New UPI Rules: ఫోన్పే, గూగుల్ పే యూజర్లకు అలర్ట్.. జూలై 31 వరకు సులభమే!
నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) యూపీఐ వ్యవస్థకు సంబంధించిన నియమాలలో ఆగస్టు 1 నుండి మార్పులు చేయనుంది. దీని వెనుక ఉన్న కారణం యూపీఐ వ్యవస్థపై భారాన్ని తగ్గించడం మాత్రమే.
- Author : Gopichand
Date : 12-06-2025 - 12:49 IST
Published By : Hashtagu Telugu Desk
New UPI Rules: డిజిటల్ పేమెంట్ యాప్ల ద్వారా లావాదేవీల వంటి అనేక పనులను ఎక్కడి నుండైనా సులభంగా చేయవచ్చు. గూగుల్ పే (Google Pay), భీమ్ (BHIM), ఫోన్పే (PhonePe), పేటీఎం (Paytm) వంటి డిజిటల్ యాప్లు యూపీఐ ద్వారా లావాదేవీలను నిర్వహిస్తాయి. భారతదేశంలో చాలా మంది ఈ యాప్లను ఉపయోగిస్తున్నారు. చెల్లింపుల కోసం మాత్రమే కాకుండా.. బ్యాంక్ బ్యాలెన్స్ను తనిఖీ చేయడం కోసం కూడా యూపీఐ యాప్లను ఉపయోగిస్తారు. యూపీఐకి సంబంధించిన నియమాలలో మార్పులు (New UPI Rules) జరగడం వల్ల కొంతమంది వినియోగదారులపై ప్రభావం పడవచ్చు.
నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) యూపీఐ వ్యవస్థకు సంబంధించిన నియమాలలో ఆగస్టు 1 నుండి మార్పులు చేయనుంది. దీని వెనుక ఉన్న కారణం యూపీఐ వ్యవస్థపై భారాన్ని తగ్గించడం మాత్రమే. అంతేకాకుండా హ్యాకర్లు లేదా మోసాల నుండి రక్షణ కల్పించడానికి కూడా NPCI నియమాలను అమలు చేస్తూ ఉంటుంది.
జులై 31 వరకు బ్యాంక్ బ్యాలెన్స్ తనిఖీ సులభం
NPCI ప్రకారం.. ఆగస్టు 1 నుండి యాప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్ (API) వినియోగానికి సంబంధించి కొత్త నియమాలు అమలులోకి వస్తాయి. దీంతో యూపీఐ వినియోగదారుల అనుభవం కొంత మారవచ్చు. యూపీఐ యాప్లలో బ్యాంక్ బ్యాలెన్స్ను తనిఖీ చేయడం వినియోగదారులకు సులభంగా ఉండదు. జూలై 31 వరకు మీరు ఎన్నిసార్లైనా బ్యాంక్ బ్యాలెన్స్ను తనిఖీ చేయవచ్చు. కానీ ఆగస్టు 1 నుండి కొత్త నియమాలు అమలులోకి వస్తాయి. ఈ నియమాల ప్రకారం.. యూపీఐ పేమెంట్ యాప్లలో బ్యాంక్ బ్యాలెన్స్ను ఎక్కువ సార్లు తనిఖీ చేయలేరు. దీనికి ఒక పరిమితిని విధిస్తారు.
Also Read: Mitchell Starc: మహమ్మద్ షమీ రికార్డు బద్దలు.. చరిత్ర సృష్టించిన స్టార్క్!
ఆగస్టు 1 నుండి ఎన్నిసార్లు బ్యాలెన్స్ తనిఖీ చేయవచ్చు?
NPCI నియమాలు అమలులోకి వచ్చిన తర్వాత యూపీఐ యాప్లలో రోజుకు కేవలం 50 సార్లు మాత్రమే బ్యాంక్ బ్యాలెన్స్ను తనిఖీ చేయగలరు. బ్యాంక్ అకౌంట్తో లింక్ అయిన మొబైల్ నంబర్ వివరాలను 25 సార్ల కంటే ఎక్కువ చూడలేరు.
ఆటో పేమెంట్స్కు సంబంధించిన మార్పులు
యూపీఐ కొత్త నియమాల ప్రకారం.. నిర్ణీత సమయంలో ఆటో పేమెంట్స్ చేయవచ్చు. యూపీఐ యాప్ ద్వారా చెల్లింపులు చేయాలనుకుంటే ఓటీటీ లేదా ఇతర సబ్స్క్రిప్షన్ల కోసం ఆన్లైన్ ఆటో పేమెంట్స్ కేవలం నాన్-పీక్ గంటల్లోనే జరుగుతాయి. దీని సమయం ఉదయం 10 గంటలకు ముందు, మధ్యాహ్నం 1 నుండి 5 గంటల వరకు, రాత్రి 9:30 గంటల తర్వాత ఉంటుంది.
మీ సమాచారం కోసం.. NPCI ప్రకారం యూపీఐ సంబంధిత నియమాలను మార్చడానికి అన్ని బ్యాంకులు, పేమెంట్ సర్వీస్ ప్రొవైడర్లకు సూచించబడింది. జులై 31 నాటికి ఈ నియమాలను అమలు చేయాల్సి ఉంటుంది. దీని వెనుక ఉన్న కారణం యూపీఐ వ్యవస్థపై అధిక భారాన్ని తగ్గించడం మాత్రమే.
యూపీఐ లావాదేవీలపై కేంద్రం కీలక ప్రకటన
- యూపీఐ లావాదేవీలపై ఎలాంటి ఛార్జీలు లేవు.. తప్పుడు ప్రచారాలు ప్రజలు నమ్మకండి.
- రూ.3వేలు దాటితే ఛార్జీలంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారు.తప్పుడు ప్రచారం చేసేవారిపై కఠిన చర్యలు తీసుకుంటాం- కేంద్ర ఆర్థికశాఖ