HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >World Water Day On March 22nd Cm Chandrababu Tweets Asking People To Turn Off Lights

Earth Hour 2025 : గంటసేపు లైట్లు ఆపేయండి.. చంద్రబాబు ట్వీట్.. కారణమిదీ

వీటిని పొదుపుగా వాడుకుంటేనే స్థిరమైన భవిష్యత్తుకు మార్గం సుగమం అవుతుంది’’ అని సీఎం చంద్రబాబు(Earth Hour 2025) పేర్కొన్నారు.

  • Author : Pasha Date : 22-03-2025 - 1:15 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
World Water Day 2025 March 22 Cm Chandrababu Ap Cm

Earth Hour 2025 : ఈరోజు(శనివారం) రాత్రి 8:30 గంటల నుంచి 9:30 గంటల వరకు విద్యుత్ వాడకం ఆపేయాలని ప్రజలకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. ఆ టైంలో ఇళ్లు, ఆఫీసులు, వ్యాపార సంస్థలు సహా తదితర చోట్ల లైట్లు, విద్యుత్‌ ఉపకరణాలను ఆఫ్‌ చేయాలని ఆయన కోరారు. ఇంతకీ ఎందుకు అనుకుంటున్నారా ? ఈ రోజు (మార్చి 22) వరల్డ్ ఎర్త్ అవర్. అందుకే పర్యావరణ హితం కోసం ఆ గంట వ్యవధి పాటు విద్యుత్ వినియోగాన్ని ఆపాలని ప్రజానీకానికి చంద్రబాబు సూచించారు. దీంతోపాటు వరల్డ్ ఎర్త్ అవర్ కూడా ఇవాళే. ఈ రెండు అరుదైన దినోత్సవాలు ఒకేరోజు రావడంపై ఏపీ సీఎం హర్షం వ్యక్తం చేశారు. ఉమ్మడి సామాజిక ప్రయోజనాలు, పర్యావరణ హితం కోసం ప్రపంచ ప్రజలను ఇలాంటి దినోత్సవాలు ఏకం చేస్తున్నాయన్నారు. ఎర్త్ అవర్ వేడుకల్లో ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది పాల్గొంటారని సీఎం పేర్కొన్నారు. ‘‘అన్ని జీవరాశులకు భూమే ఏకైక ఇల్లు. దీన్ని రక్షించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత’’ అని చంద్రబాబు పేర్కొన్నారు.

Also Read :Pak Cricketer: బ్యాట్‌ల‌కు డ‌బ్బు చెల్లించ‌కుండా అమెరికా నుంచి పారిపోయిన పాక్ క్రికెటర్!

స్వర్ణ ఆంధ్ర-2047 మార్గదర్శక సూత్రాల్లోనూ..

‘‘మానవ జీవితంలో నీరు, విద్యుత్ అనేవి ముఖ్యమైన మూల స్తంభాలు. వీటి ప్రాముఖ్యతను గుర్తించబట్టే నీటి పొదుపు, ఇంధన వ్యయం తగ్గింపు వంటి అంశాలను స్వర్ణ ఆంధ్ర-2047 మార్గదర్శక సూత్రాల్లో పొందుపరిచాం. వీటిని పొదుపుగా వాడుకుంటేనే స్థిరమైన భవిష్యత్తుకు మార్గం సుగమం అవుతుంది’’ అని సీఎం చంద్రబాబు(Earth Hour 2025) పేర్కొన్నారు. ‘‘చిన్నచిన్న పొదుపు చర్యలే రేపటి పెద్దపెద్ద మార్పులకు దారితీస్తాయి. అంతా కలిసి పని చేస్తే ప్రభావవంతమైన మార్పు వస్తుంది. ప్రతి ఒక్కరూ నీరు, విద్యుత్ పొదుపు విషయంలో వ్యక్తిగతంగా పొదుపునకు ప్రాధాన్యత ఇవ్వాలి’’ అని ఆయన కోరారు.

Also Read :Bird flu : మళ్లీ విజృంభించిన బర్డ్ ఫ్లూ..

190కిపైగా దేశాల్లో ఎర్త్ అవర్.. లక్ష్యం ఇదే

ఈరోజు రాత్రి(మార్చి 22) ప్రపంచం ఎర్త్ అవర్ జరగబోతోంది.  “స్విచ్ ఆఫ్ అండ్ సెక్యూర్ వాటర్ ఫర్ ఆల్” అనేది ఈ సంవత్సరం ఎర్త్ అవర్ నినాదం. 190కిపైగా దేశాలలో ఎర్త్ అవర్ ను పాటించనున్నారు. ఎర్త్ అవర్‌ను 2007 సంవత్సరం నుంచి ప్రపంచవ్యాప్తంగా నిర్వహిస్తున్నారు. అత్యంత కీలకమైన ఇంధన వనరులను భవిష్యత్తు తరాల కోసం భద్రపర్చాలనేది ఎర్త్ అవర్ ఉద్యమం లక్ష్యం.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • 2025 March 22
  • AP CM
  • CM Chandrababu
  • Earth Hour
  • Earth Hour 2025
  • World Water Day

Related News

Ap Sanjeevani Scheme

త్వరలో రాష్ట్రవ్యాప్తంగా ‘సంజీవని’ – సీఎం చంద్రబాబు

రాష్ట్రంలోని ప్రతి ఒక్కరి ఆరోగ్య వివరాలను డిజిటలైజ్ చేసి, వారి ఆరోగ్య స్థితిగతులను నిరంతరం పర్యవేక్షించేలా రూపొందించిన 'సంజీవని' ప్రాజెక్టును త్వరలో రాష్ట్రవ్యాప్తంగా విస్తరించాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు

  • Cm Chandrababu & Minister N

    మహారాష్ట్రకు చంద్రబాబు, లోకేశ్

  • CM Chandrababu participated in the parliamentary committees workshop

    పార్టీ కంటే ఏదీ ముఖ్యం కాదు.. నిర్లక్ష్యం వహిస్తే వేటు తప్పదు : చంద్రబాబు వార్నింగ్

  • India Republic Day

    రాజధాని అమరావతిలో తొలిసారి ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు

Latest News

  • భారత్- న్యూజిలాండ్ 5వ టీ20.. వాతావ‌ర‌ణం ఎలా ఉంటుందంటే?!

  • పీఎం కిసాన్ ప‌థ‌కం 22వ వాయిదా విడుదల ఎప్పుడంటే?!

  • భార‌త్‌- పాక్ మ్యాచ్‌పై శ్రీలంక ప్రత్యేక దృష్టి!

  • ఇప్పుడు ఎన్నికలు జరిగితే దేశంలో ఎవరి ప్రభుత్వం ఏర్పడుతుందో తెలుసా?

  • నంది నగర్ నివాసంలోనే కేసీఆర్ విచారణ!

Trending News

    • ఆర్థిక సర్వేను ప్ర‌వేశ పెట్టిన కేంద్ర ఆర్థిక మంత్రి.. జీడీపీ అంచ‌నా ఎంతంటే?!

    • బంగారం పై నిర్మలా సీతారామన్ కీలక ప్రకటన..ఏకంగా రూ. 12 లక్షల కోట్లు..!

    • రిటైర్మెంట్‌పై యువరాజ్ సింగ్ సంచలన వ్యాఖ్య‌లు!

    • జాతీయ రహదారులపై నిర్మలా సీతారామన్ సంచలనం

    • యూపీఐ ద్వారా డబ్బు కట్ అయి, పేమెంట్ ఫెయిల్ అయితే ఏం జరుగుతుంది?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd