Mahindra Thar Roxx: మార్కెట్లోకి రాబోతున్న మహీంద్రా థార్ రాక్స్ .. ఫీచర్స్ మామూలుగా లేవుగా?
5 డోర్లతో పాటుగా అద్భుతమైన ఫీచర్స్ తో మార్కెట్ లోకి రాబోతున్న మహీంద్రా థార్ రాక్స్.
- By Anshu Published Date - 11:30 AM, Wed - 31 July 24

మార్కెట్లో మహీంద్రా కార్లకు ఉన్న క్రేజ్ డిమాండ్ గురించి మనందరికీ తెలిసిందే. ముఖ్యంగా థార్ కార్లకు విపరీతమైన డిమాండ్ ఉంది. ఇటీవల కాలంలో వీటి వినియోగం విపరీతంగా పెరిగిపోవడంతో ప్రతి ఒక్కరి దృష్టి వీటిపైనే పడింది. చూడడానికి అద్భుతమైన లుక్స్ తో ఆకట్టుకుంటూ వినియోగదారుల సంఖ్యను పెంచుకుంటూ వెళ్తోంది మహీంద్రా థార్. ఇకపోతే ఇప్పటికే పలు రకాల కార్లను తీసుకువచ్చిన మహీంద్రా త్వరలోనే మరో గుడ్ న్యూస్ ని తెలుపబోతోంది. అదేమిటంటే ఆఫ్ రోడింగ్ విభాగంలో అందుబాటులోకి తీసుకు వచ్చిన థార్ SUVని ఆప్డేట్ వేరియంట్ లో తీసుకు రాబోతోంది.
ఇది ప్రీమియం ఫీచర్స్తో పాటు అద్భుతమైన కలర్ ఆప్షన్స్ లో అందుబాటులోకి రాబోతున్నట్లు తెలుస్తోంది. అయితే గతంలో మహీంద్రా థార్ 3 డోర్స్ తో అందుబాటులోకి వచ్చిన విషయం తెలిసిందే. అయితే రాబోయే కొత్త థార్ మాత్రం 5 డోర్లతో విడుదల కాబోతున్నట్లు తెలుస్తోంది. దీనిని కంపెనీ ఆగస్టు 15 సందర్భంగా విడుదల చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ ఐదు డోర్ల థార్కి మహీంద్రా కంపెనీ థార్ రాక్స్ అనే పేరును కూడా పెట్టింది. అలాగే ఇటీవలే మహీంద్రా థార్ రాక్స్ టీజర్ ను కూడా లాంచ్ చేసింది. మరి ఈ కారుకు సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళితే.. కాగా మహీంద్రా కంపెనీ తాజాగా విడుదల చేసిన థార్ రాక్స్ టీజర్లో టాప్ వేరియంట్ పనోరమిక్ సన్రూఫ్ తో అందుబాటులోకి రాబోతోంది.
ఆఫ్ రోడ్డు కార్లలో పనోరమిక్ సన్రూఫ్ ను అందించడం ఇదే మొదటిసారని మార్కెట్ లో దీనిపై చర్చ కూడా జరుగుతోంది. ఈ టీజర్ లో థార్ SUVకి సంబంధించి లోపలి భాగాన్ని కూడా షేర్ చేసింది. దీని బట్టి చూస్తే ఈ కారు లోపలి భాగంలో ప్రీమియం సీటర్స్ తో పాటు అద్భుతమైన ఫినిషింగ్ తో అందుబాటులోకి రాబోతున్నట్లుగా సమాచారం. ఇకపోతే ఈ థార్ రాక్స్ డిజైన్కి సంబంధించిన వివరాల్లోకి వెళితే.. ఈ 5 డోర్ల మహీంద్రా థార్ రాక్స్ ఫ్రంట్ ఫాసియాలో కొత్త గ్రిల్ సెక్షన్ సెటప్ ను అందిస్తోంది. అలాగే దీంతో పాటు అద్భుతమైన ఇంటిగ్రేటెడ్ LED డేటైమ్ రన్నింగ్ లైట్లను కూడా కలిగి ఉంటుంది. అంతేకాకుండా దీని వెనక భాగంలో 4×4 బ్యాడ్జింగ్ను కూడా అందిస్తోంది. అలాగే ఇందులో కంపెనీ అల్లాయ్ వీల్స్ ను కూడా చేంజ్ చేసింది. దీంతో పాటు ఈ థార్ మందపాటి బ్లాక్ వీల్ ఆర్చ్ క్లాడింగ్తో వస్తోంది. దీని పరిమాణం ఇటీవలే లాంచ్ అయిన జీప్ కంపెనీ హెవీ SUVలా ఉంటుంది. అలాగే దీని వీల్బేస్ చాలా పొడవుగా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఇది మార్కెట్లో లాంచ్ అయితే 5 డోర్లతో లాంచ్ అయిన ఫోర్స్ గూర్ఖాతో పోటీ పడనుంది.
అంతేకాకుండా ఈ థార్ రాక్స్ ఇప్పటికే మార్కెట్లోకి విడుదల అయినా ఫోర్స్ గూర్ఖా కి గట్టి పోటీని ఇవ్వనున్నట్లు అంచనా వేస్తున్నారు నిపుణులు. అలాగే ఈ థార్ రాక్స్లో మహీంద్రా లోపల ఫ్రంట్ భాగంలో 10.25 అంగుళాల ఫ్లోటింగ్ టచ్స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ ను కూడా అందుబాటులోకి తీసుకు వచ్చింది. కారు సెక్యూరిటీ కోసం 360 డిగ్రీ కెమెరాను కూడా అందిస్తోంది. అలాగే మౌంటెడ్ కంట్రోల్ సిస్టమ్ తో రన్ అయ్యే స్టీరింగ్ వీల్ ను కూడా కలిగి ఉంటుంది. ఇక ఇందులో అందరికీ ఎంతో ఇష్టమైన పెద్ద పనోరమిక్ సన్రూఫ్ ను కూడా అందిస్తోంది. దీంతో పాటు ఈ కారు రెండు ఇంజన్ వేరియంట్స్లో రాబోతోంది. 2.2 లీటర్ డీజిల్తో పాటు 2.0-లీటర్ పెట్రోల్ ఇంజన్ లలో రాబోతున్నట్లు మహీంద్రా కంపెనీ వెల్లడించింది.