HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Temperature 2025

Temperature : ఈ సమ్మర్‌లో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు జాగ్రత్త – వాతావరణ కేంద్రం హెచ్చరిక

Temperature : ఈ మూడు నెలలు ముఖ్యంగా ఏప్రిల్, మేలో వడగాలులు తీవ్రంగా ఉంటాయని, ప్రజలు ఎండల నుంచి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది

  • Author : Sudheer Date : 02-03-2025 - 4:12 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
High Temperature
High Temperature

ఈ ఏడాది వేసవి మరింత వేడిగా (Temperature ) ఉండబోతోందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఫిబ్రవరి మొదటి వారంలోనే ఎండలు దంచికొడుతుండడంతో ప్రజలు భయాందోళనకు గురివుతున్నారు. ఇక మార్చి, ఏప్రిల్, మే నెలల్లో సాధారణం కంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ మూడు నెలలు ముఖ్యంగా ఏప్రిల్, మేలో వడగాలులు తీవ్రంగా ఉంటాయని, ప్రజలు ఎండల నుంచి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. గత ఏడాదికంటే ఈ వేసవి మరింత వేడిగా ఉండే అవకాశముందని, కొన్నిచోట్ల ఉష్ణోగ్రతలు 46 నుంచి 48 డిగ్రీల వరకు పెరిగే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు.

నిప్పుల కొలిమిగా మారనున్న నగరాలు

గత కొన్ని సంవత్సరాలుగా వేసవి తీవ్రత పెరుగుతూనే ఉంది. గతంలో మాదిరిగా కేవలం ఫ్యాన్ లేదా కూలర్‌తో చల్లదనం పొందడం కష్టమవుతోంది. ముఖ్యంగా నగర ప్రాంతాల్లో ఉక్కపోత ఎక్కువగా ఉండడంతో ప్రజలు ఎయిర్ కండీషనర్లు (ఏసీ) ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. తెలంగాణలో హైదరాబాద్‌తో పాటు దక్షిణ, మధ్య తెలంగాణ జిల్లాల్లో సాధారణం కంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని అంచనా. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో రాత్రి ఉష్ణోగ్రతలు సైతం పెరగడంతో, రాత్రిళ్లు కూడా ప్రజలు అసౌకర్యాన్ని ఎదుర్కొనే పరిస్థితి ఉంది. గాలిలో తేమ శాతం తగ్గిపోవడం, ఓజోన్ పొర మరింత విచ్ఛిన్నం కావడం ఈ ఉష్ణోగ్రత పెరుగుదలకు ప్రధాన కారణమని నిపుణులు చెబుతున్నారు.

ఏపీ, తెలంగాణలో ఎండల తీవ్రత అధికం

ఈసారి ఏపీ, తెలంగాణలో ఎండలు మరింత భీకరంగా ఉండే అవకాశముంది. తెలంగాణలో భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, ములుగు, మహబూబాబాద్, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు పైగా నమోదయ్యే అవకాశం ఉంది. హైదరాబాద్‌లో గరిష్ట ఉష్ణోగ్రత 36-37 డిగ్రీల వరకు ఉంటుందని, నగరవాసులు ఎండల నుంచి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అదే విధంగా, ఏపీలో తీరప్రాంత ప్రాంతాల్లో ఉక్కపోత అధికంగా ఉండే అవకాశం ఉంది. గుంటూరు, పల్నాడు, కృష్ణ, ఎన్టీఆర్, ఏలూరు జిల్లాల్లో ఉష్ణోగ్రత 40 డిగ్రీల వరకు పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

ప్రజలు తీసుకోవలసిన జాగ్రత్తలు

వేసవి తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం. ముఖ్యంగా ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఎండలో తిరగకుండా ఉండాలి. ఎక్కువ నీటిని తాగడం, చల్లని ఆహార పదార్థాలను తీసుకోవడం ఆరోగ్యానికి మేలు చేస్తుంది. వడదెబ్బ సమస్య తలెత్తకుండా నిమ్మరసం, కొబ్బరి నీరు, బటర్ మిల్క్ వంటి ద్రవ పదార్థాలు అధికంగా తీసుకోవాలి. బయటికి వెళ్లే సమయంలో తల, చెయ్యులు కప్పుకునేలా స్కార్ఫ్ లేదా కులాయిని ఉపయోగించడం మంచిది. పిల్లలు, వృద్ధులు, గర్భిణీ స్త్రీలు ఈ ఎండల ప్రభావానికి గురికాకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రభుత్వ, వైద్య శాఖల సూచనలను పాటించడం ద్వారా వేడిగాలుల ప్రభావం నుంచి రక్షణ పొందవచ్చు.

Web Series : ఏపీ రాజకీయాలపై వెబ్ సిరీస్.. డైరెక్టర్ ఎవరంటే..!


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • 2025 Temperature
  • ap
  • telangana
  • Temperature
  • temperature Today

Related News

Telangana is emerging as a global leader in the field of AI: Bhatti Vikramarka

ఏఐ రంగంలో తెలంగాణ ప్రపంచానికి మార్గదర్శిగా నిలుస్తోంది: భట్టి విక్రమార్క

కృత్రిమ మేధస్సు (ఏఐ) రంగంలో తెలంగాణ ప్రపంచ దేశాలకు కొత్త దిశానిర్దేశం చేస్తోందని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క మంగళవారం అన్నారు. పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుతో కలిసి హెచ్‌ఐసిసిలో “గ్రీన్ గ్రోత్ ఎకనామిక్ సమ్మిట్ – ది హైదరాబాద్ కలెక్టివ్”ను ప్రారంభిస్తూ, “రాష్ట్రం పెట్టుబడులను ఆకర్షించడమే కాకుండా, పర్యావరణ పరిరక్షణ, సామాజిక బాధ్యతలను కూడ

  • Telangana government takes a serious view of irregularities in the Dharani portal.

    Dharani: ధరణి పోర్టల్ అక్రమాల పై తెలంగాణ సర్కార్ సీరియస్

  • Good news for Singareni workers: Union Minister Kishan Reddy

    Singareni: సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

  • National Status... Palampet Shiva Temple, Mulugu District

    Palampet Shivalaya Temple: జాతీయ హోదా.. ములుగు జిల్లా పాలంపేట శివాలయం

  • Vip Break Darshan For 116 Y

    TTD : 116 ఏళ్ల భక్తికి టీటీడీ గౌరవం .. నవనీతమ్మకు వీఐపీ బ్రేక్ దర్శనం : బీఆర్‌ నాయుడు

Latest News

  • Revanth Reddy: “తాత.. నువ్వు పూరీలు వేస్తేనే తింటాను”

  • Bandi Bhageerath: బండి భగీరథ్‌కు హైకోర్టు బెయిల్ మంజూరు

  • BSNL శాటిలైట్ ఫోన్‌ను విడుదల చేసింది

  • Musi Riverfront: మూసీ పునరుజ్జీవనానికి గ్రీన్ సిగ్నల్.. రూ.7 వేల కోట్లతో ప్రాజెక్టుకు ప్రభుత్వం ఆమోదం

  • Buggana Rajendranath: సీఎం చంద్రబాబు వల్లే వర్షాలు పడడం లేదు మాజీ మంత్రి

Trending News

    • Kissing Day: ఆవేశపూరితమైన ముద్దు నిమిషానికి 6.4 కేలరీల ఖర్చు చేస్తుంది

    • Kalyan Ram : సంక్రాంతి 2027కు సిద్ధమవుతున్న అనిల్ రావిపూడి.. కళ్యాణ్ రామ్ ఫస్ట్ లుక్‌ పోస్టర్ విడుదల !

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd