HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • >Andhra Pradesh
  • >Ttd Eo Shyamala Rao About Tirupati Stampede Incident

Tirupati Stampede : తొక్కిసలాట ఘటనపై టీటీడీ ఈవో ఏమన్నారంటే..!!

Tirupati Stampede : తొక్కిసలాటలో గాయపడిన భక్తులను తిరుపతి పద్మావతి వైద్య కళాశాలలో టీటీడీ ఈవో పరామర్శించారు

  • By Sudheer Published Date - 12:27 PM, Thu - 9 January 25
  • daily-hunt
Ttd Eo Shyamala Rao About Tirupati Stampede Incident
Ttd Eo Shyamala Rao About Tirupati Stampede Incident

తిరుపతి వైకుంఠ ద్వార దర్శన టోకెన్ల కేంద్రాల్లో బుధవారం చోటుచేసుకున్న తొక్కిసలాట (Stampede ) ఘటనలో ఆరుగురు భక్తులు మృతిచెందడం దురదృష్టకరమని టీటీడీ ఈవో శ్యామలరావు (TTD EO Shyamala Rao) తెలిపారు. తొక్కిసలాటలో గాయపడిన భక్తులను తిరుపతి పద్మావతి వైద్య కళాశాలలో టీటీడీ ఈవో పరామర్శించారు. డీఎస్పీ గేట్లు తీయడం వల్లనే ఈ ఘటన జరిగిందని ప్రాథమిక విచారణలో తేలినట్లు ఆయన చెప్పుకొచ్చారు. క్షతగాత్రుల ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకుని, వారికి అవసరమైన చికిత్స అందించేందుకు వైద్యులతో చర్చించారు.

E Car Race Scam : కేటీఆర్ ఇంటికా..? జైలుకా..? బిఆర్ఎస్ లో టెన్షన్

కొందరికి ప్రాథమిక చికిత్స అనంతరం డిశ్చార్జి చేసినట్లు పేర్కొన్నారు. ఈ ఘటనలో మొత్తం 41 మంది గాయపడ్డారని, అందులో ఇద్దరికి తీవ్ర గాయాలు అయినట్లు ఈవో తెలిపారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారికి ప్రాణాపాయం లేదని, అవసరమైన అన్ని వైద్యసేవలు అందిస్తున్నామని అన్నారు. ఇక తొక్కిసలాట ఘటనపై అధికారులు దర్యాప్తు ప్రారంభించారని , పూర్తి వివరాలు విచారణ పూర్తైన తర్వాత వెల్లడించనున్నట్లు చెప్పారు.

TTD : తిరుమల వైకుంఠద్వార దర్శనం టోకెన్ల జారీ పూర్తి

ఇక తొక్కిసలాట ఘటన లో మృతి చెందిన మృతుల కుటుంబాలకు ఏపీ ప్రభుత్వం నష్టపరిహారం ప్రకటించింది. ఒక్కో కుటుంబానికి రూ.25 లక్షల ఎక్స్‌గ్రేసియా అందించనున్నట్టు ప్రకటించింది. ఈ మేరకు రాష్ర్ట రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ ప్రకటన చేశారు. గురువారం ఉదయం తిరుపతిలోని రుయా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తొక్కిసలాట ఘటన క్షతగాత్రులను ఆయన పరామర్శించారు. అనంతరం నష్టపరిహారాన్ని ప్రకటించారు.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Tirupati stampede incident
  • TTD EO Shyamala Rao

Related News

    Latest News

    • AP : రాష్ట్రంలో యూరియా కొరతపై ‘అన్నదాత పోరు’: వైసీపీ ఆందోళనకు సిద్ధం

    • CM Siddaramaiah : చలానాలపై రాయితీ ప్రకటించిన కర్ణాటక ప్రభుత్వం

    • Green Chillies : ప్రతిరోజూ పచ్చిమిర్చి తినడం ఆరోగ్యానికి మంచిదేనా?..అస‌లు రోజుకు ఎన్ని తిన‌వ‌చ్చు..?

    • Khairatabad ganesh : గంగమ్మ ఒడికి చేరిన శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతి

    • Renault Cars : జీఎస్టీ 2.0 ఎఫెక్ట్.. రెనో కార్లపై భారీ తగ్గింపు

    Trending News

      • Chandra Grahan 2025 : 7న సంపూర్ణ చంద్రగ్రహణం..జ్యోతిష్య ప్రభావంతో ఏ రాశులకు శుభం? ఏ రాశులకు అశుభం?..!

      • Yograj Singh: ధోనితో సహా చాలా మంది ఆటగాళ్లు వెన్నుపోటు పొడిచారు: యువ‌రాజ్ తండ్రి

      • Sara Tendulkar: సచిన్ కుమార్తె సారా టెండూల్కర్‌కు నిజంగానే ఎంగేజ్‌మెంట్ జ‌రిగిందా?

      • IPL Tickets: క్రికెట్ అభిమానులకు తీపి, చేదు వార్త.. ఐపీఎల్‌పై జీఎస్టీ పెంపు, టికెట్లపై తగ్గింపు!

      • New GST: జీఎస్టీలో కీల‌క మార్పులు.. రూ. 48,000 కోట్లు న‌ష్టం?!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd