Vizag Airport Suspended : విశాఖ విమానాశ్రయం మూసివేతపై పురంధరేశ్వరి ఫైట్
Vizag Airport Suspended :విశాఖ ఎయిర్ పోర్టును రాత్రివేళ మూసివేత సమయాన్ని తగ్గించాలని కోరుతూ కేంద్రానికి పురంధరేశ్వరి లేఖ
- By CS Rao Published Date - 03:23 PM, Sat - 5 August 23
Vizag Airport Suspended : ప్రజా సమస్యలపై రాజకీయ పార్టీలు పోరాడాలి. రాజకీయ ప్రత్యర్థులుగా కాకుండా శత్రువులుగా మారిన ప్రస్తుత తరుణంలో ప్రజా సమస్యలపై గళం ఎత్తుతోన్న లీడర్ గా పురంధరేశ్వరి తెరమీదకు వస్తున్నారు. ఆమె బీజేపీ ఏపీ అధ్యక్షురాలిగా ఇటీవల బాధ్యతలు స్వీకరించారు. ఆ రోజు నుంచి కేంద్రం నుంచి రాష్ట్రానికి ఎన్ని నిధులు వచ్చాయి? వాటిని ఎక్కడ ఖర్చు పెట్టారు? రాష్ట్రంలోని అవినీతి, అక్రమాల పాలన మీద వాయిస్ పెంచారు. కేంద్రం ఇచ్చిన నిధులతో జగన్మోహన్ రెడ్డి ప్రచారం చేసుకుంటున్నారు. ప్రతి పథకంలోనూ కేంద్రం వాటా ఉంది. కానీ, ఇప్పటి వరకు ఆ తరహా చర్చ పెద్దగా జరగలేదు. ఇప్పుడు పురంధరేశ్వరి రూపంలో ఆ దిశగా చర్చ మళ్లుతోంది. అంతేకాదు, తాజాగా విశాఖ ఎయిర్ పోర్టును రాత్రివేళ మూసివేత సమయాన్ని తగ్గించాలని కోరుతూ కేంద్రానికి లేఖ రాయడం గమనార్హం.
విశాఖ ఎయిర్ పోర్టు మూసివేతపై పురంధరేశ్వరి లేఖ(Vizag Airport Suspended)
తాజాగా తీసుకున్న నిర్ణయం ప్రకారం ప్రతి రోజూ 11 గంటల పాటు విశాఖ విమానాశ్రయాన్ని (Vizag Airport Suspended)మూసివేస్తున్నారు. ఫలితంగా వాణిజ్య, వ్యాపార, పర్యటక రంగాలపై ప్రభావం పడుతోంది. కానీ, రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు దాన్ని ఒక సమస్యగా పరిగణించలేదు. బీజేపీ ఏపీ అధ్యక్షురాలి హోదాలో పురంధరేశ్వరి విమానాశ్రయం రాత్రివేళ మూసివేతపై స్పందించారు. నేరుగా కేంద్రానికి లేఖ రాస్తూ మూపివేత సమయాన్ని తగ్గించాలని విజ్ఞప్తి చేశారు. ప్రాంతీయ పార్టీలుగా ఉన్న టీడీపీ, వైసీపీ, జనసేన మాత్రం పరస్పరం రాజకీయ ఆరోపణలకు పరిమితం అవుతున్నాయి. కారణంగా జగన్మోహన్ రెడ్డి అరాచకపాలన అంటూ చంద్రబాబు, పవన్ చెబుతున్నారు.
12 దేశీయ విమానాలు ఒక అంతర్జాతీయ విమానంపై ప్రభావం
విశాఖ విమానాశ్రయం రన్వే పునరుద్ధరణ కోసం ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం అంతర్జాతీయ విమానాశ్రయం (Vizag Airport Suspended) నుంచి రాత్రి విమానాలు నాలుగు నెలలకు పైగా నిలిపివేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ ఏడాది నవంబర్ 15 నుండి మార్చి 2024 చివరి వరకు రాత్రి విమానాలు నిలిపివేస్తూ విమానయానశాఖ నిర్ణయించింది. రాత్రి 9 నుండి ఉదయం 8 గంటల వరకు విమానాలు నడవకుండా ఉత్తర్వులు ఇచ్చారు. దాని ప్రకారం ప్రతిరోజూ 11 గంటలపాటు విమానాశ్రయాన్ని మూసివేయడం వల్ల 12 దేశీయ విమానాలు ఒక అంతర్జాతీయ విమానంపై ప్రభావం చూపుతుంది.
Also Read : Visakhapatnam : అమెరికా తరహాలో వైజాగ్ లో `బీచ్ ఐటీ`
విమానాశ్రయాన్ని నియంత్రించే నౌకాదళం, పనిని సులభతరం చేయడానికి రాత్రి విమానాలను నిలిపివేయాలనే నిర్ణయం గురించి విమానయాన సంస్థలకు తెలియజేసింది. విమానాశ్రయం ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ATC) నేవీ నియంత్రణలో ఉంది, అయితే ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (AAI) పౌర ఎన్క్లేవ్ను నిర్వహిస్తుంది. సాధారణంగా, విమానాశ్రయ రన్వేల పునరుద్ధరణ దాదాపు 10 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. విశాఖపట్నం ఎయిర్పోర్ట్ డైరెక్టర్ ఎస్ రాజా రెడ్డి చెబుతోన్న ప్రకారం రన్వే చివరిసారిగా 2009లో పునరుద్ధరించబడింది.విశాఖపట్నం విమానాశ్రయంలో (Vizag Airport Suspended)నాలుగు నెలల పాటు రాత్రిపూట విమాన సర్వీసులను నిలిపివేయనున్నారు. నాలుగు నెలల పాటు రాత్రిపూట విమాన సర్వీసులను నిలిపివేయడం వల్ల శీతాకాలపు పర్యాటక సీజన్లో టూర్ అండ్ ట్రావెల్ ఆపరేటర్ల వ్యాపారాన్ని కూడా ప్రభావితం చేసే అవకాశం ఉంది.
Also Read : Vizag Steel : విశాఖలో అయోధ్య, `వీవీ` క్రౌడ్ ఫండ్ కథ
ప్రయాణికులకు అసౌకర్యాన్ని తగ్గించేందుకు ఎయిర్పోర్ట్ డైరెక్టర్ మూసివేసే సమయాన్ని రాత్రి 10:30 నుండి ఉదయం 7 గంటల వరకు తగ్గించాలని కోరారు. నేవీ హెడ్క్వార్టర్స్తో ఏఏఐ సమస్యను పరిష్కరిస్తుంది. నాలుగు నెలల పాటు రాత్రిపూట విమాన సర్వీసులను నిలిపివేయడం వల్ల శీతాకాలపు పర్యాటక సీజన్లో టూర్ అండ్ ట్రావెల్ ఆపరేటర్ల వ్యాపారాన్ని కూడా ప్రభావితం చేసే అవకాశం ఉంది. దేశంలోని వివిధ ప్రాంతాల నుండి పర్యాటకులు దసరా తర్వాత మరియు జనవరి చివరి వరకు ఓడరేవు నగరం మరియు సమీపంలోని అరకు మరియు లంబసింగి పర్యాటక ప్రాంతాలను సందర్శిస్తారు.రన్ వే రాత్రిపూట మూసివేత కాలవ్యవధి అధికంగా ఉందని పేర్కొన్నారు. దాన్ని తగ్గించడం ద్వారా ప్రయాణీకుల అసౌకర్యాన్ని తొలగించాలని లేఖ రాశారు పురంధరేశ్వరి.
Related News
Telugodu : చంద్రబాబు బయోపిక్.. ఇది ఎప్పుడు చేసారు.. స్కిల్ డెవలప్మెంట్ అరెస్ట్తో..
ఏపీ ఎన్నికల ప్రచారాలకు డిజిటల్ మీడియాని ఏపీ పొలిటిషన్స్ బాగా ఉపయోగించుకుంటున్నారు. ఈక్రమంలోనే కమర్షియల్ యాడ్స్ తో పాటు బయోపిక్స్..