HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Tirumala Vandebharat Express Bogies Doubled Increase From 8 To 16

TIRUMALA VANDE BHARAT : గుడ్ న్యూస్.. తిరుపతికి వెళ్లే వందేభారత్‌ బోగీలు డబుల్

సికింద్రాబాద్‌-తిరుపతి మధ్య రాకపోకలు సాగించే వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ (TIRUMALA VANDE BHARAT) రైలు కోచ్ ల సంఖ్య 8 నుంచి 16కి పెరగనుంది. ఈ రైలు ప్రయాణ సమయాన్ని కూడా 15 నిమిషాలు తగ్గించారు. దీంతో ప్రయాణికులకు వెయిటింగ్‌ కష్టాలు తప్పనున్నాయి. ఇవన్నీ మే 17 నుంచి అమల్లోకి వస్తాయి.

  • Author : Pasha Date : 15-05-2023 - 8:37 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Vande Bharat Express
Tirumala Vande Bharat

సికింద్రాబాద్‌-తిరుపతి మధ్య రాకపోకలు సాగించే వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ (TIRUMALA VANDE BHARAT) రైలు కోచ్ ల సంఖ్య 8 నుంచి 16కి పెరగనుంది. ఈ రైలు ప్రయాణ సమయాన్ని కూడా 15 నిమిషాలు తగ్గించారు. దీంతో ప్రయాణికులకు వెయిటింగ్‌ కష్టాలు తప్పనున్నాయి. ఇవన్నీ మే 17 నుంచి అమల్లోకి వస్తాయి. వందేభారత్‌లోని ఎగ్జిక్యూటివ్‌ ఛైర్‌కార్‌, ఛైర్‌కార్‌ బోగీలలోని సీట్ల సంఖ్య 530 నుంచి 1,060కి పెరగనుంది. సికింద్రాబాద్‌-తిరుపతి మధ్య నడిచే వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ ప్రస్తుత ప్రయాణ సమయం 8.30 గంటలు కాగా.. ఇకపై 8.15 గంటలు మాత్రమే. ప్రస్తుతం సికింద్రాబాద్‌ నుంచి ఉదయం 6 గంటలకు బయల్దేరుతున్న ఈ రైలు మే 17 నుంచి 6.15కి బయలుదేరుతుంది. తిరుపతి నుంచి సికింద్రాబాద్‌కు రాత్రి 11.30 గంటలకే చేరుతుంది. ఈమేరకు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ట్వీట్ చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ, రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

ALSO READ : Budget 2023: బడ్జెట్ లో వందే భారత్ రైళ్ల కేటాయింపు.. ఎవరికి లాభం?

ప్రయాణికుల అసౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని..

వాస్తవానికి సికింద్రాబాద్‌-తిరుపతి మార్గంలో వందే భారత్‌  (TIRUMALA VANDE BHARAT) ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణికుల సంఖ్య పెరుగుతోంది. అదే సమయంలో తక్కువ సీట్ల కారణంగా చాలా మంది ఈ రైలులో ప్రయాణించలేకపోతున్నారు. ఈ తరుణంలో ప్రయాణికులకు ఎదురవుతున్న అసౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని బోగీల సంఖ్యను పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది. తిరుమల టూర్ ప్లాన్ చేసుకునేవారికి ఈ రైలు చాలా సౌకర్యంగా ఉంటోంది. చాలా మంది తిరుమల వెళ్లి స్వామివారిని దర్శించుకుని మళ్లీ అదే రైల్లో తిరిగి హైదరాబాద్ వచ్చేలా జర్నీ ప్లాన్ చేసుకుంటున్నారు. ఈ సికింద్రాబాద్-తిరుపతి వందేభారత్ రైలు వారంలో ఆరు రోజులు అందుబాటులో ఉంటుంది.. మంగళవారం మాత్రం నడవదు. రైలుకు సంబంధించిన మెయింట్‌నెన్స్ పనుల కోసం మంగళవారం రోజు దాన్ని నడపరు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • 16 bogies
  • bogies
  • DoubleD
  • tirumala
  • TIRUMALA VANDE BHARAT
  • Vandebharat EXPRESS

Related News

Do you know the legend behind the glory of Lord Srivari appearing without weapons?

ఆయుధాలు లేకుండా దర్శనమిచ్చే శ్రీవారి మహిమ వెనుకనున్న పురాణ గాథ తెలుసా?

తిరుమల ఆలయంలోని మూలవిరాట్టుకు ఆయుధాలు కనిపించవు. దీనికి వెనుక ఒక గొప్ప పురాణ గాథ ఉందని ఆగమ శాస్త్రాలు, ఇతిహాసాలు చెబుతున్నాయి. ఈ విశిష్ట సంప్రదాయం భక్తి, త్యాగం, వరప్రసాదానికి నిదర్శనంగా నిలుస్తోంది.

  • Minister Vasamsetti Subhash

    భక్తుల మనోభావాలతో చెలగాటమాడితే సహించేది లేదు: మంత్రి వాసంశెట్టి సుభాష్

  • Janga Krishna Murthy Resigned

    టీటీడీ బోర్డు సభ్యత్వానికి జంగా కృష్ణమూర్తి గుడ్ బై..

  • Liquor Bottle In Ttd

    సీసాలు వాళ్లవే…. స్క్రిప్ట్ వాళ్లదే….. తిరుమలలో వైసీపీ మద్యం డ్రామా!

Latest News

  • జనసేనతో పొత్తు అవసరం లేదు – బీజేపీ స్పష్టం

  • జాతర కంటే ముందే మేడారంలో భక్తుల రద్దీ

  • న్యూజిలాండ్‌తో తొలి వ‌న్డే.. టీమిండియా జ‌ట్టు ఇదే!

  • రేప్ కేసులో అరెస్టైన ఎమ్మెల్యే

  • అంతర్జాతీయ ఉద్రిక్తతలు నేపథ్యంలో భారత రక్షణ బడ్జెట్ పెరుగుతుందా?

Trending News

    • బెంగాలీ మ‌హిళ‌లు ఎక్కువ‌గా ఎరుపు- తెలుపు రంగుల చీర‌లు ఎందుకు క‌ట్టుకుంటారో తెలుసా?!

    • టీమ్ ఇండియాకు భారీ షాక్.. ప్రాక్టీస్ సెషన్‌లో రిషబ్ పంత్‌కు గాయం!

    • తెలంగాణ ఎప్‌సెట్ అభ్యర్థులకు శుభవార్త!

    • అయోధ్యలో కలకలం.. రామ్ మందిర్ ప్రాంగణంలో నమాజ్‌?!

    • ఎస్బీఐ రియల్ టైమ్ ఎక్స్‌ప్రెస్ క్రెడిట్.. 35 లక్షల వరకు పర్సనల్ లోన్!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd