AP : ఏపీ సీఎం వైఎస్ జగన్ తో అమెరికా కాన్సులేట్ జనరల్ భేటీ..!!
ఏపీ సీఎం వైఎస్ జగన్ తో క్యాంప్ కార్యాలయంలో అమెరికా కాన్సుల్ జనరల్ భేటీ అయ్యారు
- By hashtagu Published Date - 09:04 PM, Wed - 12 October 22
ఏపీ సీఎం వైఎస్ జగన్ తో క్యాంప్ కార్యాలయంలో అమెరికా కాన్సుల్ జనరల్ భేటీ అయ్యారు. బుధవారం తాడేపల్లికి వచ్చిన ఆమె సీఎం క్యాంపు ఆఫీసులో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా వారిమధ్య పలు అంశాలపై చర్చ జరిగింది. కోవిడ్ ను సమర్థవంతంగా ఎదుర్కొన్నాంటూ జగన్ను అభినందించారు. జీడీపీ వృద్ధిలో ఏపీని నెంబర్ వన్ గా నిలబెట్టారని ఆమె కితాబిచ్చారు.
కాగా రాష్ట్రంలో పెట్టుబడులకు సహకారం అందించాలని జెన్నిఫర్ ను ఈ సందర్భంగా సీఎం జగన్ కోరారు. రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అంశాలన్నింటీని ఆమెకు వివరించారు. హైదరాబాద్ కేంద్రంగా పనిచేసే అమెరికా రాయబార కార్యాలయం చీఫ్ గా ఈ మధ్యే జెన్నిఫర్ నియమితులయ్యారు. తెలంగాణ, ఏపీతోపాటు ఒడిశాలకు సంబంధించిన అమెరికా వ్యవహారాలన్నింటినీ ఆమె పర్యవేక్షిస్తున్నారు. ఈ క్రమంలోనే జగన్ తో జెన్నిఫర్ భేటీ అయ్యారు.
Related News
IMD Red Alert : ఉత్తరాదికి రెడ్ అలర్ట్.. తెలంగాణకు రెయిన్ అలర్ట్
ఉత్తర భారతదేశంలో ఎండలు మండిపోతున్నాయి.