాలేదు కానీ కచ్చితంగా వస్తాయని పోలీసులు చెబుతున్నారు అని తెలిపింది కీర్తి భట్.
Related News
Hari Hara Veera Mallu: పవర్ స్టార్ ఫ్యాన్స్కు గుడ్న్యూస్.. హరి హర వీరమల్లు టీజర్ వచ్చేస్తోంది
Hari Hara Veera Mallu: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తొలి పాన్ ఇండియా మూవీ హరి హర వీరమల్లు కోసం అభిమానులు ఎన్నో నెలలుగా ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ ను చిత్రబృందం విడుదల చేసింది. మే 2, 2024 ఉదయం 9 గంటలకు అన్ని ప్రధాన భారతీయ భాషల్లో ఈ సినిమా అధికారిక టీజర్ను విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ఈ ప్రకటనతో పాటు అదిరిపోయే పోస్టర్ కూడా ఉంది. ఈ టీజర్ సినిమాపై ఆసక్తిని [&hell