Bank Service Charges: బ్యాంక్ కస్టమర్లకు బిగ్ షాక్.. అక్టోబర్ 1 నుంచి నయా రూల్స్..!
చాలా బ్యాంకులు ప్రతి సంవత్సరం పరిమిత సంఖ్యలో ఉచిత చెక్బుక్లను అందిస్తాయి. కానీ కొత్త నిబంధనల తర్వాత మీరు చెక్బుక్ల కోసం ఎక్కువ చెల్లించాల్సి ఉంటుంది.
- Author : Gopichand
Date : 07-09-2024 - 11:39 IST
Published By : Hashtagu Telugu Desk
Bank Service Charges: బ్యాంకు సర్వీస్ ఛార్జీలు (Bank Service Charges) నిరంతరం పెంచుతున్నారు. ATM నుండి డబ్బు విత్డ్రా చేయడం, బ్యాలెన్స్ చెక్ చేయడం, చెక్ బుక్ తీసుకోవడం, ఇతర బ్యాంకింగ్ సౌకర్యాలపై ఈ ఛార్జీలు విధిస్తున్నారు. వీటిలో చాలా తక్కువ ఛార్జీలు ఉన్నాయి. కానీ వాటిలో చాలా పెద్ద షాక్ ఇవ్వబోతున్నాయి. ఇప్పటి వరకు ఎలాంటి ఛార్జీలు చెల్లించకుండానే పొందుతున్న సౌకర్యాలు ఇక నుంచి వసూలు చేయడం ప్రారంభిస్తాయి. ఉదాహరణకు.. మనం ATM పరిమితి ప్రకారం డబ్బును విత్డ్రా చేసుకుంటే దానిపై ఎటువంటి అదనపు ఛార్జీ లేదు. అయితే కొత్తగా వచ్చిన ఈ మార్పుల వల్ల ప్రతి విత్డ్రాపై ఛార్జీ విధించే అవకాశం ఉంది.అయితే ఈ రూల్స్ అక్టోబర్ నుంచి అమలులోకి రానున్నాయి.
చెక్ బుక్పై రుసుము వసూలు
చాలా బ్యాంకులు ప్రతి సంవత్సరం పరిమిత సంఖ్యలో ఉచిత చెక్బుక్లను అందిస్తాయి. కానీ కొత్త నిబంధనల తర్వాత మీరు చెక్బుక్ల కోసం ఎక్కువ చెల్లించాల్సి ఉంటుంది. ఇది కాకుండా చెక్ బౌన్స్ అయితే లేదా రద్దు చేస్తే దానిపై కూడా డబ్బు చెల్లించాల్సి ఉంటుంది.
Also Read: Indian Railway: EMU, DEMU, MEMU రైళ్లు అంటే ఏమిటో తెలుసా..?
ATM నుండి డబ్బు విత్డ్రా చేయడంపై కూడా ఛార్జీలు
ప్రతి నెలా ఒక్కో బ్యాంకుకు వేర్వేరు ATM పరిమితులు ఇస్తుంది. దీని కింద మీరు ఎలాంటి అదనపు ఛార్జీ లేకుండా డబ్బును విత్డ్రా చేసుకోవచ్చు. ఇందులో పరిమితి కంటే ఎక్కువ డబ్బు విత్ డ్రా చేసినప్పుడు ఛార్జీలు విధించారు. కానీ కొత్త రూల్ అమలులోకి వచ్చిన తర్వాత మీరు వేరే బ్యాంకు నుండి డబ్బు విత్డ్రా చేసుకుంటే దాని ఛార్జీలు పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం రూ.20 నుంచి రూ.25 వరకు వసూలు చేస్తున్నారు.
ఖాతాలో ఎంత మొత్తం ఉండాలి?
చాలా బ్యాంకుల్లో ఖాతా తెరిచి ఉంచడానికి కొంత మొత్తాన్ని కలిగి ఉండటం అవసరం. బ్యాంకు డిపాజిట్లు నిర్ణీత మొత్తం కంటే తక్కువగా ఉంటే జరిమానా విధించవచ్చు. ఈ జరిమానా బ్యాంకును బట్టి రూ.100 నుంచి రూ.600 వరకు ఉంటుంది.