HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Ys Sharmila Vs Ys Jagan Claiming Its Common They Dragged Us To Court

YS Sharmila vs YS Jagan: సామాన్యం అంటూనే కోర్టుకు ఈడ్చేసారు- వైఎస్ షర్మిల

  • Author : Kode Mohan Sai Date : 25-10-2024 - 10:46 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Ys Sharmila Vs Ys Jagan
Ys Sharmila Vs Ys Jagan

వైఎస్ షర్మిల తమ కుటుంబంలో ఆస్తుల వివాదంపై స్పందిస్తూ, “మా ఉద్దేశ్యం గొడవలు పెడుతుండాలని కాదు. ఈ విషయాన్ని సామరస్యంగా, నాలుగు గోడల మధ్య పరిష్కరించుకోవాలి” అని చెప్పారు. “కానీ ఈ విషయం సామాన్యంగా అనుకోడం సరైనది కాదు. అన్ని కుటుంబాల్లో జరుగుతుంది అని చెప్పి తల్లిని, చెల్లిని కోర్టుకు తీసుకెళ్లడం అనేది అందుకు సరిపోదు. ఇది సాధారణ విషయమేమీ కాదు, జగన్ సార్” అని ఆమె వ్యాఖ్యానించారు.

విజయనగరం జిల్లాలోని గుర్లలో నిన్న(24-10-2024) పర్యటించిన వైఎస్ జగన్, ఆస్తుల వివాదంపై స్పందించారు. “ప్రతి కుటుంబంలో ఇలాంటి సమస్యలు ఉంటాయి. కానీ, అవి చూపించి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని” చెప్పారు. రాష్ట్రంలో ఏ సమస్య వచ్చినా, దాన్ని దాటవేసి, తన తల్లి మరియు చెల్లి ఫోటోలతో సమస్యలను డైవర్ట్ చేస్తారన్న వ్యాఖ్యానాన్ని చేశారు. కుటుంబ కలహాలు అన్ని ఇళ్లల్లో సామాన్యమైనవి, తమ ఇంట్లో ఉన్న గొడవలు కూడా అందరితో సమానమే అని చెప్పారు. చంద్రబాబు ప్రచారం ఆపి ప్రజా సమస్యలపై దృష్టి పెట్టాలని జగన్ సూచించారు.

షర్మిల, వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలపై పరోక్షంగా స్పందిస్తూ, “సామాన్యం అంటూనే కోర్టుకు తీసుకెళ్లడం ఎలా సరైనది?” అని ప్రశ్నించారు. “ఇది సామాన్యమైన విషయమేమీ కాదు” అని పేర్కొన్నారు. ఈ విధంగా, వైఎస్ కుటుంబంలో ఆస్తుల వివాదం మరింత తీవ్రమవుతున్నట్లు తెలుస్తోంది.

వైఎస్ షర్మిల కామెంట్స్:

ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ 2016లో ఎటాచ్‌ చేసిన సరస్వతి పవర్‌ కంపెనీ షేర్లు బదిలీ చేస్తే జగన్‌కు బెయిల్‌ రద్దవుతుందని ఆయన దిగులుగా ఉన్నారని, ఈ విషయాన్ని గుర్తించి రాష్ట్ర కాంగ్రెస్‌ అధ్యక్షురాలు, జగన్‌ సోదరి వైఎస్ షర్మిల ప్రశ్నించారు. “2019లో 100% వాటాలు బదలాయిస్తామని స్పష్టంగా పేర్కొంటూ ఒప్పందంపై సంతకం ఎలా చేశారు?” అని ఆమె మండిపడ్డారు.

“ఎంవోయూ పై సంతకం చేసినప్పుడు బెయిల్‌ విషయం గుర్తుకు రాలేదా?” అని ఆమె నిలదీసారు. గురువారం ఒక ప్రకటనలో షర్మిల, “ఈడీ షేర్లు ఎటాచ్‌ చేయలేదు, కేవలం రూ. 32 కోట్ల విలువైన భూమి మాత్రమే ఎటాచ్‌ చేసింది” అని పేర్కొన్నారు.

“షేర్లు బదిలీ చేయకూడదని వాదిస్తున్న జగన్‌మోహన్‌రెడ్డి, 2021లో క్లాసిక్, సండూరులో ఉన్న కంపెనీ షేర్లను రూ. 42 కోట్లకు కొనుగోలు చేసేందుకు తల్లి వైఎస్‌ విజయమ్మకు ఎలా అనుమతి ఇచ్చారు? అప్పుడు బెయిల్‌ విషయం గుర్తురాలేదా?” అని ఆమె ప్రశ్నించారు.

“ఎన్నికల్లో ఓడిపోయాక, జగన్‌ ప్రాజెక్టును వదులుకోవడం ఇష్టం లేక, భారతి సిమెంట్‌ బ్యానర్‌ కింద సరస్వతి సిమెంట్‌ను నిర్వహించాలనుకుంటున్నారు. అందుకే ఈడీ ఎటాచ్‌మెంట్‌ విషయాన్ని ఇప్పుడు లేవనెత్తారు” అని షర్మిల విమర్శించారు.

బెయిల్‌ రద్దుకు కుట్ర అనడం శతాబ్దపు జోక్‌:

“చట్ట విరుద్ధమని తెలిసినా, చెల్లెలిపై ప్రేమతో జగన్‌ షేర్లు బదిలీ చేశారనడం పచ్చి అబద్ధం. ఆయన బెయిల్‌ రద్దు చేసేందుకే కుట్ర అనడం ఈ శతాబ్దపు పెద్ద జోక్. ఆస్తులపై ప్రేమతో రక్త సంబంధాలను, అనుబంధాలను మర్చిపోయారు. నాలుగు గోడల మధ్య కూర్చొని పరిష్కరించుకోవాల్సిన కుటుంబ విషయాలను రోడ్డు మీదకు తీసుకెళ్లారు. అదీ చాలదన్నట్లుగా, ఇప్పుడు కోర్టుల వరకూ తీసుకెళ్లారు” అని షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు.

షేర్లు ఎప్పుడైనా బదిలీ చేయవచ్చు:

“ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) సరస్వతి పవర్‌ కంపెనీ షేర్లను ఎప్పుడూ ఎటాచ్‌ చేయలేదు. ఏ సమయంలోనైనా వాటిని బదిలీ చేసుకోవచ్చు. ఎటువంటి కంపెనీ ఆస్తులను ఈడీ ఎటాచ్‌ చేసినా, ఆ కంపెనీ షేర్ల బదిలీని ఎప్పుడూ ఆపలేదు. స్టాక్‌ మార్కెట్లలో చాలా కంపెనీల ఆస్తులను ఈడీ ఎటాచ్‌ చేసింది, అయినప్పటికీ వాటి ట్రేడింగ్‌ కొనసాగుతోంది. పేర్లు కూడా బదిలీ అవుతుంటాయి” అని షర్మిల వివరించారు.

“ఈడీ ఎటాచ్‌మెంట్‌పై 2019 జులై 26న చేసిన అప్పీల్‌ను ట్రిబ్యునల్ అనుమతించి, తాత్కాలిక జప్తు ఉత్తర్వులను పక్కన పెట్టింది. కంపెనీ షేర్లు ఈడీ ముందు రాకుండా ఉండాలని పేర్కొంది” అని ఆమె చెప్పారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Saraswathi power Company
  • ys jagan
  • YS Jagan vs YS Sharmila
  • ys sharmila

Related News

Polavaram Project

జగన్ వల్లే పోలవరం ప్రాజెక్టు నాశనం.. తేల్చి చెప్పిన కాగ్ నివేదిక

Polavaram Project  దేశానికే తలమానికం కావాల్సిన పోలవరం జాతీయ ప్రాజెక్టు గత కొన్నేళ్లుగా ఎదుర్కొంటున్న విఘాతాలపై దేశ అత్యున్నత ఆడిట్ సంస్థ ‘కాగ్’ (CAG) సంచలన నివేదికను వెల్లడించింది. ముఖ్యంగా 2019 నుండి 2023 మధ్య కాలంలో ప్రభుత్వ నిర్ణయాలు ప్రాజెక్టు పురోగతిని ఎలా దెబ్బతీశాయో ఈ నివేదికలో గణాంకాలతో సహా వివరించారు. రాష్ట్ర బడ్జెట్ నుంచి ప్రాజెక్టుకు అందాల్సిన మద్దతు భారీగా తగ్గడం వల్ల

  • ED Attaches Rs 441 Crore Assets in Andhra Pradesh Liquor Scam Case

    వైసీపీ మద్యం కుంభకోణంలో.. 441 కోట్ల ఆస్తులు ED అటాచ్

Latest News

  • అల్లు అర్జున్- అట్లీ క్రేజీ కాంబో.. ఏప్రిల్ 8న టైటిల్ ప్రకటన!

  • ఇషాన్ కిష‌న్ పెళ్లి ఎప్పుడో తెలుసా?!

  • ఇండిగోకు భారీ షాక్‌.. సీఈవో ప‌ద‌వికి పీటర్ రాజీనామా!

  • ఇరాన్ మ‌రో సంచ‌ల‌న నిర్ణ‌యం.. చ‌మురు ధ‌ర‌లు పెర‌గ‌నున్నాయా?!

  • మహిళల్లో హార్మోన్ల అసమతుల్యత.. ఇవే ల‌క్ష‌ణాలు?!

Trending News

    • భార‌త్ ఘ‌న‌విజ‌యం.. బీసీసీఐ ఏం చేసిందంటే?

    • సిలిండ‌ర్ల స‌ర‌ఫ‌రాపై నిషేధం..?

    • ఐపీఎల్ 2026.. తొలి మ్యాచ్ ఈ జ‌ట్ల మ‌ధ్యే?!

    • మందుబాబులకు గుడ్‌న్యూస్.. ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు

    • టీమిండియా నెక్స్ట్ టార్గెట్ ఇదేనా?!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd