MP Kanakamedala: బీజేపీలోకి టీడీపీ ఎంపీ కనకమేడల?
తెలుగుదేశం రాజ్యసభ సభ్యుడు ఎంపీ కనకమేడల రవీంద్ర బీజేపీలోకి వెళుతున్నారంటూ సోషల్ మీడియా కోడైకూస్తోంది.
- By CS Rao Published Date - 03:55 PM, Mon - 1 August 22
తెలుగుదేశం రాజ్యసభ సభ్యుడు ఎంపీ కనకమేడల రవీంద్ర బీజేపీలోకి వెళుతున్నారంటూ సోషల్ మీడియా కోడైకూస్తోంది. ఆయన క్యాసినో కింగ్ చికోటి ప్రవీణ్ ఎపిసోడ్ లో ఉన్నారని ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే కనకమేడలకు ఈడీ నోటీసులు జారీ చేసిందని తెలుస్తోంది. అందుకే, వాషింగ్ పౌడర్ నిర్మా సూత్రాన్ని కనకమేడల ఎంచుకున్నాడని సోషల్ మీడియాలో న్యూస్ హల్ చల్ చేస్తోంది. దేశ విదేశాలలో కాసినోల నిర్వహణ , అసాంఘిక కార్యకలాపాల నిర్వహణలో ఆరితేరిన చికోటి ప్రవీణ్ ఇటీవల తెలుగు రాష్ట్రాల నుంచి జూదరులు , అమ్మాయిలని విదేశాలకు తరలించారని తెలుస్తోంది. అంతేకాదు, పెద్ద ఎత్తున హవాలా మార్గంలో లావాదేవీలు నడిపడాన్ని నిగ్గు తేల్చడానికి ఈడీ విచారణ కనసాగిస్తోంది. ఈ విచారణ సందర్బంగా బయటపడిన కనమేడల వ్యవహారం టీడీపీని చిక్కుల్లో పడేసిందని ప్రత్యర్థుల ప్రచారం చేస్తున్నారు.
జూదరులను , విలాస పురుషులను, వారికి సేవలందించేందుకు అమ్మాయిలను పలు విమానాశ్రయాల నుంచి విఐపి పాస్ ల ద్వారా తరలించేవాడు . ఆ క్రమంలో హైదరాబాద్ ఎయిర్పోర్ట్ నుండి తీసుకెళ్లే జూదరులు , అమ్మాయిలను ఎయిర్పోర్ట్ ఫ్రొటోకాల్ ఆఫీసర్ రోహన్ ద్వారా తరలించే వాడు. రాజ్యసభ సభ్యుడు కనకమేడల పాస్ ఉపయోగించి ప్రోటోకాల్ తో రోహన్ తీసుకెళ్లారని ఈడీ గుర్తించిందట. ప్రవీణ్ తో వ్యాపార భాగస్వామిగా ఉన్న సంపత్ కూడా ఈడీ విచారణ ఎదుర్కొంటున్నాడు. అతని ఖాతా నుండి కనకమేడల ప్రోటోకాల్ ఆఫీసర్ రోహన్ కు పలు దఫాలుగా డబ్బు బదిలీ జరిగిందని ఈడీ అనుమానిస్తోంది. అందుకే, చికోటి ప్రవీణ్ కేసులో కనకమేడల కు సంబంధం ఉందా? అనే ప్రశ్న ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా ఎదురువుతోంది. కనకమేడల ఆదేశాల మేరకే రోహన్ ఎంపీ ప్రోటోకాల్ వాడి చికోటి ప్రవీణ్ తరుపు వాళ్ళను ప్రోటోకాల్ లో తీసుకెళ్లాడని నిర్థారణకు ఈడీ వస్తుందట.
రోహన్ ఖాతాలో ట్రాన్పఫర్ అయిన క్యాష్ తో పాటు నగదు పెద్ద మొత్తంలో చేతులు మారిందని ఈడీ అధికారులు అనుమానపడుతున్నారని తెలుస్తోంది. ఈ కేసు నుంచి తప్పించుకోవటానికే కనకమేడల హడావుడిగా బీజేపీలో చేరటానికి ప్రయత్నం చేస్తున్నాడని సోషల్ మీడియా వేదికగా హల్ చల్ చేస్తోన్న న్యూస్. దీనిపై టీడీపీలోని ఒక కీలక వ్యక్తిని ప్రశ్నించగా ఇదంతా వైసీపీ వాళ్లు చేస్తోన్న ప్రచారంగా కొట్టిపారేశారు. చికోటితో వైసీపీ ఎమ్మెల్యేలకు ఉన్న సంబంధం బయటకు రావడాన్ని కప్పిబుచ్చుకోవడానికి కనకమేడల ఎపిసోడ్ ను వైసీపీలోని కొందరు కట్టుకథను అల్లారని చెప్పడం కొసమెరపు.
Related News
AP TDP: ‘టీడీపీ ఫర్ ఆంధ్ర వెబ్సైట్’ ను ప్రారంభించిన చంద్రబాబు, విరాళాల కోసం ప్రజలకు విజ్ణప్తి
AP TDP: ఏపీలో ఎన్నికలు సమీపిస్తుండటంతో ప్రధాన పార్టీలు తమ ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. వైసీపీ మేమంతా సిద్ధం పేరుతో బస్సు యాత్రకు శ్రీకారం చుట్టగా, టీడీపీ ప్రజాగళం పేరుతో వరుసగా సభలు, సమావేశాలు నిర్వహిస్తూ ప్రచారం దూసుకుపోతోంది. వచ్చే ఎన్నికల్లో గెలుపొందేకు టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి పార్టీకి విరాళలందించేందుకు గాను tdpforandhra.com సైట్ ను మంగళవారం ఆవిష్కరించారు. విరాళా�