Vizag : రైల్వే భూమి విషయంలో కేంద్ర రైల్వే మంత్రి అబద్దం చెప్పాడు – విశాఖ కలెక్టర్
- By Sudheer Published Date - 03:56 PM, Fri - 2 February 24
కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) గురువారం మధ్యంతర బడ్జెట్ (Interim Budget)ను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఈ బడ్జెట్లో పలు కీలక విషయాలను వెల్లడించడం తో పాటు పలు కేటాయింపులు చేసారు. వీటిలో తెలుగు రాష్ట్రాలకు (Telugu states) సంబదించిన రైల్వే బడ్జెట్ (Railway Budget 2024) ప్రకటించారు.
కాగా కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విన్ వైష్ణవ్ (Ashwini Vaishnaw) మాట్లాడుతూ.. విశాఖ రైల్వే జోన్ కోసం (Vizag Railway Zone) 53 ఎకరాల భూమిని ఏపీ ప్రభుత్వాన్ని అడిగితే ఇవ్వలేదని .. రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు భూమి ఇస్తే అప్పుడు పనులు మొదలు పెట్టడానికి సిద్ధంగా ఉన్నామని, జోన్ ఏర్పాటు కోసం డీపీఆర్ సిద్ధం అయ్యిందన్నారు. ఈ వ్యాఖ్యలపై విశాఖ కలెక్టర్ స్పందించారు. విశాఖకు రైల్వే జోన్ కు ఇవ్వాల్సిన స్థలంపై గత డిసెంబర్ లో చీఫ్ సెక్రటరీ రివ్యూ నిర్వహించారని తెలిపారు. అంతకు ముందు ఉన్న వివాదాలను తొలగించి ల్యాండ్ అప్పగించేందుకు సిద్ధంగా ఉన్నామని కలెక్టర్ తెలిపారు. ల్యాండ్ తీసుకోవడానికి అధికారిని పంపాలని రైల్వేని కూడా కోరామన్నారు. అయితే వారే రాలేదన్నారు. ఎవరైనా వస్తారన్న సమాచారం ఉందని చెప్పుకొచ్చారు.
We’re now on WhatsApp. Click to Join.
అలాగే దీనిపై టీడీపీ , వైసీపీ సోషల్ మీడియా లో వార్ మొదలుపెట్టారు. సిగ్గు పడాలి జగన్మోహన్ రెడ్డి గారు…కబ్జాల గుప్పిట్లో విశాఖ భూమాతను బందీ చేసి రైల్వే జోన్ కోసం 53 ఎకరాల భూమిని ఇవ్వలేక పోయారు….? అంటూ గంటా ప్రశ్నకు వైసీపీ కౌంటర్ ఇచ్చింది. రైల్వే జోన్ ఏర్పాటుకు సంబంధించి విశాఖలో 52 ఎకరాలు ఇచ్చేలా జీవీఎంసీ, రైల్వే మధ్య 2013లో ఒప్పందం కుదిరిందని వైసీపీ తెలిపింది. ఆతరువాత 2014 నుంచి 2019 వరకూ టీడీపీ అధికారంలో ఉంది. మరి అప్పుడు మీ టీడీపీ సర్కారు ఈ భూములను ఎందుకు రైల్వేకు అప్పగించలేదని సోషల్ మీడియాలో ప్రశ్నించింది. 2019లో వైయస్సార్ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఆ భూమికి సంబంధించిన చిక్కుముళ్లు విప్పేసి 2024 జనవరి 2న ఆ స్థలాన్ని రైల్వేకు అప్పగించిందని తెలిపింది.
సిగ్గు పడాలి జగన్మోహన్ రెడ్డి గారు…
కబ్జాల గుప్పిట్లో విశాఖ భూమాతను బందీ చేసి రైల్వే జోన్ కోసం 53 ఎకరాల భూమిని ఇవ్వలేక పోయారు….?రాష్ట్ర చరిత్రలోనే కనీ వినీ ఎరుగని రీతిలో విశాఖలో భూదోపిడీకి పాల్పడి, లక్షల కోట్ల విలువైన వేల ఎకరాల భూములను మీరు, మీ సామంత రాజులు దోచుకున్నారు….…
— Ganta Srinivasa Rao (@Ganta_Srinivasa) February 1, 2024
రైల్వే జోన్ ఏర్పాటుకు సంబంధించి విశాఖలో 52 ఎకరాలు ఇచ్చేలా జీవీఎంసీ, రైల్వే మధ్య 2013లో ఒప్పందం కుదిరింది. ఆతరువాత 2014 నుంచి 2019 వరకూ టీడీపీ అధికారంలో ఉంది. మరి అప్పుడు మీ టీడీపీ సర్కారు ఈ భూములను ఎందుకు రైల్వేకు అప్పగించలేదు? అప్పుడు ఈ ఎల్లో మీడియా ఎందుకు ప్రశ్నించలేదు. మళ్ళీ… https://t.co/jQvqTEXeLi pic.twitter.com/kTdY9zb6DD
— YSR Congress Party (@YSRCParty) February 2, 2024
Read Also : Autonomous Robot : నేను పెట్టుబడి పెడతా..! మీరు సిద్ధమా..? అంటూ ఆనంద్ మహీంద్ర ట్వీట్
Related News
Amrit Bharat Trains : రాబోయే రోజుల్లో 1000 అమృత్ భారత్ రైళ్లు
రాబోయే సంవత్సరాల్లో భారతదేశం కనీసం 1,000 కొత్త తరం అమృత్ భారత్ రైళ్లను తయారు చేస్తుందని , అదే సమయంలో గంటకు 250 కి.మీ వేగంతో నడిచే రైళ్లను తయారు చేయడానికి కూడా పనులు జరుగుతున్నాయని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ శనివారం తెలిపారు. PTI-వీడియోలకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో, వందే భారత్ రైళ్ల ఎగుమతిపై రైల్వే ఇప్పటికే పని ప్రారంభించిందని, వచ్చే ఐదేళ్లలో మొదటి ఎగుమతి జరుగుతుందని ఆయన