IndiGo New Chairman: ఇండిగో ఎయిర్లైన్స్ కొత్త ఛైర్మన్గా విక్రమ్ సింగ్ మెహతా.. ఎవరీ సింగ్?
ఇండిగో ఎయిర్లైన్స్ తన కొత్త ఛైర్మన్గా విక్రమ్ సింగ్ మెహతాను నియమించింది. ఆయన 2022 మే నుండి ఇంటర్గ్లోబ్ ఏవియేషన్ లిమిటెడ్ (ఇండిగో మాతృ సంస్థ) బోర్డు సభ్యుడిగా ఉన్నారు.
- Author : Gopichand
Date : 28-05-2025 - 5:04 IST
Published By : Hashtagu Telugu Desk
IndiGo New Chairman: ఇండిగో ఎయిర్లైన్స్ తన కొత్త ఛైర్మన్గా (IndiGo New Chairman) విక్రమ్ సింగ్ మెహతాను నియమించింది. ఆయన 2022 మే నుండి ఇంటర్గ్లోబ్ ఏవియేషన్ లిమిటెడ్ (ఇండిగో మాతృ సంస్థ) బోర్డు సభ్యుడిగా ఉన్నారు. విక్రమ్ సింగ్ మెహతా.. డాక్టర్ వెంకటరమణి సుమంత్రన్ స్థానంలో ఈ పదవిని చేపట్టారు. సుమంత్రన్ గత ఐదు సంవత్సరాలుగా ఛైర్మన్గా పనిచేసి, కోవిడ్-19 మహమ్మారి తర్వాత ఇండిగో బలమైన పునరుద్ధరణ.. వృద్ధిని నాయకత్వం వహించారు.
మెహతా భారత పరిపాలనా సేవ (IAS)లో 1978లో తన వృత్తిని ప్రారంభించారు. ఆ తర్వాత షెల్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఇన్ ఇండియా ఛైర్మన్గా, షెల్ మార్కెట్స్ అండ్ షెల్ కెమికల్స్ ఈజిప్ట్లో CEOగా పనిచేశారు. ఆయన లార్సెన్ అండ్ టౌబ్రో, మహీంద్రా అండ్ మహీంద్రా, కోల్గేట్ పామోలివ్ ఇండియా వంటి పలు ప్రముఖ సంస్థల బోర్డులలో స్వతంత్ర డైరెక్టర్గా కూడా పనిచేశారు. 2010లో ఆసియా హౌస్ ద్వారా “బిజినెస్మ్యాన్ ఆఫ్ ది ఇయర్”, 2016లో ఆసియా సెంటర్ ఫర్ కార్పొరేట్ గవర్నెన్స్ అండ్ సస్టైనబిలిటీ ద్వారా “బెస్ట్ ఇండిపెండెంట్ డైరెక్టర్”గా గుర్తింపు పొందారు.
Also Read: BSH : విశాఖపట్నంలో సిమెన్స్ బిల్ట్-ఇన్ హోమ్ అప్లయన్సెస్ కార్యకలాపాలు..
ఆయన విద్యా నేపథ్యంలో ఢిల్లీ యూనివర్సిటీలోని సెయింట్ స్టీఫెన్స్ కాలేజీ నుండి గణితంలో బ్యాచిలర్ డిగ్రీ, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ నుండి రాజకీయ శాస్త్రం, ఆర్థిక శాస్త్రంలో మాస్టర్స్ డిగ్రీ, టఫ్ట్స్ యూనివర్సిటీ నుండి ఎనర్జీ ఎకనామిక్స్లో మరో మాస్టర్స్ డిగ్రీ ఉన్నాయి. మెహతా నాయకత్వంలో ఇండిగో దాని మార్కెట్ ఆధిపత్యాన్ని మరింత బలోపేతం చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.ప్రస్తుతం విక్రమ ఇంటర్గ్లోబ్ ఏవియేషన్ లిమిటెడ్ (ఇండిగో ఎయిర్లైన్స్ మాతృ సంస్థ) ఛైర్మన్గా నియమితులయ్యారు. 2022 మే నుండి బోర్డు సభ్యుడిగా ఉన్న తర్వాత ఈ పదవిని చేపట్టారు.