TDP Super 6 : సూపర్ 6 తో జగన్ లో భయం మొదలైంది – నారా లోకేష్
- By Sudheer Published Date - 09:16 PM, Sat - 17 February 24
సూపర్ 6 (TDP Super 6) తో వైసీపీ అధినేత, సీఎం జగన్ (Jagan) లో భయం మొదలైందన్నారు నారా లోకేష్ (Nara Lokesh) . ఏపీలో ఎన్నికల సమయం దగ్గర పడుతుండడం తో అన్ని పార్టీల అధినేతలు సభలు, సమావేశాలతో బిజీ గా మారారు. అధికార పార్టీ వైసీపీ అధినేత జగన్..ఇప్పటికే సిద్ధం పేరుతో సభలు నిర్వహిస్తూ ప్రజలకు దగ్గర అవుతుండగా..చంద్రబాబు రా కదలిరా అంటూ జనాల్లోకి వెళ్తున్నాడు. ఇక ఇప్పుడు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సైతం శంఖారావం పేరుతో ప్రజలను కలుస్తున్నాడు. వారం రోజులుగా యాత్ర చేస్తున్న లోకేష్..టీడీపీ – జనసేన కార్యకర్తల్లో జోష్ నింపుతూ..టీడీపీ కూటమి వస్తే ఎలాంటి మంచి జరుగుతుందో వివరిస్తూ వస్తున్నాడు. ఇదే క్రమంలో వైసీపీ ఫై విమర్శలు కురిపిస్తూ వస్తున్నారు.
ఈరోజు విజయనగరం జిల్లా శృంగవరపుకోట సభలో పాల్గొన్నారు. టీడీపీ- జనసేన ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక స్థానిక సమస్యల పరిష్కారంలో ముందుంటామని హామీ ఇచ్చారు. సైకో జగన్ పాలనలో ప్రజల కష్టాలు-కన్నీరు నుంచే చంద్రబాబు సూపర్ 6 మ్యానిఫెస్టో వచ్చిందని లోకేష్ అన్నారు. కుర్చి మడతపెడతామంటే అంబటి చాలా బాధపడిపోతున్నారు అది కుర్చి కాదు సింహాసం అని అంటున్నారు. అది సింహాసనమే కానీ దానిపై కూర్చుంది శునకమని లోకేష్ సెటైర్ వేశారు. మద్యపాన నిషేధం చేశాకే ఓట్లు అడుగుతానని జగన్ అన్నారు కాని జగన్ మద్యపాన నిషేధం చేశారా అని ప్రశ్నించారు. పెద్దఎత్తున సంక్షేమ పథకాలు టీడీపీ అమలు చేసిందన్న ఆయన జగన్ చెప్పే అబద్ధాలు నమ్మవద్దు అన్నారు. అధికారంలోకి వచ్చాక శృంగవరపుకోట సమస్యలన్నీ తీర్చుతామన్నారు.
We’re now on WhatsApp. Click to Join.
జగన్కు ఓటమి భయం పట్టుకుంది అందుకే ఎమ్మెల్యే సీట్లను మారుస్తున్నారని.. క్రికెటర్ వైసీపీలోకి వస్తే ఎంతిస్తావని అతన్ని అడగడంతోనే , వాళ్ళ తాకిడి తట్టుకోలేక అతను పారిపోయాడని విమర్శించారు. జగన్ పాలనలో జరిగింది సామాజిక న్యాయం కాదని సామాజిక అన్యాయం అన్నారు. బీసీలంటే జగన్కు చిన్నచూపని ఆపార్టీకి చెందిన ప్రజాప్రతినిధులే చెబుతున్నారంటూ గుర్తుచేశారు. బీసీలకు రావాల్సిన 10 శాతం రిజర్వేషన్ను కూడా ఇవ్వలేదని లోకేష్ మండిపడ్డారు. మాస్క్ అడిగిన డాక్టర్ను పిచ్చోడని ముద్రవేసి చంపేశారు, దళితుడిని హత్య చేసి డోర్ డెలివరీ చేసిన అనంతబాబు జగన్ పక్కన కూర్చుంటారు. ఇలాంటి ఘటనలు ఒక్క జగన్ పాలనలోనే సాధ్యమని లోకేష్ అన్నారు.
Read Also : Mangalagiri : మరో రెండు నెలల్లో మంగళగిరి రూపు రేఖలు మారిపోతాయి – నారా బ్రాహ్మణి
Tags
Related News
AP : ఏపీ ఫలితాలపై తొలిసారి స్పందించిన జగన్
బెంజ్ సర్కిల్లోని ఐప్యాక్ కార్యాలయానికి వెళ్లిన జగన్.. వారితో కాసేపు ముచ్చటించారు. వైసీపీ మరోసారి అధికారంలోకి రాబోతుందని, మరోసారి చరిత్ర సృష్టించబోతున్నామని సీఎం జగన్ పేర్కొన్నారు