IT Capital : ఐటీ క్యాపిటల్ గా వైజాగ్ .. పెట్టుబడుల వెల్లువ
IT Capital : ఈ పెట్టుబడులు వేలాది కొత్త ఉద్యోగావకాశాలను సృష్టించబోతున్నాయి. ముఖ్యంగా ఇంజనీరింగ్, ఐటీ, నెట్వర్కింగ్, డేటా సెక్యూరిటీ రంగాల్లో యువతకు విస్తృత అవకాశాలు లభించనున్నాయి
- By Sudheer Published Date - 08:04 PM, Fri - 10 October 25

వైజాగ్ ఐటీ క్యాపిటల్గా ఎదుగుతోంది. కూటమి పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత విశాఖపట్నం మీద పెట్టుబడుల వర్షం కురుస్తోంది. ప్రముఖ టెక్ దిగ్గజ సంస్థలు ఈ తూర్పు తీర నగరాన్ని తమ కొత్త డిజిటల్ కేంద్రంగా ఎంచుకోవడం విశేషం. ముఖ్యంగా గూగుల్ అనుబంధ సంస్థ “Raiden Infotech” రూ.87,520 కోట్ల భారీ పెట్టుబడిని ప్రకటించడం దేశంలోనే అత్యధిక విదేశీ ప్రత్యక్ష పెట్టుబడిగా (FDI) నిలిచింది. ఈ ప్రాజెక్ట్ ద్వారా అత్యాధునిక డేటా సెంటర్లు, క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, మరియు సాఫ్ట్వేర్ ఇన్నోవేషన్ హబ్లు ఏర్పాటుకానున్నాయి. ఇది ఆంధ్రప్రదేశ్ డిజిటల్ ఆర్థికవ్యవస్థను మరోస్థాయికి తీసుకెళ్లనుంది.
H-1B వీసాపై మరిన్ని కఠిన నిబంధనలకు డొనాల్డ్ ట్రంప్ ప్లాన్.!
ఈ ప్రాజెక్ట్తో పాటు టీసీఎస్, సిఫీ టెక్నాలజీస్ వంటి భారతీయ ఐటీ దిగ్గజాలు కూడా వైజాగ్లో తమ డేటా సెంటర్లను ఏర్పాటు చేయడానికి సిద్ధమవుతున్నాయి. అదనంగా అదానీ గ్రూప్ రూ.21,844 కోట్లతో టెక్ పార్క్ నిర్మాణానికి శ్రీకారం చుట్టగా, మెటా కంపెనీ (ఫేస్బుక్ సంస్థ) అండర్సీ కేబుల్ ప్రాజెక్ట్లను ప్రారంభించనుంది. ఈ పెట్టుబడులతో వైజాగ్లో డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ విస్తరించడమే కాకుండా, ఈశాన్య భారత తీర ప్రాంతం టెక్ హబ్గా మారబోతోందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
ఈ పెట్టుబడులు వేలాది కొత్త ఉద్యోగావకాశాలను సృష్టించబోతున్నాయి. ముఖ్యంగా ఇంజనీరింగ్, ఐటీ, నెట్వర్కింగ్, డేటా సెక్యూరిటీ రంగాల్లో యువతకు విస్తృత అవకాశాలు లభించనున్నాయి. ప్రభుత్వం కూడా వైజాగ్ను ఐటీ క్యాపిటల్గా తీర్చిదిద్దేందుకు ప్రత్యేక ప్రోత్సాహక విధానాలు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ సదుపాయాలు అందిస్తోంది. ఈ అభివృద్ధి వైజాగ్ను కేవలం పర్యాటక నగరంగా కాకుండా, దేశానికి కొత్త డిజిటల్ ఇంజిన్గా మారుస్తుందనే నమ్మకం వ్యక్తమవుతోంది.