Kotak Bank: కోటక్ బ్యాంక్కు షాక్ ఇచ్చిన ఆర్బీఐ.. క్రెడిట్ కార్డులను నిషేధించాలని ఆర్డర్!
కోటక్ మహీంద్రా బ్యాంక్ పై బ్యాంకింగ్ రంగ నియంత్రణ సంస్థ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా భారీ చర్య తీసుకుంది.
- By Gopichand Published Date - 12:07 AM, Thu - 25 April 24
Kotak Mahindra Bank: కోటక్ మహీంద్రా బ్యాంక్ (Kotak Mahindra Bank)పై బ్యాంకింగ్ రంగ నియంత్రణ సంస్థ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా భారీ చర్య తీసుకుంది. ఆన్లైన్ లేదా మొబైల్ బ్యాంకింగ్ మార్గాల ద్వారా కొత్త కస్టమర్లను చేర్చుకోకుండా కోటక్ మహీంద్రా బ్యాంక్ను RBI నిషేధించింది. అంతే కాకుండా కోటక్ బ్యాంక్ కొత్త క్రెడిట్ కార్డుల జారీని కూడా నిషేధించాలని RBI నిర్ణయించింది. అయితే, కోటక్ మహీంద్రా బ్యాంక్ క్రెడిట్ కార్డ్ కస్టమర్లతో సహా ప్రస్తుత కస్టమర్లకు అన్ని సేవలను కొనసాగిస్తుందని ఆర్బిఐ తెలిపింది.
2022, 2023 కోసం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా IT పరీక్షల సమయంలో బ్యాంకులో వివిధ లోపాల గురించి ఆందోళనలు వ్యక్తమవుతున్నాయని RBI ఒక పత్రికా ప్రకటన విడుదల చేసింది. ఈ ఆందోళనలను నిర్ణీత సమయంలో పరిష్కరించడంలో కోటక్ మహీంద్రా బ్యాంక్ విఫలమైంది. బలమైన ఐటీ మౌలిక సదుపాయాలు, ఐటీ రిస్క్ మేనేజ్మెంట్ ఫ్రేమ్వర్క్ లేకపోవడం వల్ల బ్యాంక్ కోర్ బ్యాంకింగ్ సిస్టమ్, దాని ఆన్లైన్, డిజిటల్ బ్యాంకింగ్ ఛానెల్లు గత రెండేళ్లలో అనేక అంతరాయాలను ఎదుర్కొన్నాయని RBI తెలిపింది. ఇదే నెలలో ఏప్రిల్ 15, 2024న, సేవలను నిలిపివేశారు. దీని కారణంగా బ్యాంకు ఖాతాదారులు సమస్యలను ఎదుర్కోవలసి వచ్చింది.
Also Read: Latest Report: మానసిక సమస్యలతో చిత్తవుతున్న ఢిల్లీ యువత.. ఎందుకో తెలుసా
RBI ప్రకారం.. కోటక్ మహీంద్రా బ్యాంక్ దాని వృద్ధితో దాని IT వ్యవస్థలను బలోపేతం చేయడంలో విఫలమైంది. గత రెండేళ్లలో IT వ్యవస్థలను బలోపేతం చేయడానికి, ఈ సమస్యలను అధిగమించడానికి RBI బ్యాంక్ టాప్ మేనేజ్మెంట్తో నిరంతరం టచ్లో ఉంది. కానీ ఫలితం సంతృప్తికరంగా లేదు.
బ్యాంక్ డిజిటల్ లావాదేవీల పరిమాణంలో బలమైన పెరుగుదల ఉంది. ఇందులో క్రెడిట్ కార్డ్లకు సంబంధించిన లావాదేవీలు కూడా ఉన్నాయి. దీంతో ఐటీ వ్యవస్థలపై భారం పెరిగింది. ఈ కారణంగా కస్టమర్ల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని RBI బ్యాంకుపై వ్యాపార పరిమితులను విధించాలని నిర్ణయించింది. తద్వారా దీర్ఘకాలిక అంతరాయాన్ని నివారించవచ్చు. ఎందుకంటే ఇది బ్యాంకు కస్టమర్ సేవలపై మాత్రమే కాకుండా ఆర్థిక పనితీరుపై కూడా ప్రభావం చూపుతుంది.
We’re now on WhatsApp : Click to Join
Tags
Related News
IT Returns Filed: 30 రోజుల్లోనే దాదాపు 6 లక్షల ఐటీఆర్లు దాఖలు..!
2024-25 అసెస్మెంట్ సంవత్సరం (FY25) మొదటి నెలలో ఆదాయపు పన్ను (I-T) శాఖకు 6 లక్షలకు పైగా రిటర్న్లు దాఖలు చేయబడ్డాయి.