Bigg Boss 6: నా జోలికి రావద్దు అంటూ గీతూకి సీరియస్ గా వార్నింగ్ ఇచ్చిన మెరీనా?
బిగ్ బాస్ సీజన్ 6 ఏడవ వారం నుంచి మరింత రసవత్తంగా ఇంట్రెస్టింగ్ గా మారింది. బిగ్ బాస్ కంటెస్టెంట్ల పై సీరియస్
- By Nakshatra Published Date - 06:45 PM, Tue - 25 October 22
బిగ్ బాస్ సీజన్ 6 ఏడవ వారం నుంచి మరింత రసవత్తంగా ఇంట్రెస్టింగ్ గా మారింది. బిగ్ బాస్ కంటెస్టెంట్ల పై సీరియస్ అయిన తర్వాత కంటెస్టెంట్లు ప్రతి ఒక్కరూ కూడా టాస్కులు ఎలా అయినా గెలవాలి హౌస్ లో ఉండాలి అన్న కసితో ఆడుతున్నారు. ఈ నేపథ్యంలోని తోపులాటలు అరుపులు కొట్లాటలు జరిగిన కూడా కంటెస్టెంట్లు ఏమాత్రం తగ్గడం లేదు. ఇకపోతే ఇటీవలె బిగ్ బాస్ హౌస్ లో ఏడవ వారం ఎలిమినేషన్స్ ముగిసిన విషయం తెలిసిందే.
అప్పుడే 8 వారం నామినేషన్ కు సంబంధించిన రచ్చ మొదలయింది. ఈ నేపథ్యంలోనే తాజాగా హౌస్ లో ఉన్న కంటెస్టెంట్లకు చేపల చెరువు అనే టాస్క్ ను ఇచ్చాడు బిగ్ బాస్. ఇక చేపలు విసురుతూ ఉండగా ఇన్ని వీలైతే అన్ని చేపలను తన బుట్టలో జాగ్రత్తగా కాపాడుకోవాల్సి ఉంటుంది. కాగా ఈ టాస్కులో కంటెస్టెంట్లు ఒళ్ళు హూనమయ్యే విధంగా కిందపడినా సరే ఏమాత్రం వెనక్కి తగ్గకుండా అదే రీతిలో ఆడారు. ఈ టాస్క్ లో భాగంగా ఇద్దరు సభ్యులను ఒక టీం గా విభజించారు. ఇక అప్పుడు గీతూ ఫిజికల్ గా పోటీ పడకపోతే మెంటల్ గా రేవంత్ ను దెబ్బ కొట్టాలి అంటూ ఆదిరెడ్డికి సలహా ఇచ్చింది.
ఇక గీతూ రోహిత్ తో గొడవ పడుతూ గట్స్ ఉండాలా అని అనగా వెంటనే రోహిత్ గట్స్ ఉంటే తీసుకో అని అంటాడు. ఎప్పుడు గలిజే ఆడతారు నువ్వు నీ పెళ్ళాం ఇద్దరు గలీజ్ ఆడతారు అంటూ ఉద్దేశించి అనడంతో వెంటనే మెరీనా ఫైర్ అవుతూ నా జోలికి రావద్దు అంటూ వేలు చూపించి మరి వార్నింగ్ ఇస్తుంది. అప్పుడు గీతూ వస్తా అని అనడంతో రా అంటూ కోపంగా మాట్లాడుతుంది మెరినా. అప్పుడు గీతూ కోపంతో అందరితో ఆడుతా అందరిని టార్గెట్ చేస్తా, అందరూ నా టార్గెట్టే అని అంటుంది. మొత్తానికి చేపల చెరువు అనే టాస్క్ లో ప్రతి ఒక్క కంటెస్టెంట్ కసిగా ఆడారు అని తెలుస్తోంది. అందుకు సంబంధించిన ప్రోమో కూడా వైరల్ అవుతోంది.
Related News
LS Polls: ఎన్నికల శిక్షణ తరగతులకు గైర్హాజరైన వారిపై క్రిమినల్ చర్యలు
LS Polls: పార్లమెంట్ ఎన్నికల విధులు కోసం నియమించబడిన అధికారులు శిక్షణ తరగతులకు గైర్హాజరైన 30 మంది పై జిహెచ్ఎంసి కమిషనర్ రోనాల్డ్ రోస్ కొరడా ఝులిపించారు. శిక్షణ తరగతులకు గైర్హాజరు అయిన సిబ్బందిపై ఆర్ పి యాక్ట్ 1951 సెక్షన్ 134 ప్రకారం క్రిమినల్ కేసులు నమోదు చేసినట్లు కమిషనర్ పేర్కొన్నారు. కాగా లోక్ సభ ఎన్నికల నామినేషన్లు ప్రారంభం కానున్న నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం నియమిం�