HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • >Andhra Pradesh
  • >Ys Jagan Using My Mother And Sisters Photos For Politics

YS Jagan: నా తల్లి, చెల్లి ఫోటోలతో రాజకీయాలా?

  • By Kode Mohan Sai Published Date - 02:52 PM, Thu - 24 October 24
  • daily-hunt
Ys Jagan In Gurla Village
Ys Jagan In Gurla Village

YS Jagan: వైఎస్సార్ కుటుంబంలో ఆస్తి తగాదాల అంశం ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలో, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మరియు చెల్లెలు వైఎస్ షర్మిల మధ్య లేఖల వ్యవహారం వెలుగులోకి వచ్చింది. షర్మిలకు రాసిన లేఖలో, “నేను నీకు రాసిచ్చిన ఆస్తులను వెనక్కి తీసుకుంటున్న” అని జగన్ పేర్కొన్నారని, దీనికి షర్మిల ఘాటుగా సమాధానం ఇచ్చినట్లు సోషల్ మీడియాలో కొన్ని లేఖలు వైరల్ అవుతున్నాయి.

ఈ క్రమంలో, ఆస్తుల వివాదంపై వైఎస్ జగన్ స్పందించారు. విజయనగరం జిల్లా గుర్లలో ఆయన పర్యటించిన సందర్భంగా, ఆస్తులకు సంబంధించిన అంశాలపై మాట్లాడారు. ఆయన వ్యాఖ్యలు ఈ అంశంపై మరింత చర్చకు ప్రేరేపించాయి. జగన్ చెప్పిన విషయాలు, ఈ వివాదం ఎలా రూపు దిద్దుకున్నాయి అన్నది ప్రజల్లో ఆసక్తిని కలిగించాయి.

విజయనగరం జిల్లా పర్యటనకు వస్తున్నానని తెలిసి, టీడీపీ టాపిక్ డైవర్ట్ చేసిందని ఆరోపించారు జగన్. తన చెల్లి మరియు తల్లి ఫోటోలతో రాజకీయం చేస్తున్నారని, వారి ఇళ్లలో ఇలాంటి సమస్యలు లేవా అని ప్రశ్నించారు. ఈ విషయాలు ప్రతి ఇంట్లో ఉండే సాధారణ అంశాలు, కానీ స్వార్థం కోసం వాటిని పెద్దదిగా చూపించడం, వక్రీకరించి వివరించడం తగదని ఆయన అన్నారు.

ఇలాంటి అంశాలను వదిలేసి, ప్రజల సమస్యలపై ఎక్కువ దృష్టి పెట్టాలనే హితవు పలికారు. టీడీపీ, కూటమి అక్రమాలు మరియు అన్యాయాలను బయటపెడుతున్నందున డైవర్షన్ పాలిటిక్స్‌ను ప్రారంభించారంటూ ఆయన వ్యాఖ్యానించారు.

గుర్లలో పరిస్థితులు దారుణంగా ఉన్నాయని చెప్పారు జగన్. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో గ్రామస్వరాజ్యం తీసుకొచ్చామని, ఆ సమయంలో గ్రామ సచివాలయాల్లో వివిధ శాఖల ఉద్యోగులు కనిపించేవారన్నారు. గ్రామాల్లో విలేజ్ క్లినిక్‌లు ఉండేవని, వాటితో అనుసంధానంగా ఏఎన్‌ఎంలు పనిచేస్తుండేవారని చెప్పారు. ప్రతి గ్రామంలో ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ ఉండేది, కానీ ప్రస్తుతం పరిస్థితులు చూస్తే అవి మారిపోయాయని వ్యాఖ్యానించారు.

గుర్లలో డయేరియాతో 14 మంది చనిపోయారని, తాను ట్వీట్ చేస్తే తప్ప పట్టించుకునే వారు లేరన్నారు. సెప్టెంబర్ 20న తొలి డయేరియా మృతి కేసు నమోదైనప్పటి నుంచి 35 రోజులైనా ప్రభుత్వం స్పందించలేదన్నారు. ప్రభుత్వ దృష్టి లేకపోవడం వల్లనే ఈ పరిస్థితులు ఏర్పడినట్లు ఆయన అన్నారు.

చంపా నదిలో నీళ్లు దారుణంగా ఉన్నాయని చెప్పారు జగన్. చంపా నదిపై వాటర్ స్కీమ్ మెయింటెనెన్స్‌ను రెన్యూవల్ చేయలేదని, ఈ 5 నెలల్లో కనీసం క్లోరినేషన్ కూడా జరగలేదన్నారు. గుర్ల మండల ప్రభుత్వాస్పత్రిలో 340 మంది చికిత్స పొందుతున్నారని, మరో 100 మందికి పైగా ప్రైవేట్ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారని పేర్కొన్నారు.

మెరుగైన చికిత్స కోసం బాధితులను విశాఖ లేదా విజయనగరం ఆస్పత్రులకు ఎందుకు తరలించలేదని ప్రశ్నించారు. బాధిత కుటుంబాలను డయేరియాతో చనిపోయారని చెప్పొద్దని ఉచిత సలహాలు ఇస్తున్నారని, సీహెచ్‌సీల్లో స్పెషలిస్టు డాక్టర్లను తొలగించినట్లు తెలిపారు.

డయేరియా మృతుల కుటుంబాలకు వైఎస్సార్‌సీపీ ఆర్థిక సాయం అందిస్తామని ప్రకటించారు జగన్. మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షల చొప్పున సాయం అందిస్తామని వెల్లడించారు. డైవర్షన్ పాలిటిక్స్‌ను ఆపి ప్రజలకు క్షమాపణ చెప్పాలని ఆయన కోరారు.

మదనపల్లిలో ఫైళ్లు తగలబడినప్పుడు హెలికాఫ్టర్‌లో డీజీపీని పంపారని, కానీ ఇక్కడ ప్రాణాలు పోతున్నా ఒక్క మంత్రి కూడా రాలేదని ఆయన విమర్శించారు. రాష్ట్ర ప్రజలకు అండగా ఉండాల్సిన ప్రతి సమయంలో చంద్రబాబు తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని జగన్ వ్యాఖ్యానించారు.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Gurla Diarrhea
  • Gurla Village
  • ys jagan
  • ys sharmila
  • YS Vijiyamma

Related News

YS Jagan

YS Jagan: ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై మాజీ ముఖ్యమంత్రి జగన్ తీవ్ర విమర్శలు

ఆరోగ్యశ్రీని ప్రైవేటు బీమా కంపెనీలకు అప్పగించడంపై జగన్ సందేహాలు వ్యక్తం చేశారు. ఇది లాభాలు ఆశించి పనిచేసే ప్రైవేటు కంపెనీలకు ప్రజల సొమ్ము దోచిపెట్టడానికేనని ఆరోపించారు.

  • Kuppam

    Kuppam: కుప్పం.. ఇక దేశానికే రోల్‌మోడల్‌!

  • Lokesh's satire on Jagan

    Vip Passes : ‘ఓరి నీ పాసుగాల’ ..కార్యకర్తలను కలిసేందుకు పాసులు ఏందయ్యా : జగన్‌ పై లోకేశ్ సెటైర్

  • Ys Jagan

    YS Jagan : జగన్ పిచ్చికి పరాకాష్ట.. వీఐపీ పాస్ ఉంటేనే దర్శనమిస్తాడట..!

  • Sharmila

    Sharmila: అన్నమయ్య ఇక అనాథ ప్రాజెక్టేనా?: వైఎస్ షర్మిల

Latest News

  • India: హాకీ ఆసియా కప్.. ఫైన‌ల్‌కు చేరిన భార‌త్‌!

  • Lunar Eclipse: చంద్ర‌గ్ర‌హ‌ణం రోజున‌ గర్భిణీలు చేయాల్సినవి, చేయకూడనివి ఇవే!

  • GST Rates: జీఎస్టీ మార్పులు.. భారీగా త‌గ్గ‌నున్న ధ‌ర‌లు!

  • Aligned Partners: ట్రంప్ కొత్త వాణిజ్య విధానం.. ‘అలైన్డ్ పార్టనర్స్’కు సున్నా టారిఫ్‌లు!

  • MMTS Trains: రైల్వే ప్ర‌యాణికుల‌కు గుడ్ న్యూస్‌.. ఉద‌యం 4 గంట‌ల వ‌ర‌కు రైళ్లు!

Trending News

    • GST Reforms Impact: హోట‌ల్స్ రూమ్స్‌లో ఉండేవారికి గుడ్ న్యూస్‌!

    • Lunar Eclipse: రేపే చంద్ర‌గ్ర‌హ‌ణం.. ఏ దేశాల‌పై ప్ర‌భావం అంటే?

    • Chandra Grahan 2025 : 7న సంపూర్ణ చంద్రగ్రహణం..జ్యోతిష్య ప్రభావంతో ఏ రాశులకు శుభం? ఏ రాశులకు అశుభం?..!

    • Yograj Singh: ధోనితో సహా చాలా మంది ఆటగాళ్లు వెన్నుపోటు పొడిచారు: యువ‌రాజ్ తండ్రి

    • Sara Tendulkar: సచిన్ కుమార్తె సారా టెండూల్కర్‌కు నిజంగానే ఎంగేజ్‌మెంట్ జ‌రిగిందా?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd