HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Temperature 2025

Temperature : ఈ సమ్మర్‌లో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు జాగ్రత్త – వాతావరణ కేంద్రం హెచ్చరిక

Temperature : ఈ మూడు నెలలు ముఖ్యంగా ఏప్రిల్, మేలో వడగాలులు తీవ్రంగా ఉంటాయని, ప్రజలు ఎండల నుంచి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది

  • Author : Sudheer Date : 02-03-2025 - 4:12 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
High Temperature
High Temperature

ఈ ఏడాది వేసవి మరింత వేడిగా (Temperature ) ఉండబోతోందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఫిబ్రవరి మొదటి వారంలోనే ఎండలు దంచికొడుతుండడంతో ప్రజలు భయాందోళనకు గురివుతున్నారు. ఇక మార్చి, ఏప్రిల్, మే నెలల్లో సాధారణం కంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ మూడు నెలలు ముఖ్యంగా ఏప్రిల్, మేలో వడగాలులు తీవ్రంగా ఉంటాయని, ప్రజలు ఎండల నుంచి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. గత ఏడాదికంటే ఈ వేసవి మరింత వేడిగా ఉండే అవకాశముందని, కొన్నిచోట్ల ఉష్ణోగ్రతలు 46 నుంచి 48 డిగ్రీల వరకు పెరిగే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు.

నిప్పుల కొలిమిగా మారనున్న నగరాలు

గత కొన్ని సంవత్సరాలుగా వేసవి తీవ్రత పెరుగుతూనే ఉంది. గతంలో మాదిరిగా కేవలం ఫ్యాన్ లేదా కూలర్‌తో చల్లదనం పొందడం కష్టమవుతోంది. ముఖ్యంగా నగర ప్రాంతాల్లో ఉక్కపోత ఎక్కువగా ఉండడంతో ప్రజలు ఎయిర్ కండీషనర్లు (ఏసీ) ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. తెలంగాణలో హైదరాబాద్‌తో పాటు దక్షిణ, మధ్య తెలంగాణ జిల్లాల్లో సాధారణం కంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని అంచనా. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో రాత్రి ఉష్ణోగ్రతలు సైతం పెరగడంతో, రాత్రిళ్లు కూడా ప్రజలు అసౌకర్యాన్ని ఎదుర్కొనే పరిస్థితి ఉంది. గాలిలో తేమ శాతం తగ్గిపోవడం, ఓజోన్ పొర మరింత విచ్ఛిన్నం కావడం ఈ ఉష్ణోగ్రత పెరుగుదలకు ప్రధాన కారణమని నిపుణులు చెబుతున్నారు.

ఏపీ, తెలంగాణలో ఎండల తీవ్రత అధికం

ఈసారి ఏపీ, తెలంగాణలో ఎండలు మరింత భీకరంగా ఉండే అవకాశముంది. తెలంగాణలో భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, ములుగు, మహబూబాబాద్, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు పైగా నమోదయ్యే అవకాశం ఉంది. హైదరాబాద్‌లో గరిష్ట ఉష్ణోగ్రత 36-37 డిగ్రీల వరకు ఉంటుందని, నగరవాసులు ఎండల నుంచి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అదే విధంగా, ఏపీలో తీరప్రాంత ప్రాంతాల్లో ఉక్కపోత అధికంగా ఉండే అవకాశం ఉంది. గుంటూరు, పల్నాడు, కృష్ణ, ఎన్టీఆర్, ఏలూరు జిల్లాల్లో ఉష్ణోగ్రత 40 డిగ్రీల వరకు పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

ప్రజలు తీసుకోవలసిన జాగ్రత్తలు

వేసవి తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం. ముఖ్యంగా ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఎండలో తిరగకుండా ఉండాలి. ఎక్కువ నీటిని తాగడం, చల్లని ఆహార పదార్థాలను తీసుకోవడం ఆరోగ్యానికి మేలు చేస్తుంది. వడదెబ్బ సమస్య తలెత్తకుండా నిమ్మరసం, కొబ్బరి నీరు, బటర్ మిల్క్ వంటి ద్రవ పదార్థాలు అధికంగా తీసుకోవాలి. బయటికి వెళ్లే సమయంలో తల, చెయ్యులు కప్పుకునేలా స్కార్ఫ్ లేదా కులాయిని ఉపయోగించడం మంచిది. పిల్లలు, వృద్ధులు, గర్భిణీ స్త్రీలు ఈ ఎండల ప్రభావానికి గురికాకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రభుత్వ, వైద్య శాఖల సూచనలను పాటించడం ద్వారా వేడిగాలుల ప్రభావం నుంచి రక్షణ పొందవచ్చు.

Web Series : ఏపీ రాజకీయాలపై వెబ్ సిరీస్.. డైరెక్టర్ ఎవరంటే..!


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • 2025 Temperature
  • ap
  • telangana
  • Temperature
  • temperature Today

Related News

Tgpsc Group 3 Results

గ్రూప్-3 ఫలితాలను విడుదల చేసిన టీజీపీఎస్సీ

గ్రూప్ 3 అభ్యర్థులకు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ తీపి కబురు అందించింది. ఉద్యోగాల భర్తీకి సంబంధించి తుది ఫలితాలను గురువారం విడుదల చేసింది.మొత్తం 1,388 పోస్టులకు గాను ప్రస్తుతం 1,370 మంది అభ్యర్థులను ఎంపిక చేసినట్లు కమిషన్ ప్రకటించింది

  • CM Revanth Leadership

    సీఎం రేవంత్ నాయ‌క‌త్వానికి బ్ర‌హ్మ‌ర‌థం!

  • Ration Shop

    రేషన్‌కార్డుదారులకు హెచ్చరిక.. E KYC చేయకపోతే సన్నబియ్యం కట్

  • CM Chandrababu Naidu participated in the Collectors' Conference on the second day

    విద్యలో జ్ఞానంతో పాటు విలువలు ముఖ్యం: కలెక్టర్ల సదస్సులో సీఎం చంద్రబాబు

  • Big announcement at 12 noon..Nara Lokesh's interesting post

    మధ్యాహ్నం 12 గంటలకు భారీ ప్రకటన..నారా లోకేశ్‌ ఆసక్తికర పోస్ట్‌

Latest News

  • డిసెంబర్ 22 న జనసేన ‘పదవి-బాధ్యత’ సమావేశం

  • సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి భారీ ఊరట

  • నిధి అగర్వాల్ చేదు అనుభవం, మాల్ ఆర్గనైజర్లపై కేసు నమోదు

  • ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలపై సీఎం రేవంత్ ఆసక్తికర వ్యాఖ్యలు

  • ఓజీ డైరెక్టర్ కు పవన్ కార్ ఇవ్వడం వెనుక అసలు కథ ఇదే !

Trending News

    • అధిక ఐక్యూ ఉన్న వ్యక్తుల 5 ముఖ్యమైన అలవాట్లు ఇవే!

    • ఆర్‌బీఐ అన్‌లిమిటెడ్ నోట్లను ముద్రిస్తే ఏమ‌వుతుందో తెలుసా?

    • KPHB లులు మాల్‌లో నిధి అగర్వాల్‌కు చేదు అనుభవం

    • స్టాక్ మార్కెట్‌ను లాభ- న‌ష్టాల్లో న‌డిపించే 7 అంశాలివే!

    • మీరు ఆధార్ కార్డును ఆన్‌లైన్‌లో స్వయంగా అప్డేట్ చేసుకోండిలా!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd