TTD Alert: శ్రీవారి భక్తులు మాస్కులు ధరించాల్సిందే!
కరోనా వ్యాప్తి మళ్లీ మొదలుకావడంతో టీటీడీ (TTD) అధికారులు అలర్ట్ అయ్యారు.
- Author : Balu J
Date : 28-12-2022 - 3:40 IST
Published By : Hashtagu Telugu Desk
వైకుంట ద్వార దర్శనం కోసం తిరుమల (Tirumala)కు వచ్చే భక్తులు తప్పనిసరిగా మాస్కులు ధరించాల్సి ఉంటుందని తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) ప్రకటించింది. జనవరి 2 నుండి 11 వరకు ఆలయ ట్రస్ట్ పవిత్ర దర్శనానికి అనుమతి ఇస్తోంది. దాదాపు ఎనిమిది లక్షల మంది భక్తులు 10 రోజుల పాటు జరిగే ఉత్సవాల్లో శ్రీవారి ఆలయంలో పూజలు నిర్వహిస్తారని అధికారులు భావిస్తున్నారు. జనవరి 1న వైకుంఠ ద్వార దర్శనం ఏర్పాట్లను సమీక్షిస్తూ టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసిన మార్గదర్శకాల దృష్ట్యా వైకుంట ద్వార దర్శనానికి వచ్చే భక్తులు తప్పనిసరిగా మాస్కులు (Masks) ధరించాలని కోరారు. రద్దీగా ఉండే ప్రదేశాలను తరచుగా శానిటైజ్ చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నాం. చైనా, జపాన్, దక్షిణ కొరియాలో కొత్త కోవిడ్ (Covid) వేరియంట్ BF.7 కేసులు అకస్మాత్తుగా పెరగడంతో కేంద్ర ప్రభుత్వాలు నిఘా పెంచాయి. ముందస్తు జాగ్రత్తల చర్యల కారణంగా మాస్కులు, శానిటైజేషన్ పై ద్రుష్టి సారిస్తున్నాం’’ అని ఆయన అన్నారు. కరోనా ప్రభావం ఉన్న నేేపథ్యంలో ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం పలు ఆస్పత్రుల్లో మాక్ డ్రిల్ కూడా నిర్వహించింది.
Also Read: KVS Recruitment 2022: కేవీఎస్ లో పలు పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం!