HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Ycp Colors Of Chicken Eggs Political Parties Fires On The Issue

YCP Party: కోడిగుడ్లకు వైసీపీ రంగులు.. ఇదేమీ ప్రచారం అంటున్న జనం

ఎన్నికలు సమీపిస్తున్నాయంటేనే ప్రధాన పార్టీలు అనేక రకాలుగా ప్రచార పర్వానికి దిగుతాయి.

  • Author : Balu J Date : 28-07-2023 - 4:22 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Eggs
Eggs

ఎన్నికలు సమీపిస్తున్నాయంటేనే ప్రధాన పార్టీలు అనేక రకాలుగా ప్రచార పర్వానికి దిగుతాయి. గడియారాలు, అంబ్రెల్లా, టోపీలు లాంటి వస్తువులకు రంగులేసి ఓటర్లను ఆకర్షించాలని ప్రయత్నాలు చేస్తుంటాయి. అయితే ఏపీలో అధికార పార్టీ ప్రచార తీరుపై ఇతర పార్టీలు మండిపడుతున్నాయి. ప్రచారానికి కోడిగుడ్లను కూడా వాడుకుంటారా అంటూ మండిపడుతున్నాయి. పిల్లలకు వైఎస్సార్ సంపూర్ణ పోషణ కింద ఇచ్చే గుడ్లపై వైఎస్సార్ ఎస్సీ అని, జగనన్న గోరుముద్ద కింద అందించే గుడ్లపై జేజీఎమ్ అని ముద్ర వేసి పంపిణీ చేయడం కనిపించింది.

ఇది ఏపీలో కొన్ని ఏరియాల్లో మాాత్రమే కనిపించింది. పార్టీ నేతలు చేశారా? అధికారులు చేశారా? అనేది తెలియాల్సి ఉంది. వైఎస్సార్ పోషణ కింద ప్రతినెలా ఆంగన్‌వాడీల్లో చిన్నారులు, బాలింతలు, గర్భిణీ స్త్రీలకు 25 చొప్పున, గిరిజన ప్రాంతాల్లో అయితే వీరికి 30 చొప్పున కోడిగుడ్లు ఇస్తారు. ఎన్నికల వస్తుండటంతో గుడ్లపై రంగులు కనిపించాయి. సంపూర్ణ పోషణ పథకాన్ని షార్ట్ కట్ చేసి కోడిగుడ్లపై ముద్రించి మరీ పంపిణీ చేస్తున్నారు.

ప్రతినెల ఒకటో తేదీ నుంచి 10వ తేదీ వరకు కోడిగుడ్లపై పింక్ కలర్, 11 నుంచి 20వ తేదీ వరకు సరఫరా చేసే గుడ్లపై బ్లూ కలర్, 21 నుంచి నెల చివరి వరకు గ్రీన్ కలర్ వేసిన కోడి గుడ్లను పంపిణీ చేస్తూ వచ్చారు. ఇప్పటివరకు కోడిగుడ్లపై కలర్లు ముద్రిస్తూ వచ్చారు. గుడ్లను కూడా రాజకీయ ప్రచారానికి వాడుకుంటున్నారని ప్రతిపక్ష నేతలు ఆరోపిస్తున్నారు. ఈ ఇష్యూపై వైసీపీ నేతలు ఏవిధంగా రియాక్ట్ అవుతారో వేచి చూడాలి.

కాగా పాఠశాల విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని అందించాలంటే ఉద్దేశంతో వైఎస్ జగన్ సర్కార్ 2020 జనవరి 21వ తేదీన జగనన్న గోరుముద్ద పథకాన్ని ప్రారంభించింది. దీని ప్రకారం సోమవారం మధ్యాహ్నం అన్నం, గుడ్డు, శనగపిండితో చేసిన వంటకాన్ని వడ్డిస్తారు. మంగళవారం పులిహోర్, టమాటో పప్పు, గుడ్డు, బుధవారం వెజిటబుల్ రైస్, బంగాళదుంప కుర్మా, గుడ్డు, చిక్కు, గురువారం పోలెంట, టమాటోసాస్, గుడ్డు, శుక్రవారం అన్నం, ఆకు కూర, కోడిగుడ్డు, చిక్కు, శనివారం అన్నం, సాంబారు, పాయసం లేదంటే స్వీట్ పొంగల్ వడ్డిస్తారు.

Also Read: Telangana Cabinet: 31న తెలంగాణ కేబినెట్ భేటీ.. కీలక అంశాలపై చర్చ


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

Related News

Latest News

  • సౌతాఫ్రికాను చిత్తు చేసి టీ20 సిరీస్‌ను కైవ‌సం చేసుకున్న భార‌త్‌!

  • అభిషేక్ శర్మ రికార్డు బద్దలు కొట్టిన పాండ్యా!

  • జ‌గ‌న్‌కు మంత్రి స‌వాల్‌.. పీపీపీ మోడల్ అక్రమమైతే జైలుకు పంపాల‌ని!

  • టీ20 ప్రపంచకప్ 2026.. శ్రీలంక‌కు కొత్త కెప్టెన్‌!

  • ప్యారడైజ్ మూవీ నుంచి అదిరిపోయే అప్డేట్‌.. బిర్యానీ పాత్ర‌లో సంపూర్ణేష్ బాబు!

Trending News

    • 10 గ్రాముల బంగారం ధర రూ. 40 ల‌క్ష‌లా?!

    • ఆ కార్యక్రమంలో అవినీతి.. ప్రధాని మోదీపై జగన్ ఆరోపణలు!

    • అధిక ఐక్యూ ఉన్న వ్యక్తుల 5 ముఖ్యమైన అలవాట్లు ఇవే!

    • ఆర్‌బీఐ అన్‌లిమిటెడ్ నోట్లను ముద్రిస్తే ఏమ‌వుతుందో తెలుసా?

    • KPHB లులు మాల్‌లో నిధి అగర్వాల్‌కు చేదు అనుభవం

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd