Roja: మంత్రి రోజాపై సంచలన వ్యాఖ్యలు చేసిన నటి.. పనిమనిషి పాత్రలు చేసేదంటూ?
- By Sailaja Reddy Published Date - 07:42 PM, Thu - 14 March 24
తెలుగు ప్రేక్షకులకు ఒకప్పటి హీరోయిన్ మంత్రి రోజా గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఒకప్పుడు వరసగా సినిమాలలో నటించి టాప్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది రోజా. మంత్రి రోజా అంతకు ముందు హీరోయిన్గా రాణించిన విషయం తెలిసిందే. తెలుగులో స్టార్ హీరోయిన్గా వెలిగింది. తెలుగు, తమిళం, కన్న, మలయాళం లోనూ సినిమాలు చేసి మెప్పించింది. ముఖ్యంగా తమిళం, తెలుగులోనూ ఆమె ఎక్కువగా సినిమాలు చేశారు. ఇక్కడే స్టార్ హీరోయిన్గా ఎదిగింది. స్టార్ హీరోలందరితోనూ కలిసి నటించింది రోజా.
ఆ తర్వాత ఆమె రాజకీయాల్లోకి టర్న్ తీసుకుని మొదట్లో స్ట్రగుల్ అయ్యింది. వైసీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి ఇటీవల ఏపీలో మంత్రి అయ్యారు. అంతకు ముందు జబర్దస్త్ షోకి జడ్జ్ గా చేసి మరింత పాపులర్ అయ్యారు. ఫ్యామిలీ ఆడియెన్స్ కి దగ్గరయ్యారు. సినిమాల కంటే జబర్దస్త్ ఆమెకి క్రేజ్ని తీసుకు రావడం విశేషం. అయితే ఆమె కెరీర్ 1991లో ప్రేమ తపస్సు చిత్రంతో ప్రారంభమైంది. ఇందులో హీరో రాజేంద్రప్రసాద్. ఆయనకు జోడీగా రోజా నటించింది. ఇందులో ఆమె పాత్రకి సంబంధించిన షాకింగ్ విషయం వెల్లడించింది నటి మాధవి రెడ్డి.
తాజాగా బుల్లితెర నటి మాధవి రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఈ విషయాన్ని పంచుకుంది. రోజా నేను క్లాస్ మేట్స్. తిరుపతిలో డిగ్రీలో తాము క్లాస్ మేట్స్, ఆమె స్టడీస్లో ఫస్ట్ ఉండేది. చాలా తెలివైనది. స్పాంటినిటీ ఎక్కువగా ఉంటుంది. అయితే తాను ఎంబీబీఎస్ చేయాలని కాలేజీకి సరిగా వెళ్లలేదని, దీంతో రోజాతో క్లోజ్ ర్యాపో లేదని ఆమె అన్నారు. కానీ మామూలు పరిచయం మాత్రం ఉండేదని అన్నారు. అయితే ఆమెకి ప్రేమ తపస్స లో అవకాశం వచ్చినప్పుడు ఆ షూటింగ్ కి తాము వెళ్లామని, అందులో రోజా పనిమనిషి పాత్ర పోషించిందని, దీంతో పనిమనిషి పాత్ర కరెక్ట్ గా సరిపోయింది, నల్లగా ఉంటావని ఎగతాళి చేసేవాళ్లమని తెలిపింది మాధవి రెడ్డి వెల్లడించింది. ఆ తర్వాత మోడ్రన్ మహాలక్ష్మి షోకి స్పెషల్ ఎపిసోడ్ జరుగుతున్నప్పుడు మళ్లీ కలిశామని, అయితే ఆమె పెద్దగా గుర్తుపట్టలేదని, తాను కామ్గా ఉండేదని తెలిపింది.
Related News
Gali Bhanuprakash Nomination : గాలి భాను నామినేషన్ కు వచ్చిన జనాలని చూస్తే ..రోజాకు డిపాజిట్ కష్టమేనా..?
నగరి లో కూటమి అభ్యర్థి గాలి భాను ప్రకాష్ నామినేషన్ కార్యక్రమానికి నియోజకవర్గం నుండి పెద్ద ఎత్తున అభిమానులు , పార్టీ శ్రేణులు , కార్యకర్తలు హాజరై సందడి చేసారు