Geethanjali Malli Vachindhi : ‘గీతాంజలి మళ్ళీ వచ్చింది’ టీజర్ చూసారా? నవ్వుతూ భయపడాల్సిందే..
తాజాగా గీతాంజలి మళ్ళీ వచ్చింది సినిమా టీజర్ ని రిలీజ్ చేశారు.
- By News Desk Published Date - 10:48 AM, Sun - 25 February 24
తెలుగు హీరోయిన్ అంజలి(Anjali) మెయిన్ లీడ్ లో గతంలో వచ్చిన గీతాంజలి సినిమాకు సీక్వెల్ గా గీతాంజలి మళ్ళీ వచ్చింది(Geethanjali Malli Vachindhi)సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమా అంజలికి 50వ సినిమా కావడం విశేషం. కోన వెంకట్ నిర్మాణంలో శివ తుర్లపాటి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. గీతాంజలి సినిమాలో ఉన్న శ్రీనివాస రెడ్డి, సత్యం రాజేష్, షకలక శంకర్.. క్యారెక్టర్స్ తో పాటు సునీల్, అలీ, అవినాష్.. మరింతమంది ఈ సీక్వెల్ లో తోడయ్యారు.
తాజాగా గీతాంజలి మళ్ళీ వచ్చింది సినిమా టీజర్ ని రిలీజ్ చేశారు. టీజర్ ఆద్యంతం నవ్విస్తూనే భయపెట్టింది. ఈసారి కథలో.. ఓ మూవీ యూనిట్ దయ్యాల బంగ్లాలో షూటింగ్ పెట్టుకుంటే అక్కడ దయ్యాలు వీళ్ళని భయపెట్టడం, ఆ దయ్యాలకు ఒక ఫ్లాష్ బ్యాక్ ఉండటం లాంటి కథతో సాగనుంది. టీజర్ తో సినిమాపై మంచి అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ సినిమా మార్చ్ 22న రిలీజ్ కానుంది.
ఇక ఈ టీజర్ లాంచ్ ఈవెంట్ మొదట స్మశానంలో పెడతామని ప్రకటించి తర్వాత ఓ హోటల్ కి మార్చారు. ఈ ఈవెంట్ కి హీరో శ్రీవిష్ణు ముఖ్య అతిథిగా వచ్చాడు.
Also Read : Pawan Kalyan: పవన్ కళ్యాణ్ సినిమాకు నో చెప్పిన సీనియర్ నటుడు.. ఎవరో తెలుసా?
Related News
Bapatla : టీడీపీ లో చేరాడని దళిత యువకుడిపై సినీ రచయిత కోన వెంకట్ దాడి
టీడీపీ లో చేరాడని దళిత యువకుడిపై దాడి చేసిన ఘటనలో సినీ రచయిత కోన వెంకట్ ఫై కేసు నమోదు అయ్యింది. ఏపీలో మరికొద్ది గంటల్లో పోలింగ్ మొదలుకానుంది. ఈ క్రమంలో అధికార పార్టీ నేతలు రెచ్చిపోతున్నారు. కొన్ని చోట్లా భారీగా డబ్బులు పంచుతూ ఓట్లను కొనుగోలు చేస్తుండగా..మరికొన్ని చోట్ల ఇన్ని రోజులు మా వెంట తిరిగి..ఇప్పుడు టీడీపీ లో చేరతావ అంటూ వారిపై దాడికి దిగుతున్నారు. తాజాగా బాపట్ల జ