HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Ys Jagans New Strategy Key Responsibilities Assigned To Mudragada Giri

Mudragada Giri: వైఎస్ జగన్ నయా స్ట్రాటజీ… ముద్రగడ గిరికి కీలక బాధ్యతలు!

వైఎస్సార్‌సీపీ నేత ముద్రగడ పద్మనాభ రెడ్డి కుమారుడు గిరికి అధినేత వైఎస్ జగన్ కీలక బాధ్యతలు అప్పగించారు. ఈ విషయమై పార్టీ కేంద్ర కార్యాలయం ప్రకటన విడుదల చేసింది.

  • By Kode Mohan Sai Published Date - 11:51 AM, Tue - 3 December 24
  • daily-hunt
Ys Jagan Key Post To Mudragada Giri
Ys Jagan Key Post To Mudragada Giri

ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీకి ఘోర పరాజయం ఎదురైంది. ఆ పార్టీ కేవలం 11 సీట్లకే పరిమితమైంది. మంత్రులుగా పనిచేసిన సీనియర్ రాజకీయ నేతలు కూడా ఓడిపోయారు. ఎన్నికల ఫలితాల అనంతరం, పలువురు మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలు వైఎస్సార్‌సీపీకి గుడ్ బై చెబుతున్నారు. కొన్ని నియోజకవర్గాల్లో పార్టీకి ఇంచార్జ్ లేని పరిస్థితి కూడా కనిపిస్తోంది. ఈ క్రమంలో, వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ జిల్లా వారీగా సమీక్షలు నిర్వహిస్తున్నారు. పార్టీ అనుబంధ విభాగాలు, జిల్లా అధ్యక్షులతో కలిసి, అవసరమైన చోట్ల నియోజకవర్గాల ఇంచార్జ్‌లను మారుస్తున్నారు.

తాజాగా, వైఎస్ జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. వైఎస్సార్‌సీపీ నేత ముద్రగడ పద్మనాభ రెడ్డి కుమారుడు ముద్రగడ గిరికి ప్రమోషన్ ఇచ్చారు. గిరికి ముఖ్యమైన బాధ్యతలను అప్పగించారు. ఆయన్ను కాకినాడ జిల్లా ప్రత్తిపాడు అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తగా నియమించారు. అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఆదేశాల ప్రకారం గిరికి ఈ బాధ్యతలు అప్పగించినట్లు వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది.

Mudragada Giri

Mudragada Giri

ముద్రగడ పద్మనాభం గతంలో టీడీపీ, కాంగ్రెస్ పార్టీల్లో కీలక నేతగా ఉన్నారు. ఆ తర్వాత కొంతకాలం రాజకీయాలకు దూరంగా ఉన్నారు. 2014-2019 మధ్య కాపు ఉద్యమ నేతగా ఆయన కీలక బాధ్యతలను నిర్వహించారు, కానీ ఆ తర్వాత ఆ పదవి నుంచి తప్పుకున్నారు. కాపులకు రిజర్వేషన్లు కల్పించేందుకు వరుసగా అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబుకు లేఖలు రాశారు. ఆ తరువాత కొంతకాలం రాజకీయాల్లో సైలెంట్‌గా ఉన్నారు. అయితే, 2024 ఎన్నికల నేపథ్యంలో ముద్రగడ మళ్లీ రాజకీయాల్లో యాక్టివ్ కావాలని భావించారు. ఈ క్రమంలో ఆయన జనసేన పార్టీలో చేరతారని ప్రచారం సాగింది. కానీ, ఆ దిశగా ఎలాంటి అడుగులు పడలేదు.

జనసేన నుంచి ఆహ్వానం రాకపోవడంతో కొద్ది రోజుల తరువాత ముద్రగడ పద్మనాభం వైఎస్సార్‌సీపీలో చేరారు. ఆయన ఈ ఎన్నికల్లో పోటీ చేయలేదు, కానీ వైఎస్సార్‌సీపీ అధిష్టానం ముద్రగడకు పిఠాపురం నియోజకవర్గంలో పార్టీ అభ్యర్థిని గెలిపించే బాధ్యతలు అప్పగించింది. పిఠాపురంలో పవన్ కళ్యాణ్‌ను ఓడించకపోతే తన పేరును “ముద్రగడ పద్మనాభ రెడ్డి”గా మార్చుకుంటానని ఆయన సవాల్ చేశారు. కానీ, పిఠాపురంలో పవన్ కళ్యాణ్ విజయం సాధించడంతో, ముద్రగడ తన పేరును పద్మనాభ రెడ్డిగా మార్చుకున్న విషయం తెలిసిందే.

ప్రత్తిపాడు నియోజకవర్గం విషయానికి వస్తే, ఉమ్మడి రాష్ట్ర విభజన తర్వాత 2014 ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ నుంచి పోటీచేసిన వరుపుల సుబ్బారావు విజయం సాధించారు. కానీ కొంతకాలం తర్వాత, ఆయన వైఎస్సార్‌సీపిని వీడి టీడీపీలో చేరారు. 2019 ఎన్నికల్లో, టీడీపీ వరుపుల సుబ్బారావుకు టికెట్ ఇవ్వకుండా, వరుపుల రాజాకు ఛాన్స్ ఇచ్చింది. అయితే, వైఎస్సార్‌సీపీ అభ్యర్థి పర్వత పూర్ణచంద్ర ప్రసాద్ చేతిలో వరుపుల రాజా ఓడిపోయారు.

2019 ఎన్నికల ఫలితాల తర్వాత వరుపుల సుబ్బారావు మళ్లీ వైఎస్సార్‌సీపీలో చేరారు. 2024 ఎన్నికల్లో, వైఎస్సార్‌సీపీ తన సిట్టింగ్ ఎమ్మెల్యే పర్వత పూర్ణచంద్ర ప్రసాద్‌ను పక్కన పెట్టి వరుపుల సుబ్బారావును పోటీకి నిలిపింది. కానీ, టీడీపీ అభ్యర్థి వరుపుల సత్యప్రభ చేతిలో ఆయన ఓడిపోయారు. ఇక, వరుపుల సుబ్బారావు నియోజకవర్గ సమన్వయకర్తగా ఉన్న సమయంలో, ఆయన స్థానంలో ఇప్పుడు ముద్రగడ గిరికి బాధ్యతలు అప్పగించారు.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Mudragada Giri
  • mudragada padmanabha reddy
  • ys jagan
  • ysrcp

Related News

Elections

Elections: మార్చిలో స్థానిక సంస్థల ఎన్నికలు?

మంత్రి పొంగూరు నారాయణ ఇటీవ‌ల మాట్లాడుతూ.. రాష్ట్రంలో పట్టణ స్థానిక ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, ఎన్నికల కమిషన్‌తో చర్చించి త్వరలో షెడ్యూల్‌ను ప్రకటిస్తామని తెలిపారు.

  • Botsa Satyanarayana

    YCP: కూట‌మి ప్ర‌భుత్వం ప్ర‌వేశ‌పెట్టిన‌ కార్మిక బిల్లుపై వైసీపీ తీవ్ర అభ్యంత‌రం!

Latest News

  • BSNL : బీఎస్ఎన్ఎల్ కస్టమర్లకు గుడ్‌న్యూస్

  • Vote For Note Case : మరోసారి ఓటుకు నోటు కేసు విచారణ

  • Big Shock to TDP : వైసీపీలో చేరిన కీలక నేతలు

  • KCR : కేటీఆర్, హరీశ్ రావుతో కేసీఆర్ మీటింగ్

  • OG Success : OG సక్సెస్ ను ఎంజాయ్ చేయలేకపోతున్న పవన్

Trending News

    • Prime Minister Routine Checkup: ప్రధానమంత్రి మోదీ ఆరోగ్య ప్రోటోకాల్.. ప్రతి 3 నెలలకు ఒకసారి చెకప్!

    • Rupee: పుంజుకున్న రూపాయి.. బ‌ల‌హీన‌ప‌డిన డాల‌ర్‌!

    • IND vs PAK Final: భార‌త్‌- పాక్ మ‌ధ్య ఫైన‌ల్ మ్యాచ్‌.. పైచేయి ఎవ‌రిదంటే?

    • Ladakh: లడఖ్‌లో ఉద్రిక్త ప‌రిస్థితుల‌కు కార‌ణాలీవేనా??

    • UPI Boom: యూపీఐ వినియోగం పెరగడంతో నగదు వాడకం తగ్గింది: ఆర్‌బీఐ

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd