Kannappa : కన్నప్ప నాలుగు రోజుల షూటింగ్కి అక్షయ్ అన్ని కోట్లు తీసుకున్నాడా..? ఈ లెక్కలో ప్రభాస్..!
కన్నప్ప నాలుగు రోజుల షూటింగ్కి అక్షయ్ అన్ని కోట్లు తీసుకున్నాడా..? ఇక ఈ లెక్కలో ప్రభాస్ ఎంత రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడు..!
- By News Desk Published Date - 08:11 PM, Fri - 10 May 24
Kannappa : శివుడు మహాభక్తుడైన కన్నప్ప కథతో టాలీవుడ్ లో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ చిత్రం ‘కన్నప్ప’. బాలీవుడ్ దర్శకుడు ముఖేష్ కుమార్ సింగ్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో టైటిల్ రోల్ ని మంచు విష్ణు పోషిస్తున్నారు. మోహన్ బాబు నిర్మిస్తున్న ఈ చిత్రంలో భారీ స్టార్ కాస్ట్ కనిపించబోతుంది. ప్రీతి ముఖుంధన్ హీరోయిన్ గా నటిస్తుండగా.. మోహన్ బాబు, అక్షయ్ కుమార్, ప్రభాస్, మోహన్ లాల్, శరత్ కుమార్, నయనతార, మధుబాల, బ్రహ్మానందం వంటి స్టార్ కాస్ట్ ఈ మూవీలో కనిపించబోతుంది.
అక్షయ్ కుమార్, మోహన్ లాల్, శరత్ కుమార్ ఇప్పటికే ఈ మూవీ సెట్స్ లోకి ఎంట్రీ ఇచ్చి.. తమ పాత్రలకు సంబంధించిన షూటింగ్ ని పూర్తి చేసారు. ఇక ఈ నటులు ఈ సినిమాలో నటించేందుకు భారీ పారితోషకాన్ని అందుకున్నారట. వీరిలో బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ భారీ మొత్తంలో తీసుకున్నట్లు చెబుతున్నారు. ఈ సినిమా కోసం అక్షయ్ కుమార్ నాలుగు రోజుల కాల్ షీట్స్ ఇచ్చారట. ఇక ఈ నాలుగు రోజుల షూటింగ్ కోసం అక్షయ్ దాదాపు రూ.6 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకున్నారట.
కేవలం నాలుగు రోజుల షూటింగ్ కోసం అక్షయ్ కుమార్ ఇన్ని కోట్లు ఛార్జ్ చేయడం అందర్నీ ఆశ్చర్యపరుస్తుంది. అయితే ఈ పారితోషకం వార్త విన్న కొందరు నెటిజెన్స్.. “అక్షయ్ కుమారే ఈ రేంజ్ లో రెమ్యూనరేషన్ తీసుకుంటే, ఇక ప్రభాస్ ఎంత రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడో..?” అంటూ సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. కాగా ప్రభాస్ కూడా రీసెంట్ గానే ఈ సినిమా సెట్స్ లోకి ఎంట్రీ ఇచ్చారు. ఆ విషయాన్ని తెలియజేస్తూ మంచు విష్ణు ఒక ప్రీ లుక్ పోస్టర్ ని కూడా రిలీజ్ చేసారు.
ఈ సినిమాలో ప్రభాస్ శివుడిగా కనిపించబోతున్నారని టాక్ వినిపిస్తుంది. కాగా ఈ కథతో గతంలో ప్రభాస్ పెదనాన్న కృష్ణంరాజు ‘భక్త కన్నప్ప’ అనే సినిమా చేసారు. ఆ మూవీ టాలీవుడ్ హిస్టరీలోనే ఒక క్లాసిక్ గా నిలిచిపోయింది. ఇప్పుడు ఆ కథతో మంచు విష్ణు సినిమా చేస్తుంటే.. ప్రభాస్ గెస్ట్ రోల్ చేస్తున్నారు.
Related News
Lok Sabha Elections 2024: ముంబైలో ఓటేసేందుకు పోటెత్తిన బాలీవుడ్
ఐదో దశతో మొత్తం 428 స్థానాలకు ఎన్నికలు పూర్తవుతాయి. ఈ సందర్భంగా సినీ పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు ఓటు వేశారు. సీనియర్ నటుడు ధర్మేంద్ర కూడా తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ముంబైలో తన ఓటు హక్కు వినియోగించుకున్న నటి జాన్వీ కపూర్ ఓటర్లు బయటకు వచ్చి ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు.