HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Business
  • >Indian Railway Tejas Faces Loss Of Rs 63 Crore

Indian Railway Loss: న‌ష్టాల్లో ఉన్న రైలు ఇదే.. ఈ ట్రైన్ వ‌ల‌న మూడేళ్ల‌లో రూ. 63 కోట్ల లాస్‌.!

IRCTC ఇచ్చిన డేటా ప్రకారం.. ఈ రైలు 2020-21 సంవత్సరంలో రూ. 16.69 కోట్ల నష్టాన్ని చవిచూడగా, 2021-22లో ఈ నష్టం రూ. 8.50 కోట్లు. దీని తర్వాత రైలు నష్టాలు నిరంతరం పెరుగుతూనే ఉన్నాయి.

  • Author : Gopichand Date : 19-09-2024 - 9:03 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Indian Railways
Indian Railways

Indian Railway Loss: ప్రపంచంలోని అత్యంత పొడవైన రైలు నెట్‌వర్క్‌లలో ఒకటైన భారతీయ రైల్వేలు (Indian Railway Loss) ఇటీవలి సంవత్సరాలలో నష్టాలను ఆర్జించే సంస్థగా కాకుండా లాభాలను ఆర్జించే సంస్థగా పేరుగాంచాయి. భారతీయ రైల్వే ప్రతిరోజూ 12,817 రైళ్లను నడుపుతోంది. వీటిలో సుమారు 2.3 కోట్ల మంది ప్రయాణిస్తున్నారు. పండుగ రోజుల్లో రైల్వే టికెట్ పొందడం యుద్ధంతో కూడుకున్న ప‌ని అంద‌రికీ తెలిసిందే. దీని వల్ల అనేక భారతీయ రైళ్లు కోట్లాది రూపాయల ఆదాయాన్ని ఆర్జిస్తున్నాయి. రైల్వేస్ విడుదల చేసిన డేటా ప్రకారం.. బెంగళూరు రాజధాని ఎక్స్‌ప్రెస్ 2023-24 సంవత్సరంలో రూ.176 కోట్లు ఆర్జించింది. లాభం లేని రైలు ఉందని, కోట్లాది రూపాయల నష్టం ఉందని ఎవరైనా చెబితే మీకు ఎలా అనిపిస్తుంది? ఈ రైలు దేశంలోనే తొలి ప్రైవేట్ రైలు తేజస్ ఎక్స్‌ప్రెస్. ఇది భారతీయ రైల్వేలకు బదులుగా IRCTC (ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్) ద్వారా నిర్వహించబడుతుంది. తేజస్ ఎక్స్‌ప్రెస్ రైలుకు ఇప్పటి వరకు రూ.62,88,00000 అంటే దాదాపు రూ.63 కోట్లు న‌ష్టాల్లో ఉన్న‌ట్లు అంచ‌నా.

రెండు తేజస్ రైళ్లు నష్టాల్లో

IRCTC ప్రస్తుతం భారతీయ రైల్వే నెట్‌వర్క్‌లో రెండు తేజస్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను నడుపుతోంది. వీటిలో ఒకటి ఢిల్లీ నుండి లక్నో మధ్య, మరొకటి ముంబై నుండి అహ్మదాబాద్ మధ్య నడుస్తుంది. ఈ రెండు రైళ్లు నష్టాల్లో నడుస్తున్నాయి. 2019 సంవత్సరంలో కరోనా కాలానికి ముందు ప్రారంభించిన తేజస్ ఎక్స్‌ప్రెస్ రైలును నిర్వహించే బాధ్యత IRCTCకి ఇవ్వబడింది. దేశంలో ప్రైవేట్ రైళ్లను నడపడానికి ఇది మొదటి అడుగు అని అప్పట్లో చెప్పబడింది. ప్రారంభంలో తేజస్ ఎక్స్‌ప్రెస్‌కు చాలా మంది ప్రయాణికులు వచ్చారు. ఎయిర్ హోస్టెస్‌ల వలె దుస్తులు ధరించిన మహిళా సహాయకులు, ప్రత్యేకమైన సౌకర్యాలు ఈ రైలులో ప్రయాణించడానికి ప్రజలను ప్రోత్సహించాయి. 2019-20 సంవత్సరంలో ఈ రైలు ఢిల్లీ-లక్నో మార్గంలో 2.33 కోట్ల రూపాయల లాభాన్ని ఆర్జించింది, అయితే మొదట కరోనా మహమ్మారి కారణంగా మరియు ఇతర కారణాల వల్ల ఈ రైలు ప్రయాణికులను పొందడం ఆగిపోయింది.

Also Read: BigBasket: ఎల‌క్ట్రానిక్ వ‌స్తువుల డెలివ‌రీ ప్లాట్‌ఫామ్‌లోకి బిగ్ బాస్కెట్‌..!

మూడేళ్లలో రూ.63 కోట్ల నష్టం వచ్చింది

IRCTC ఇచ్చిన డేటా ప్రకారం.. ఈ రైలు 2020-21 సంవత్సరంలో రూ. 16.69 కోట్ల నష్టాన్ని చవిచూడగా, 2021-22లో ఈ నష్టం రూ. 8.50 కోట్లు. దీని తర్వాత రైలు నష్టాలు నిరంతరం పెరుగుతూనే ఉన్నాయి. కేవలం మూడేళ్లలో ఈ రైలు నష్టం రూ.63.88 కోట్లకు చేరింది. ఢిల్లీ-లక్నో తేజస్ రైలు రూ.27.52 కోట్ల నష్టంతో నడుస్తోంది.

తేజస్ ఎక్స్‌ప్రెస్ రైలు నష్టాలను నిరంతరం పెంచడానికి కారణం దాని నుండి ప్రయాణీకులు దూరంగా ఉండటమే. ఈ రైలులో ప్రతిరోజూ సగటున 200 నుండి 250 సీట్లు ఖాళీగా ఉంటున్నాయి డేటా చెబుతుంది. ప్రయాణీకుల కొరత, పెరుగుతున్న నష్టాల కారణంగా మొదటి వారంలో ఆరు రోజులు నడిచిన తేజస్ ఎక్స్‌ప్రెస్ ట్రిప్పులు కూడా తగ్గాయి. ఇప్పుడు ఈ రైలు వారానికి నాలుగు రోజులు మాత్రమే నడుస్తుంది.

మొదట్లో ప్రజలు తేజస్ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణించడాన్ని స్టేటస్ సింబల్‌గా భావించారు. కానీ అధిక ఛార్జీల కారణంగా అది క్రమంగా ప్రత్యామ్నాయ రైలుగా మారింది. రైల్వే వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం రాజధాని-శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌లో కూడా తేజస్‌తో సమానమైన సౌకర్యాలు ఉన్నాయి. అయితే ఛార్జీ చాలా తక్కువ. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు రాజధాని, శతాబ్ది టిక్కెట్లు దొరకని ప్రయాణికులు తేజస్‌ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణిస్తున్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Ahmedabad Mumbai Tejas Express
  • Indian Railway Catering and Tourism Corporation
  • Indian Railway News
  • IRCTC
  • Lucknow Delhi Tejas Express
  • Railways
  • Tejas Express

Related News

Special Trains Sankranti 20

దక్షిణ మధ్య రైల్వే గుడ్‌న్యూస్ సంక్రాంతికి ఊరెల్లే వారికి 16 అదనపు ప్రత్యేక రైళ్లు

Sankranti Special Trains :  సంక్రాంతి పండుగ సందర్భంగా తెలుగు రాష్ట్రాలకు వెళ్లే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త అందించింది. తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్‌కు 16 ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు ప్రకటించింది. సికింద్రాబాద్, వికారాబాద్‌ల నుంచి శ్రీకాకుళం రోడ్డు వరకు జనవరి 9 నుంచి 19 వరకు ఈ రైళ్లు అందుబాటులో ఉంటాయి.   సంక్రాంతికి వెళ్లేవారికి గుడ్‌న్యూస్ తెలంగాణ ఏపీ మధ్య 16 స్పెషల్ ట్ర

  • Loco Pilot Salary

    Loco Pilot Salary: రైల్వే లోకో పైలట్ జీతం.. వందే భారత్ డ్రైవర్లకే అత్యధిక వేతనమా?!

Latest News

  • పోలీసుల జోక్యంతో న్యాయం గెలిచింది.. ఎస్పీకి మహిళ పాలాభిషేకం

  • నేషనల్ హెరాల్డ్ కేసు నేపథ్యంలో కాంగ్రెస్ శ్రేణుల ఉద్యమ పిలుపు

  • జాతీయ ఉపాధి హామీపై కాంగ్రెస్ కార్యాచరణలో మార్పులు..

  • తెలుగు రాష్ట్రాల్లో ప్రధాన ఎన్నికల కమిషనర్ గ్యానేశ్ కుమార్ పర్యటన

  • రాష్ట్రాభివృద్ధికి కేంద్ర సహకారం కోరుతూ ఢిల్లీకి సీఎం చంద్రబాబు

Trending News

    • అధిక ఐక్యూ ఉన్న వ్యక్తుల 5 ముఖ్యమైన అలవాట్లు ఇవే!

    • ఆర్‌బీఐ అన్‌లిమిటెడ్ నోట్లను ముద్రిస్తే ఏమ‌వుతుందో తెలుసా?

    • KPHB లులు మాల్‌లో నిధి అగర్వాల్‌కు చేదు అనుభవం

    • స్టాక్ మార్కెట్‌ను లాభ- న‌ష్టాల్లో న‌డిపించే 7 అంశాలివే!

    • మీరు ఆధార్ కార్డును ఆన్‌లైన్‌లో స్వయంగా అప్డేట్ చేసుకోండిలా!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd