YCP vs TDP : జగన్ సిద్దం మీటింగ్ కి గ్రీన్ మ్యాట్ గ్రాఫిక్స్..?
- By Kavya Krishna Published Date - 08:20 PM, Sat - 9 March 24
ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అన్ని పార్టీలు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్నాయి. ప్రతిసారీ ఓటర్లను ఆకర్షించేందుకు రకరకాల వ్యూహాలు పన్నడం చూస్తున్నాం. ఇప్పుడు, వైఎస్ జగన్ తన కొనసాగుతున్న ప్రచారంలో “VFX” వ్యూహాన్ని అమలు చేయడం ప్రారంభించారని టీడీపీ ఎత్తి చూపుతోంది. జగన్ తన పోరాట యాత్రలో భాగంగా గత కొన్ని వారాలుగా “సిద్ధం” బహిరంగ సభలు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమాల వేదికల వద్ద గ్రీన్ కార్పెట్లు పరిచారు. టీడీపీ అధికారిక హ్యాండిల్ గ్రీన్ కార్పెట్లు వేసిన “సిద్ధం” సభ వేదిక నుండి కొన్ని ఫోటోలను పంచుకుంది. వీఎఫ్ఎక్స్ని ఉపయోగించి మరింత మందిని చేర్చుకోవడానికి జగన్ ఈ గ్రీన్ కార్పెట్లను ఉపయోగిస్తున్నారని విమర్శించింది. “ఈ సిద్ధం ఈవెంట్ల ప్రత్యక్ష ప్రసారానికి 40 నిమిషాలు ఆలస్యం అవుతుంది. లైవ్ ఫుటేజీని ప్రదర్శించడానికి విలేకరులను కూడా అనుమతించడం లేదు” అని టీడీపీ హ్యాండిల్ ఆరోపించింది. ఈ ఆరోపణలతో, జగన్ తన ప్రతి మీటింగ్లో భారీ జనాన్ని ప్రదర్శించడానికి VFX ఉపయోగిస్తున్నారా అని ఇప్పుడు నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.
We’re now on WhatsApp. Click to Join.
ఇదిలా ఉంటే.. ఏపీ వచ్చే ఎన్నికలపై అందరి దృష్టి ఉంది. ఈ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారనే ప్రశ్నం అందరిలోనూ మెదులుతోంది. మొన్నటి వరకు ఒంటరిగానే వెళ్తామని ప్రకటించిన జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఏపీ రాజకీయ పరిస్థితలకు అనుగుణంగా టీడీపీతో చేతులు కలిపారు. అంతేకాకుండా.. బీజేపీ సైతం టీడీపీ – జనసేనతో కలిసి వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమవుతుంది. ఈ క్రమంలోనే బీజేపీ -జేఎస్పీ- టీడీపీ కూటమిలో సీట్ల పంపకాలు జరుగుతున్నాయి. ఇవాళో రేపో ఈ సీట్ల పంపకం కొలిక్కే వచ్చే అవకాశం ఉంది. అయితే.. ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించిన వైసీపీ సిద్ధం పేరిట బహిరంగ సభలను నిర్వహిస్తూ ప్రచారంలో దూసుకుపోతుంది. ఈ నెల 16 నుంచి సీఎం జగన్ ఎన్నికల ప్రచారాన్ని అధికారికంగా ప్రకటించనున్నారు. ఉత్తరాంధ్ర నుంచి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనున్న జగన్.. 26 జిల్లాల్లో రోడ్షోలు, సభల్లో పాల్గొననున్నారు. రోజుకు కనీసం 3 నియోజకవర్గాల్లో జగన్ ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. చివరిదశలో రోజూ 4 నియోకవర్గాల్లో జగన్ ఎన్నికల ప్రచారం నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. టీడీపీ కూటమి టార్గెట్గా జగన్ ఎన్నికల ప్రచారం సాగనుంది. అయితే.. రేపు నిర్వహించనున్న చివరి సిద్ధం సభలో వైసీపీ మేనిఫెస్టోను జగన్ విడుదల చేయనున్నారు.
Read Also : AP Politics : బీజేపీలో వైసీపీ స్లీపర్ సెల్స్..!
Related News
MLC Kavitha : 63 రోజులు అవుతున్నా కవిత బెయిల్పై నో క్లారిటీ..!
ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసుకు సంబంధించి మనీలాండరింగ్ విచారణలో ఇప్పటికే తీహార్ జైలులో ఉన్న తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు కుమార్తె కవితను సిబిఐ అరెస్టు చేసింది. ఈడీ ఆమెను గతంలో మార్చి 15న హైదరాబాద్లో అరెస్టు చేసింది.