TDP : బెజవాడ టీడీపీలో ఆధిపత్య పోరు.. దళిత శంఖారావం సభలో మరోసారి బయటపడ్డ విభేదాలు
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిని అక్రమ కేసుల్లో ఇబ్బందుల్లో ఉంటే బెజవాడ టీడీపీ నేతలు మాత్రం తమ ఆధిపత్య
- By Prasad Published Date - 07:00 AM, Fri - 1 December 23
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిని అక్రమ కేసుల్లో ఇబ్బందుల్లో ఉంటే బెజవాడ టీడీపీ నేతలు మాత్రం తమ ఆధిపత్య పోరుకోసం కోట్లాడుకుంటున్నారు. 50 రోజులుపైగా చంద్రబాబు జైల్లో ఉంటే కనిపించని బెజవాడ టీడీపీ నేతలు బాబు బయటకు రాగనే జిల్లాలో మళ్లీ హడావిడి చేస్తున్నారు. క్లిష్ట పరిస్థితుల్లో పార్టీకి అండగా ఉండాల్సిన నేతలే కావాలని విభేధాలను తెరమీదకు తీసుకురావడం క్యాడర్లో ఆందోళన కలిగిస్తుంది. ఎన్టీఆర్ జిల్లాలో కేశినేని శివనాథ్ అలియాస్ చిన్ని పార్టీలో తనకు నచ్చినట్లు కార్యక్రమాలు చేసుకుంటూ పోవడంతో గందరగోళ పరిస్థితి నెలకొంది. విజయవాడ ఎంపీగా వచ్చే ఎన్నికల్లో తానే పోటీ చేస్తున్నానంటూ ప్రచారం చేసుకుంటూ పార్లమెంట్ పరిధిలో తిరుగుతున్నారు. అయితే ఇక్కడ సిట్టింగ్ ఎంపీ తన సోదరుడు కేశినేని నాని ఉండగానే చిన్ని పార్టీ కార్యక్రమాలు చేయడం అది కూడా ప్రోటోకాల్కి విరుద్దంగా చేయడంతో ఎంపీ కేశినేని వర్గం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తుంది. పార్టీ అధిష్టానం చిన్నికి ఎలాంటి పదవి కూడా ఇవ్వకపోయిన తాను మాత్రం జిల్లా ఇంఛార్జ్లా ఫీల్ అవుతూ నియోజకవర్గాల్లో తిరుగుతున్నారు. అయితే కేశినేని చిన్ని చంద్రబాబు జైలుకు వెళ్లాక మాత్రం నియోకవర్గంలో ఎక్కడా కనిపించలేదని క్యాడర్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. బాబు బయటకు రాకపోతే తాను ఖర్చు చేసిన డబ్బులు కూడా వృథా అయిపోతాయనే భావనలోనే ఆయన ఉన్నారని క్యాడర్లో చర్చ జరిగింది. చంద్రబాబుకు బెయిల్ వచ్చిన మరుసటి రోజే మళ్లీ కేశినేని చిన్ని యాక్టీవ్ అయ్యారు. అప్పటి దాకా నియోజకవర్గంలో గుర్తుకు రాని ప్రజలు బాబు బయటికి వచ్చాకే ఎందుకు గుర్తుకు వచ్చారని కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారు.
We’re now on WhatsApp. Click to Join.
ఇటు ఎంపీ కేశినేని నాని మాత్రం తన ఎంపీ నిధులతో గ్రామాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. చంద్రబాబు అరెస్ట్ సమయంలో ఢిల్లీలోనే ఉంటూ నారా లోకేష్తో పాటు లీగల్ వ్యవహారాలన్నీ చూశారు. ఇటు రాజమండ్రి సెంట్రల్ జైలు వద్దకు లోకేష్తో పాటు వెళ్లారు. బాబు జైల్లో ఉన్న అన్ని రోజులు ఢిల్లీ, రాజమండ్రిలోనే కేశినేని నాని ఉన్నారు. ఓ వైపు పార్లమెంట్ సమావేశాల్లో పాల్గొంటూనే బాబు బెయిల్ వ్యవహారాలను కేశినేని నాని చూశారు. గత రెండు నెలల పాటు విభేదాలు సమసిపోయాయని క్యాడర్ భావించినప్పటికి తాజాగా కేశినేని చిన్ని మళ్లీ విభేదాలు సృష్టిస్తున్నారు. నిన్న విజయవాడలో జరిగిన దళిత శంఖారావం సభకు కేశినేని చిన్నిని ముఖ్య అతిధిగా ప్రజెంట్ చేస్తూ అక్కడ ఎర్పాటు చేసిన ఫ్లెక్సీలో పెద్ద ఫోటో వేశారు. అయితే ఏ పదవి లేని కేశినేని చిన్ని ఫోటో పెద్దది వేశారని.. అసలు దళిత నాయకుల ఫోటోలు లేవని దళిత నేతలు ప్రశ్నించారు. మాజీ మంత్రి జవహర్, నక్కా ఆనంద్బాబుతో పాటు చాలా మంది దళిత నేతలు ఉన్నప్పటికీ.. కేశినేని చిన్నిని హైలెట్ చేస్తూ కార్యక్రమం నిర్వహించడంతో కొంతమంది దళిత నేతలు ఆందోళన చేశారు. ఇది దళిత శంఖారావమా.. లేదా కేశినేని చిన్ని భజన కార్యక్రమమా అంటూ ప్రశ్నించారు. టీడీపీ కష్టకాలంలో ఉన్నా బెజవాడ టీడీపీ నేతల మాత్రం తమ స్వార్థం కోసం పని చేస్తున్నారని క్యాడర్లో వినిపిస్తుంది. పార్టీకి వ్యతిరేకంగా పని చేసే వారిపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతోనే బెజవాడ టీడీపీలో ఈ పరిస్థితి నెలకొందని నేతలు అంటున్నారు.
Also Read: Andhra Pradesh : ప్రత్తిపాడులో వైసీపీకి ఎదురుదెబ్బ.. టీడీపీలో చేరిన వైసీపీ ఎంపీపీలు
Related News
Rise Survey on AP : ఏపీలో కూటమిదే విజయం
కూటమి పార్టీలు 108 నుంచి 120 వరకు స్థానాల్లో గెలువనున్నాయని , అధికార వైసీపీ పార్టీ 41 నుంచి 54 స్థానాల లోపే పరిమితం కానుందని సర్వే సంస్థ వెల్లడించింది