Vijayasai Reddy Illegal Affair : వెంకటేశ్వర స్వామి సాక్షిగా కూడా ఇదే చెపుతా – విజయసాయి
. 'శాంతి కళింగిరిని 2020లో ఏపీ ఎండోమెంట్స్ ఆఫీసర్గా తొలిసారి మీట్ అయినప్పటి నుంచి ఇప్పటివరకు కూతురుగానే భావించాను. ఒక తండ్రిలా ఏ సహాయం కావాలన్నా చేశాను. తనకు కొడుకు పుట్టాడంటే వెళ్లి పలకరించాను.
- By Sudheer Published Date - 02:53 PM, Sat - 20 July 24

గత వారం రోజులుగా మీడియా లో వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి (MP Vijaya Sai )..దేవాదాయశాఖ అసిస్టెంట్ కమిషనర్ కే.శాంతి ( Shanthi ) ల వ్యవహారం హాట్ టాపిక్ గా నడుస్తున్న సంగతి తెలిసిందే. విజయసాయి రెడ్డి వల్ల తన భార్య శాంతి గర్భం దాల్చిందంటూ ఆమె భర్త మదన్ (Madan) సంచలన ఆరోపణలు చేయడం తో అంత వీరి గురించే మాట్లాడుకుంటున్నారు. ఇక అధికార పార్టీ శ్రేణులైతే మీమ్స్ , రీల్స్ చేస్తూ నానా హడావిడి చేస్తూనే ఉన్నారు. ఈ ఆరోపణలను శాంతి తో పాటు విజయసాయి ఇప్పటికే ఖండించినప్పటికీ..మదన్ మాత్రం విజయసాయి ని DNA టెస్ట్ కు రావాలంటూ సవాల్ విసిరారు.
We’re now on WhatsApp. Click to Join.
తాజాగా మరోసారి విజయసాయి ఈ ఇష్యూ ఫై స్పందించారు. తనకు ఏ పరాయి మహిళతోనూ అక్రమ సంబంధాలు లేవని విజయసాయి రెడ్డి తెలిపారు. వెంకటేశ్వర స్వామి సన్నిధిలో కూడా ఇదే మాట చెప్తానని ట్వీట్ చేశారు. ‘శాంతి కళింగిరిని 2020లో ఏపీ ఎండోమెంట్స్ ఆఫీసర్గా తొలిసారి మీట్ అయినప్పటి నుంచి ఇప్పటివరకు కూతురుగానే భావించాను. ఒక తండ్రిలా ఏ సహాయం కావాలన్నా చేశాను. తనకు కొడుకు పుట్టాడంటే వెళ్లి పలకరించాను. మా తాడేపల్లి ఇంటికి తీసుకొస్తే ఆశీర్వదించాను’ అని పేర్కొన్నారు.
అవాస్తవాలు ప్రసారం చేస్తున్న కొన్ని టీవీ ఛానళ్లు, వాటి ముసుగులో చెలామణి అవుతున్న కొన్ని శక్తులకు సంజాయిషీ ఇవ్వాల్సిన అవసరం లేదు. ప్రజాప్రతినిధిగా ప్రజలకు వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉంది. శాంతి కళింగిరిని 2020 సంవత్సరం ఏసీ ఎండోమెంట్స్ ఆఫీసర్ గా వైజాగ్ సీతమ్మధార ఆఫీస్ లో మొట్టమొదటగా…
— Vijayasai Reddy V (@VSReddy_MP) July 20, 2024
Read Also : CM Revanth : వెంకయ్యనాయుడు, జైపాల్రెడ్డిలపై సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు