TDP : చంద్రబాబు నాయుడు అరెస్టును వ్యతిరేకిస్తూ మరో కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన టీడీపీ.. “కాంతితో క్రాంతి” పేరుతో నిరసన
టీడీపీ అధినేత చంద్రబాబు అక్రమ అరెస్ట్కు నిరసనగా టీడీపీ మరో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. గుడ్డి ప్రభుత్వం
- By Prasad Published Date - 12:19 PM, Fri - 6 October 23
టీడీపీ అధినేత చంద్రబాబు అక్రమ అరెస్ట్కు నిరసనగా టీడీపీ మరో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. “గుడ్డి ప్రభుత్వం కళ్లు తెరిపిద్దాం “ అనే నినాదంతో “కాంతితో క్రాంతి” అనే కార్యక్రమాన్ని రేపు (శనివారం) నిర్వహించనున్నారు. శనివారం సాయంత్రం నిరసన. ఇళ్లలో లైట్లు ఆర్పివేయాలని, బయటకు వచ్చి మొబైల్ టార్చ్ లైట్లు లేదా క్యాండిల్ లైట్లు వెలిగించాలని టీడీపీ అధిష్టానం ప్రజలకు విజ్ఞప్తి చేసింది. శుక్రవారం ఉదయం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్తో జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. గతంలో ఈలలు, డప్పులు, బెల్లు కొట్టి నిరసనలు “మోత మోగిద్దాం” కారక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ప్రజలు విజయవంతం చేశారని టీడీపీ తెలిపింది. ప్రజలు శాంతియుతంగా ఆందోళనలు చేస్తున్నప్పుడు కూడా పోలీసులు వారిపై కేసులు బనాయించిన విషయాన్ని పార్టీ నేతలు లోకేష్కు వివరించారు.
We’re now on WhatsApp. Click to Join.
గురువారం సాయంత్రం లోకేష్ గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నప్పటి నుంచి పోలీసులు కొత్త ఆంక్షలు విధించారు. లోకేష్ కాన్వాయ్ను అనుసరించేందుకు పార్టీ నేతలు, కార్యకర్తలను అనుమతించలేదు. మళ్లీ శుక్రవారం నాడు చంద్రబాబు నాయుడును కలిసేందుకు లోకేష్ రాజమహేంద్రవరం వెళ్లగా, కొల్లు రవీంద్ర, దేవనేని ఉమ వంటి నేతలు ఆయనను అనుసరించాలని భావించారు. అయితే వారిని పోలీసులు హైవేపై అడ్డుకున్నారు. దీంతో నాయకులకు, పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగి రోడ్డుపై బైఠాయించారు. రాజమహేంద్రవరం వెళ్లే మార్గంలో పోలీసులు చెక్పోస్టుల వద్ద అన్ని వాహనాలను తనిఖీ చేస్తున్నారు. నారా భువనేశ్వరిని కలుసుకుని సంఘీభావం తెలిపేందుకు వెళ్లాలనుకున్న రైతులను కూడా మూడు బస్సులు ఆపి క్షుణ్ణంగా తనిఖీ చేసి వెళ్లేందుకు అనుమతించారు.
Also Read: AP : చంద్రబాబు బెయిల్ పిటిషన్, కస్టడీ పిటిషన్లపై నేడు ACB కోర్టులో వాదనలు
Related News
AP Election Result 2024: జగన్ vs చంద్రబాబు… ప్రజలు ఎవర్ని నమ్మారు ?
ఆంధ్రప్రదేశ్లో 175 అసెంబ్లీ స్థానాలు, 25 లోక్సభ స్థానాలకు ఏకకాలంలో ఎన్నికలు ముగిసాయి. ఈ ఎన్నికలను అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ మధ్య ఆధిపత్య పోరుగా రాజకీయ పండితులు పేర్కొంటున్నారు. 2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 151 స్థానాల్లో విజయం సాధించడం గమనార్హం.