HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Ycps Unnecessary Rhetoric On Revaluation Of Tenth Papers

Revaluation : టెన్త్ పేపర్ల రీవాల్యుయేషన్ పై వైసిపి అనవసర రాద్ధాంతం

Revaluation : 2022 నుంచి 2025 వరకు వచ్చిన రీకౌంటింగ్ దరఖాస్తులు, వాటిలో మార్పులు జరిగిన స్క్రిప్టులు శాతాలను ప్రభుత్వం వెల్లడించింది. ఈ ఏడాది 66,363 పేపర్లకు 34,709 మంది విద్యార్థులు రీవెరిఫికేషన్ కోరగా

  • Author : Sudheer Date : 30-05-2025 - 10:22 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
10th Paper
10th Paper

అమరావతి: పదోతరగతి పరీక్షల రీవాల్యుయేషన్ (Revaluation of Tenth Papers) పై వైసిపి పార్టీ ప్రభుత్వంపై అనవసరమైన ఆరోపణలు చేస్తూ బురదజల్లుతోంది. ఇందుకు సంబంధించి వాస్తవాలను ప్రభుత్వం ప్రజల ముందు ఉంచుతోంది. టెన్త్ ఫలితాలు విడుదలయ్యాక కొన్ని పేపర్లలో తమకు అన్యాయం జరిగిందని విద్యార్థులు భావించినపుడు రీకౌంటింగ్, రీవెరిఫిషన్ కు కోరడం ఎప్పటినుంచో సహజంగా జరిగే ప్రక్రియ. గత నాలుగేళ్లలో రీకౌంటింగ్, రీ వెరిఫికేషన్ కోరిన విద్యార్థులు, ఆయా పేపర్లలో జరిగిన మార్పులను పరిశీలిస్తే ఈ విషయం స్పష్టమవుతోంది.

రీకౌంటింగ్/రీవెరిఫికేషన్ కోసం 2022లో 41,694 దరఖాస్తులు రాగా, అందులో 8,235 స్క్రిప్టులు (20శాతం), 2023లో 61,887 దరఖాస్తులు రాగా, అందులో 10,987 స్క్రిప్టులు (18శాతం), 2024లో 55,930 దరఖాస్తులు రాగా, 9,231 (17శాతం), 2025లో 66,363 దరఖాస్తులు రాగా, 11,175 (18శాతం) స్క్రిప్టులకు సంబంధించి మార్కుల్లో మార్పులు రాగా, వాటిని సరిచేయడం జరిగింది. ఈ ఏడాది ఎస్ఎస్ సి పబ్లిక్ పరీక్షలకు 6,14,459మంది విద్యార్థులు హాజరుకాగా, 34,709మంది విద్యార్థులు 66,363 పేపర్ల రీకౌంటింగ్/రీ వెరిఫికేషన్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. 10,159 మంది విద్యార్థులకు సంబంధించి 11,175 స్క్రిప్టుల్లో మార్కుల తేడాలను గమనించి సరిచేయడం జరిగింది.

Easwaran Departs: రోహిత్ శ‌ర్మ రిప్లేస్‌మెంట్.. నిరాశ‌ప‌ర్చిన అభిమ‌న్యు ఈశ్వ‌ర‌న్‌!

అందులో 24,550 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్న 55,188 (83.16%) పేపర్లలో ఎటువంటి మార్పులు లేవు. 8,863 స్క్రిప్టుల్లో (13.36%) కేవలం 1నుంచి 5 మార్కుల వ్యత్యాసం కన్పించగా, 1506 స్క్రిప్టుల్లో (2.27%) 6నుంచి 10మార్కుల వ్యత్యాసం కన్పించింది. 343 స్క్రిప్టుల్లో (0.52శాతం) 11నుంచి 15మార్కులు, 163 స్క్రిప్టుల్లో (0.25%) 16నుంచి 20 మార్కుల వ్యత్యాసాన్ని, 300 స్క్రిప్టుల్లో 20 మార్కులకు పైబడి మార్కుల తేడాను గుర్తించి సరిచేయడం జరిగింది. ఈ ఏడాది మొత్తం మూల్యాంకన జరిగిన 45,96,527 స్క్రిప్టుల్లో వ్యత్యాసం గుర్తించింది 0.0006 శాతం స్క్రిప్టుల్లో మాత్రమే.

పదోతరగతి విద్యార్థుల మార్కుల్లో వ్యత్యాసానికి సంబంధించి బాధ్యులను చేస్తూ రెండుదశాబ్ధాల్లో తొలిసారిగా 5గురు ఎవాల్యుయేటర్స్ ను సస్పెండ్ చేయడం జరిగింది. రీకౌంటింగ్/రీ వెరిఫికేషన్ కు వచ్చిన దరఖాస్తులన్నింటినీ పరిశీలించి, తప్పులున్న వాటిని సరిచేసి జూన్ 1, 2025కల్లా డిస్పోజ్ చేసేలా చర్యలు తీసుకోవడం జరిగింది. ఆర్ జెయు కెటిల్లో దరఖాస్తులకు మే 20, 2025 చివరితేదీ కాగా, రీవెరిఫికేషన్ అభ్యర్థులకు అన్యాయం జరగకుండా జూన్ 5 నుంచి జూన్ 10వతేదీ వరకు స్పెషల్ రీఅప్లికేషన్ విండో తెరచి ఉంచాలని ఆదేశించడం జరిగింది. వచ్చే ఏడాది నుంచి తప్పిదాలను సాధ్యమైనంత తగ్గించేందుకు ఒఎంఆర్ షీటు డిజైన్ లో మార్పులు తేవాలని ప్రభుత్వం నిర్ణయించింది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • 10th papers
  • Revaluation
  • tdp
  • ycp

Related News

Atchannaidu Vs Botsa Satyanarayana

బొత్స సత్యనారాయణ కు ఇచ్చిపడేసిన అచ్చెన్నాయుడు.. అచ్చం VS బొత్స

Acham Naidu Vs Botsa Satyanarayana  ఏపీ శాసనమండలి సమావేశాల్లో గందరగోళ పరిస్థితి నెలకొంది. సభలోకి విజిల్స్ తీసుకొచ్చిన వైసీపీ సభ్యులు… ఛైర్మన్ పోడియం వద్ద విజిల్స్ వేస్తూ హంగామా సృష్టించారు. ఈ క్రమంలో సభ కాసేపు వాయిదా పడంది. అనంతరం మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ వైసీపీ సభ్యుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందాపూర్ డెయిరీకి, హెరిటేజ్‌కు ఎలాంటి సంబంధం లేదని అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు.

  • BR Naidu

    తిరుమల నెయ్యి టెండర్లపై ‘వైసీపీ’ దుష్ప్రచారం.. వాస్తవాలను వెల్లడించిన టీటీడీ చైర్మన్!

  • TDP candidate Bodepudi Revathi wins in Madhira

    మధిర మున్సిపాలిటీలో టిడిపి పార్టీ అభ్యర్థి భారీ గెలుపు

  • Kakani Notice

    విచారణకు రావాలని కాకాణికి నోటీసులు

Latest News

  • AI Summit Delhi 2026: ఏఐ సమ్మిట్ కు సీఎం చంద్రబాబు

  • పదేపదే ఆకలి అవుతుందా? అయితే కార‌ణాలివే!!

  • టీ20 వరల్డ్ కప్ 2028కు 12 జట్లు క్వాలిఫై.. లిస్ట్ ఇదే!

  • కాంగ్రెస్ నాయ‌కుల‌కు నోటీసులు పంపిన లోక్‌స‌భ ప్రివిలేజ్ క‌మిటీ!

  • టీ20 క్రికెట్‌లో అత్యంత విజయవంతమైన కెప్టెన్‌గా సూర్యకుమార్ యాదవ్!

Trending News

    • 122 ఏళ్ల తర్వాత తెరుచుకోనున్న ఒడిశాలోని కోణార్క్ సూర్య దేవాలయం లో గర్భగుడి

    • విజయ్-రష్మిక వివాహం.. రాజకీయ, సినీ ప్రముఖుల రాక!

    • టీ20 వరల్డ్ కప్ 2026.. అహ్మదాబాద్‌లో భారత్ vs దక్షిణాఫ్రికా!

    • భారత్ నుండి ఐసీసీ టోర్నమెంట్‌ల తరలింపు? బీసీసీఐకి భారీ షాక్!

    • Gold Silver Rate Today: బంగారం, వెండి ధరల్లో మళ్లీ పరుగు.. వెండి ఏకంగా రూ. 8,000 పైకి!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd