Electric Bikes: ఈ బైక్స్ సూపర్ గురు.. ఒక్క చార్జ్తో 300కి.మీ.లకు పైగా రేంజ్?
ప్రస్తుత రోజుల్లో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలకు ఉన్న ఆదరణ క్రమంగా పెరుగుతూనే ఉంది. దాంతో ఆయా సంస్థలు కూడా వినియోగదారులకు అందుబాటులో ఉండే విధ
- By Nakshatra Published Date - 06:30 PM, Sun - 25 February 24
ప్రస్తుత రోజుల్లో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలకు ఉన్న ఆదరణ క్రమంగా పెరుగుతూనే ఉంది. దాంతో ఆయా సంస్థలు కూడా వినియోగదారులకు అందుబాటులో ఉండే విధంగా అందరికీ నచ్చే విధంగా ఉండే బైక్స్ ని మార్కెట్లోకి విడుదల చేస్తున్నాయి. దీని కారణం అవి ఎక్కువ రేంజ్ ఇవ్వడం లేదు. సింగిల్ చార్జ్ పై 100 నుంచి 150 కిలోమీటర్ల రేంజ్ మాత్రమే ఇస్తున్నాయి. అయితే కొన్ని ఎలక్ట్రిక్ బైక్స్ మాత్రం దాదాపు 300 కిలో మీటర్లకు పైగా రేంజ్ ఇచ్చేవి ప్రస్తుతం మన దేశ మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. ఒకవేళ రేంజ్ గురించే మీరు ఆలోచించిస్తుంటే మీకు ఇవి మంచి సొల్యూషన్ కాగలవు. అయితే సింగిల్ ఛార్జ్ తో ఎక్కువ దూరం ప్రయాణించే కలిగే ఆ స్కూటర్లు ఏవో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
అల్ట్రావయోలెట్ ఎఫ్77.. ఇది సూపర్ ఫాస్ట్ ఈ-బైక్. దీని టాప్ ఎండ్ మోడల్ ఏకంగా సింగిల్ చార్జ్ పై 307 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుంది. వాస్తవానికి దీనిని 2019 లాంచ్ చేసిన సమయంలో 4.3 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ రిమూవబుల్ ప్యాక్లో వచ్చింది. అయితే 2023లో అప్ గ్రేడెవ్ వెర్షన్ ను తీసుకురాగా అది 10.3 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ సామర్థంతో వచ్చింది. దీని సాయంతో సింగిల్ చార్జ్ పై 307 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుంది. ఇది గంటకు 152 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. దీనిలో 5.0 అంగుళాల టీఎఫ్టీ డిస్ప్లే , ఆటో ఆన్/ఆఫ్ హెడ్ల్యాంప్లు, రియల్ టైమ్ ట్రాఫిక్ సహాయంతో నావిగేషన్, జియోఫెన్సింగ్ వంటి ఫీచర్లను కలిగి ఉంటుంది. అదనపు భద్రత కోసం, దొంగతనం జరిగినప్పుడు లాక్డౌన్ మోడ్ కూడా ఉంది. కోమాకి రేంజర్ ఇది క్రూయిజర్ లుక్లో అదరగొట్టే ఈ-బైక్. ఇది సింగిల్ చార్జ్ పై 250 కిలోమీటర్ల రేంజ్ ను ఇస్తుంది. దీని రూ. 1.85లక్షలు ఉంటుంది.
దీనిలో 7 అంగుళాల టీఎఫ్టీ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్తో అంతర్నిర్మిత నావిగేషన్ను కలిగి ఉంటుంది. బ్యాటరీ ప్యాక్ 4.5 కేడబ్ల్యూహెచ్ ఉంటుంది. గరిష్టంగా గంటకు 80 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలుగుతుంది. కబీరా మొబిలిటీ కేఎం4000.. ఇది మాడ్యులర్ బ్యాటరీ ప్యాక్ తో వస్తుంది. సింగిల్ చార్జ్ పై 201 కిలోమీటర్ల పరిధిని ఇస్తుంది. దీనిలో డ్యూయల్ సీబీఎస్ డిస్క్ బ్రేక్స్ ఉంటాయి. టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్, మోనో షాక్ రియర్ సస్పెన్షన్ తో వస్తుంది. దీని ధర రూ. 1,76,000ఎక్స్-షోరూమ్ గా ఉంది. ఇది గరిష్టంగా గంటకు 120 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలుగుతుంది.
పవర్ ఈవీ పీ- స్పోర్ట్ ప్లస్.. ఏపీకి చెందిన ఎలక్ట్రిక్ టూ-వీలర్ స్టార్టప్ పవర్ ఈవీ తన ఎలక్ట్రిక్ మోటార్సైకిల్ను విడుదల చేసింది. దీని పేరు పీ- స్పోర్ట్ ప్లస్ ఇది సింగిల్ చార్జ్ పై 210 కిమీ పరిధితో వస్తుంది. దీనిలో 4.8కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్ తో వస్తుంది. దీనిలో రిమూవబుల్ గా ఉంటుంది. ఇది గరిష్టంగా గంటకు 85 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. దీనిలో డిజిటల్ స్పీడోమీటర్ ఉంటుంది.
ఓర్క్సా మాంటిస్.. బెంగళూరుకు చెందిన ఈవీ స్టార్టప్ ఓర్క్సా ఎనర్జీస్ నుంచి వచ్చిన ఈ-బైక్ ఇది. సింగిల్ చార్జ్ పై 221 కిలోమీటర్ల టాప్ రేంజ్ ఇస్తుంది. దీనిని 1.3 కేడబ్ల్యూహెచ్ రెగ్యులర్ ఛార్జర్తో రూ . 3.6 లక్షలకు కొనుగోలు చేయొచ్చు. 5-అంగుళాల డిజిటల్ టీఎఫ్టీ డిస్ప్లే, సైడ్-స్టాండ్ సెన్సార్, బ్లూటూత్ కనెక్టివిటీ, స్మార్ట్ఫోన్ ఇంటిగ్రేషన్ను కలిగి ఉంది. బైక్ను ప్రీ-ఆర్డర్ చేసిన వారికి, డెలివరీలు ఏప్రిల్ 2024లో ప్రారంభమవుతాయి. గరిష్ట వేగం గంటకు 135 కిలోమీటర్ల గరిష్ట వేగంతో ప్రయాణిస్తుంది.
Related News
Champions Trophy 2025: పాకిస్తాన్లో పర్యటించనున్న భారత్.. రహస్యంగా ఉంచాలని కోరిన ఐసీసీ..!
ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భారత జట్టు క్వాలిఫైయింగ్ మ్యాచ్లన్నీ ఒకే నగరంలో జరగాలని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ అంటే ICCకి సూచించింది.