YS Viveka Case : `సుప్రీం` కు బాబాయ్ గొడ్డలి కథ
ఏపీ సీఎం జగన్మోహనరెడ్డి బాబాయ్ మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి గొడ్డలి కథ సుప్రీంకోర్టు కు చేరింది.
- By CS Rao Published Date - 12:53 PM, Sat - 13 August 22
ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి బాబాయ్ మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి గొడ్డలి కథ సుప్రీంకోర్టు కు చేరింది. హత్య కేసు వ్యవహారం శుక్రవారం సర్వోన్నత న్యాయస్థానం మెట్లు తొక్కింది.. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న సీబీఐ అధికారులు పురోగతి సాధించలేకపోతున్నారని ఆరోపిస్తూ వివేకా కుమార్తె వైఎస్ సునీతా రెడ్డి పిటిషన్ దాఖలు పరిచారు.నిందితులుగా ఉన్న వాళ్లే దర్యాప్తు అధికారులపై కేసులు పెడుతున్నారంటూ పిటిషన్లో ఆమె ప్రస్తావించారు.
సుప్రీంకోర్టులో సునీతా రెడ్డి పిటిషన్ వేసిన విషయాన్ని ప్రస్తావిస్తూ టీడీపీ అధికారిక సోషల్ మీడియా ఖాతాల్లో కొన్ని పోస్టులు పెట్టింది. ‘రాఖీ పండుగ నాడే, న్యాయం కోసం ఓ చెల్లెలి పోరాటం’ అంటూ కామెంట్ చేసిన టీడీపీ, ‘అన్న పాలనలో నిజం బయటకు రాదా?’ అని ప్రశ్నించింది. అన్న పాలన పైనే వైఎస్ సునీత ఫిర్యాదు చేశారంటూ టీడీపీ అందులో పేర్కొనడం గమనార్హం. మొత్తం మీద సునీత రెడ్డి సుప్రీం కోర్టులో పిటిషన్ ఏపీ రాజకీయాల్లో మరో సంచలనం కలిగిస్తుంది. గొడ్డలి కథను సుప్రీం అయిన తేల్చగలదా? అనేది చూడాలి.
Related News
Alla Ramakrishna Reddy : ముందు ఆర్కే తన విజయరేఖ చెక్ చేసుకోవాలి..!
ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల జోరు పెరిగింది. వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ముందుకు సాగుతన్నాయి ఆయా పార్టీలు. ఈ నేపథ్యంలోనే ఒకరిపై ఒకరు విమర్శలు గుప్పించుకుంటున్నారు.