Whats Today : వరల్డ్ కప్లో రెండు కీలక మ్యాచ్లు.. విశాఖకు ఉప రాష్ట్రపతి రాక
Whats Today : ఐసీసీ క్రికెట్ ప్రపంచకప్లో భాగంగా ఇవాళ ధర్మశాల వేదికగా న్యూజిలాండ్, ఆస్ట్రేలియా తలపడనున్నాయి.
- By Pasha Published Date - 07:45 AM, Sat - 28 October 23

Whats Today : ఐసీసీ క్రికెట్ ప్రపంచకప్లో భాగంగా ఇవాళ ధర్మశాల వేదికగా న్యూజిలాండ్, ఆస్ట్రేలియా తలపడనున్నాయి. ఉదయం 10.30కి మ్యాచ్ ప్రారంభం కానుంది. వరుసగా మూడు మ్యాచ్లలో గెలిచిన ఆస్ట్రేలియా ఈసారి కూడా విజయంపై కన్నేసింది. న్యూజిలాండ్ కూడా ఐదు మ్యాచ్లలో నాలుగు గెలిచి జోరుమీదుంది. ఈ మ్యాచ్లోనూ గెలిచి సెమీస్కు చేరువ కావాలనే పట్టుదలతో ఉంది.
- ఐసీసీ క్రికెట్ ప్రపంచకప్లో భాగంగా ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు కోల్కతాలోని ఈడెన్ గార్డెన్ వేదికగా నెదర్లాండ్స్ను బంగ్లాదేశ్ ఢీకొంటుంది. ఇప్పటివరకు బంగ్లాదేశ్, నెదర్లాండ్స్లు ఒక్కో విజయాన్ని మాత్రమే పొందాయి. ఈ మ్యాచ్లో గెలిచి కాస్తయిన ఓదార్పు దక్కించుకోవాలని భావిస్తున్నాయి.
- చంద్రగ్రహణం కారణంగా తిరుమలలో శ్రీవారి ఆలయాన్ని ఇవాళ రాత్రి 7 గంటల నుంచి రేపు ఉదయం 3:15 గంటల వరకు 8 గంటల పాటు మూసివేస్తారు. దీంతో సహస్ర దీపాలంకరణ సేవ, వయోవృద్ధులు, వికలాంగుల ప్రత్యేక దర్శనాలను టీటీడీ రద్దు చేసింది.
We’re now on WhatsApp. Click to Join.
- ఇవాళ ఆంధ్రప్రదేశ్లోని విశాఖకు ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్కర్ రానున్నారు. ఆంధ్రా మెడికల్ కాలేజ్ శతాబ్ది ఉత్సవంలో ముఖ్య అతిథిగా ఆయన పాల్గొంటారు.
- ఇవాళ ఆంధ్రప్రదేశ్లోని భీమిలి నియోజకవర్గంలో వైఎస్సార్ సీపీ సామాజిక సాధికార బస్సు యాత్ర ఉంటుంది. బస్సుయాత్రలో రీజనల్ కో ఆర్డినేటర్ వైవీ సుబ్బా రెడ్డి, బొత్స సత్యనారాయణ, మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొంటారు.
- ఇవాళ ఆదిలాబాద్ జిల్లాలో తెలంగాణ రాష్ట్ర మంత్రి హరీష్రావు పర్యటిస్తారు. ఖానాపూర్, ఆదిలాబాద్ నియోజక వర్గాల్లో ప్రచార సభల్లో ఆయన పాల్గొంటారు. ఉదయం ఉట్నూర్ లో, మధ్యాహ్నం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో నిర్వహించనున్న సభల్లో(Whats Today) ప్రసంగిస్తారు.